Home » Medaram Jatara
మేడారం ఆలయ అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆలయ పనులపై జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
తన మీద సహచర మంత్రులు ఫిర్యాదు చేశారని నమ్మడం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. తాను అంటే ఏంటో అందరికీ తెలుసునని తెలిపారు.
మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , కొండా సురేఖ మధ్య మేడారం ఆలయ టెండర్ల వార్ నడుస్తోంది. మంత్రి పొంగులేటిపై సీఎం రేవంత్రెడ్డికి కొండా సురేఖ ఫిర్యాదు చేశారు.
మేడారం సమ్మక్క - సారలమ్మ అమ్మవార్ల గద్దెల ప్రాంగణ నిర్మాణాన్నిరూ.236 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. ఆదివాసీ గిరిజన జాతర మేడారం సమ్మక్క - సారలమ్మ గద్దెలు, ప్రాంగణ పునరుద్ధరణకు సంబంధించిన ప్రణాళిక నమూనాను ముఖ్యమంత్రి విడుదల చేశారు.
ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను, విశ్వాసాలను పరిగణనలోకి తీసుకునే మేడారం ఆలయ అభివృద్ధి ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. పోరాటానికి, పౌరుషానికి స్ఫూర్తి సమ్మక్క - సారలమ్మ అమ్మవార్లని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ నెల 23వ తేదీన మేడారంలో పర్యటించనున్నారు. మేడారం అభివృద్ధిపై క్షేత్రస్థాయిలో సందర్శించి పలు సూచనలు చేయనున్నారు.
వెయ్యేళ్ల చరిత్ర గల మేడారం దేవాలయ విశిష్టత మరో వెయ్యేళ్లపాటు వెలుగొందేలా అభివృద్ధి పనులు చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారని మంత్రి సీతక్క వెల్లడించారు. ఈ మేరకు మేడారం కీర్తి, గొప్పతనాన్ని విశ్వవ్యాప్తం చేసేలా అభివృద్ధి పనులు చేపడతామని పేర్కొన్నారు.
మేడారం జాతరపై ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని సీతక్క కౌంటర్ ఇచ్చారు. కొందరు స్వార్థం కోసం మేడారంపై ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 13వ తేదీన మేడారంలో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా మేడారం అభివృద్ధి పనులపై సీఎం రేవంత్రెడ్డి సమీక్ష చేయనున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి మేడారం అభివృద్ధికి ముందు నుంచే ప్రణాళికలు చేస్తున్నారని మంత్రి సీతక్క తెలిపారు. గద్దెల మార్పుపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.