Home » Medaram Jathara
ఆదివాసీల కుంభమేళా మేడారం మహాజాతరకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిధులు ఇవ్వడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆలోచించాలని సీఎం రేవంత్రెడ్డి కోరారు.
వెయ్యేళ్ల చరిత్ర గల మేడారం దేవాలయ విశిష్టత మరో వెయ్యేళ్లపాటు వెలుగొందేలా అభివృద్ధి పనులు చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారని మంత్రి సీతక్క వెల్లడించారు. ఈ మేరకు మేడారం కీర్తి, గొప్పతనాన్ని విశ్వవ్యాప్తం చేసేలా అభివృద్ధి పనులు చేపడతామని పేర్కొన్నారు.
మేడారం జాతరపై ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని సీతక్క కౌంటర్ ఇచ్చారు. కొందరు స్వార్థం కోసం మేడారంపై ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
మేడారంలో చేపట్టనున్న అభివృద్ధి పనులను వంద రోజుల్లో పూర్తి చేయాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. జంపన్న వాగులో నీరు నిలిచేలా ప్రాంతాల వారీగా ఎక్కడికక్కడ చెక్ డ్యామ్ల నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
అతిపెద్ద గిరిజన వేడుక మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు ప్రభుత్వం రూ.150 కోట్లను మంజూరు చేసింది.
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం అడవుల్లో సుమారు 50 వేల చెట్లు నేలమట్టమయ్యాయి.
Telangana: తెలంగాణ కుంభమేళాగా పిలవడే మేడారం సమక్క-సారలమ్మ మహా జాతర అంగరంగ వైభవంగా జరిగింది. లక్షలాది మంది భక్తులు మేడారంకు విచ్చేసి గద్దెలపై కొలువుదీరిన అమ్మవార్లను దర్శించుకుని... మొక్కలు చెల్లించుకున్నారు. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు నాలుగు రోజుల పాటు మేడారం జాతర జరిగింది. అయితే జాతర ముగిసిన తర్వాత మాత్రం అక్కడి పరిసరాలను చూస్తే ముక్కులు మూసుకోకమానరు.
Telangana: తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమక్క సారక్క మహా జాతర వైభవంగా ముగిసింది. ఈనెల 21 నుంచి 24 వరకు నాలుగు రోజుల పాటు జరిగిన ఈ జాతరలో లక్షలాది మంది భక్తులు సమక్క - సారలమ్మ దర్శించుకుని తమ మొక్కు తీర్చుకున్నారు. తాజాగా జాతరలో భక్తులు అమ్మవార్లకు వేసిన కానుకల హుండీ లెక్కింపు మొదలైంది. గురువారం హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో మేడారం హుండీలు లెక్కింపు ప్రారంభమైంది.
వరంగల్: మేడారం హుండీల లెక్కింపు ప్రక్రియ గురువారం హనుమకొండ టీటీడీ కళ్యాణమండపంలో ప్రారంభం కానుంది. మొత్తం 512 హుండీల ఆదాయాన్ని లెక్కించనున్నారు. ఈ లెక్కింపు ప్రక్రియ పది రోజుల పాటు కొనసాగనుంది.
నేడు మేడారం నుంచి హుండీలను హన్మకొండకు తరలించనున్నారు. హన్మకొండలోని టీటీడీ కల్యాణ మండపానికి తరలించి అక్కడ హుండీ ఆదాయాన్ని దేవాదాయ శాఖ అధికారులు లెక్కించనున్నారు. 29 నుంచి మేడారం హుండీల లెక్కింపు ప్రారంభం కానుంది. మేడారం మహాజాతరలో మొత్తం 512 హుండీలను అధికారులు ఏర్పాటు చేశారు.