Home » Medical News
మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత అంబటి రాంబాబుకు పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. మెడికల్ కాలేజీల పీపీపీ మోడల్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలో బారికేడ్లు తోసుకుని వెళ్లిన ఘటనపై గతంలోనే అంబటి రాంబాబుపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
వైద్యం వికటించి రోగి మృతిచెందిన వార్తలు మనం చూస్తునే ఉంటాం. కానీ ఒకే పేరున్న మరో రోగికి ఇచ్చే మందులను పొరపాటున ఆ రోగికి మందుల చీటీలో రాసివ్వడం వల్ల ఒక వృద్ధుడు మృత్యువాత పడ్డారు. అసలేం జరిగిందంటే...
కొందరికి మాట పెగలడం కష్టమైపోతోంది. సైగలతో సరిపెడుతున్నారు. ఇంకొందరు మళ్లీ మాట్లాడతామంటూ వెళ్లిపోతున్నారు. సెల్ఫోన్లలో చాటింగ్కు ప్రాధాన్యమిస్తున్నారు. ఇదంతా ఎందుకంటే.. వాళ్ల గొంతులన్నీ బొంగురుపోయాయి.
గత 9 నెలల కాలంలో ప్రసవ సమయంలో ఆరుగురు తల్లులు, 127 మంది శిశువులు,ఐదేళ్ల లోపు చిన్నారులు 10 మంది మృత్యువాత పడడం వైద్యశాఖ దీన పరిస్థితికి అద్దం పడుతోంది.
ప్రభుత్వ రాయితీలతో (వైద్య విద్య) పీజీ పూర్తిచేసిన వారు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాసేవ చేయాలని సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ తోట త్రిమూర్తులు స్పష్టంచేశారు.
పేద ప్రజలకు అత్యాధునిక వైద్యాన్ని అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వ్యాఖ్యానించారు. అమెరికాకు చెందిన తులసి థెరప్యుటిక్స్ సహకారంతో ఈ ల్యాబ్ను ఏర్పాటు చేసుకున్నామని వెల్లడించారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఓపీ, ఐపీ, ఇతర సేవలు గతంతో పోలిస్తే 12శాతం పెరిగాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. రోగులు అధిక శాతం ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చేలా చేయగలిగామని పేర్కొన్నారు..
ఈ రోజుల్లో ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా వెంటనే మెడికల్ స్టోర్కు వెళ్లి మాత్రలు, సిరప్లు తెచ్చుకోవడం సర్వసాధారణం అయ్యింది. జీవనోపాధికి సొంతంగా మెడికల్ స్టోర్ పెట్టాలని చాలా మందికి ఉన్నా.. మెడిసిన్స్ విషయంలో అనుభవం ఉండాలేమో, అనుమతి ఎలా లభిస్తుందన్న గందరగోళంలో ఉన్నారు.
మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని విరమించుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు.
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘన్పూర్ ప్రాంతంలో ఉన్న ఓ ఆస్పత్రిలో చోటుచేసుకున్న అమానుష ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. వైద్య చికిత్స కోసం వచ్చిన ఓ మహిళపై వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి, శస్త్రచికిత్సను మధ్యలోనే నిలిపివేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది.