Home » Medaram Jatara
సమ్మక్క-సారలమ్మల నామస్మరణతో మేడారం మహా జాతర (Medaram Maha Jatara) వైభవంగా జరుగుతోంది. అమ్మవార్లకు పసుపు, కుంకుమ, ఎత్తు బంగారాలను భక్తులు సమర్పిస్తున్నారు. అయితే జాతరలో రెండో రోజు జాతరలో అత్యంత కీలక ఘట్టం ప్రారంభమైంది. వనం వీడి జనం మధ్యలోకి సమ్మక్క బయలుదేరింది. ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య నేతృత్వంలో పూజారుల బృందం చిలుకల గుట్ట సమీపంలోకి చేరుకుంది.
Telangana: మేడారం జాతరను జాతీయ హోదా పండుగగా గుర్తించలేమంటూ కేంద్రమంత్రి కిషన్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఏబీఎన్ -ఆంధ్రజ్యోతితో బీఆర్ఎస్ నేత సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ... బీజేపీకి గిరిజనులపై ప్రేమలేదన్నారు. బీజేపీ కపటప్రేమ బయటపడిందని మండిపడ్డారు.
Telangana: మేడారం సమక్క - సారలమ్మ మహా జాతర కీలక ఘట్టానికి చేరిందని మంత్రి సీతక్క తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కోయ పూజారులు ఉపవాసం ఉండి పూజా కార్యక్రమాలు చేస్తారని తెలిపారు. సాయంత్రం 5 గంటల నుంచి చిలకలగుట్టలో పూజలు ప్రారంభమవుతాయన్నారు.
Telangana: మేడారం జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. భక్తులు వేయికళ్లతో ఎదురుచూస్తున్న తరుణం ఆసన్నమైంది. మేడారంలో సమ్మక్క ఆగమన పూజలు ప్రారంభమయ్యాయి. గద్దెపై కంకవణాన్ని కోయపూజారులు ప్రతిష్టించారు.
Telangana: దేశంలోనే రెండవ అతిపెద్ద జాతర, తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమక్క-సారక్క జాతర భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. రెండేళ్లకు ఒకసారి జరిగిన ఈ జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి భక్తులు విచ్చేస్తుండటంతో మేడరం భక్తజనసంద్రంగా మారింది.
Sammakka Saralamma Jatara 2024 Live Updates: ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం మహా జాతరకు దేశ వ్యాప్తంగా భక్తులు పోటెత్తారు. లక్షలాది మంది అమ్మవార్ల గద్దెలను దర్శించుకుంటున్నారు.
Telangana: మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని మంత్రి సీతక్క తెలిపారు. బుధవారం ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. ఎద్దుల బండ్ల నుంచి హెలికాప్టర్ వినియోగించే వరకు జాతర తీరు మారిందన్నారు. సమ్మక్క, సారలమ్మ పూజలు రహస్యంగా జరుగుతాయన్నారు.
మేడారం కిక్కిరిసింది.. జనసంద్రంగా మారిపోయింది. దారులన్నీ అటువైపే అన్నట్టుగా అక్కడి పరిస్థితులు తలపిస్తున్నాయి. నేడు మహాజాతర ప్రారంభం సందర్భంగా సమ్మక్క-సారలమ్మల భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో ఆలయం ప్రాంగణాలన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తులు పెద్ద సంఖ్యలో స్నానాలు ఆచరిస్తున్నారు.
Telangana: తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమక్క-సారక్కా జాతర ఈరోజు నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. మేడారం జాతరకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఈ విషయంపై టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. మేడారం జాతరకు ఆర్టీసీ 6000 ప్రత్యేక బస్సులు నడుపుతోందన్నారు.
రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ వన జాతరకు ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ మొదటిసారి అధికారం చేపట్టడం, అనంతరం ఈ జాతర జరగుతుండటంతో రేవంత్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.