Home » Medaram Jatara
మేడారంలో భక్తులు ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. జాతర ప్రారంభం రోజైన బుధవారం భక్తులు పెద్దసంఖ్యలో ఉంటారనే భావనతో చాలామంది ముందస్తుగానే మేడారాని చేరుకుని తమతమ మొక్కులతను చెల్లించుకుంటున్నారు. దీంతో మేడారం భక్తజన గూడారంగా మారిపోయింది.
మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు సర్వం సిద్ధమైంది. రేపటినుంచి జాతర జరగనుంది. దాదాపు కోటిమందికి పైగా భక్తులు విచ్ఛేస్తారని అంచనా. అయితే.. జాతర సమయంలో రద్దీ ఉంటుందనే భావనతో.. భక్తులు ముందుగానే అమ్మవార్లను దర్శించుకుంటున్నారు.
మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరలో ఈసారి మొత్తం 600 హుండీలను ఏర్పాటుచేస్తున్నారు. ప్రధానంగా సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద ఓ హుండీని ఏర్పాటుచేయగా.. జాతర ప్రాంగణంలో మొత్తం 600 హుండీలను ఏర్పాటు చేస్తున్నారు.
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు హైదరాబాద్ సిటీ బస్సులు కేటాయించారు. రేపటి నుంచి మహా జాతర జరగనుంది. అయితే.. నగరంలోని ఆయా డిపోల నుంచి సిటీ బస్సులను కేటాయించారు. సిటీ బస్సులను ఆయా డిపోలకు కేటాయించారు.
మేడారం మహాజాతర వేళ అద్భుతమైన సన్నివేశం ఆవిష్కృతమైంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారంలో సమ్మక్క- సారలమ్మ అమ్మవార్ల గద్దెల వద్ద న్యూజిలాండ్ కళాకారులు చేసిన సందడి చేశారు..
ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర, ‘తెలంగాణ కుంభమేళ’గా పిలిచే మేడారం మహాజాతర జోరు అనధికారికంగా నెల రోజుల ముందే మొదలయ్యింది. ఈసారి జాతర అందరికీ సరికొత్తగా కనిపించనుంది.
మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం భూపాలపల్లి డిపో పరిధిలో మొత్తం నాలుగు క్యాంపులు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ హిందు తెలిపారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు.
మేడారం మహాజాతరకు భక్తులు కొంతమంది కాలినడకన చేరుకుంటున్నారు. కోరిన కోర్కెలు తీర్చే తల్లులుగా పేరుందిన సమ్మక్క-సారలమ్మ మహాజాతర ఈనెల 28, 29, 30, 31 తేదీల్లో జరుగనుంది. అయితే.. కొంతమంది తమ మొక్కుల ప్రకారం మేడారానికి కాలినడకన బయలుదేరుతున్నారు.
భక్తులతో మేడారం కిటకిటలాడుతోంది. జాతరకు సమయం దగ్గరపడడంతో.. భక్తులు ముందస్తుగానే చేరుకుని తమతమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. దీంతో మేడారం కిటకిటలాడుతోంది. నిన్న ఒక్కరోజే 3 లక్షల మందికి పైగా భక్తులు విచ్చేసినట్లు అధికార వర్గాలు తెలుపుతున్నాయి.
గిరిజన కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, గిరిజన మంత్రిత్వ శాఖలు రూ.3.70 కోట్ల నిధులు విడుదల చేసింది.