Home » Medaram Jatara
సమ్మక్క-సారలమ్మలు కొలువై ఉన్న మేడారంలో జాతరకు ముందు నిర్వహించిన ఆయా పనుల్లో నాణ్యత లోపించిందనే విమర్శలొస్తున్నాయి. కోట్లాది రూపాయలతో నిర్వహించిన ఈ పనుల్లో నాణ్యత లోపించడంతో నెలరోజుల వ్యవధిలోనే అవి మరమ్మతులకు గురవడం పట్ల పలు విమర్శలొస్తున్నాయి.
మేడారం మహాజాతర ముగిసింది. అయితే.. జాతరకు విచ్చేసిన వారు వదిలివెళ్లిన వ్యర్థాలతో అంటురోగాలు ప్రబలే అవకాశం ఉంది. దీంతో.. ఈ చెత్తను తొలగించేందుకు దాదాపు 5వేల మంది సిబ్బందితో పనులు నిర్వహిస్తున్నారు.
మేడారం సమక్క - సారక్క అమ్మవార్ల మహాజాతర విజయవంతమైందని తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. జాతరకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారని చెప్పుకొచ్చారు.
రెండేళ్లకోసారి జరిగే మేడారం మహా జాతర భక్త కోటికి పండగే అయ్యింది. నాలుగు రోజుల పాటు సాగిన మేడారం మహా జాతర ముగిసింది.
మేడారం జాతర.. ఎంతగానో మారింది.. గతంతోపోలిస్తే చాలా మార్పులు చోటుచేసుకున్నాయని డీజీపీ శివధర్రెడ్డి అన్నారు. 1996లో తాను ట్రైనీ ఐపీఎస్గా ఉన్నప్పుడు మేడారం వచ్చానని, అప్పటికీ ఇప్పటికీ జాతరలో చాలా మార్పులు వచ్చాయన్నారు.
సాధారణంగా మేడారం మహాజాతరలో ఎప్పుడూ రెండోరోజే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సమ్మక్క గద్దె చేరిన 24 గంటల తర్వాత జాతర పలుచబడుతుంది.
తన భక్తుల మీద వరములు చిలకరించేందుకు చిలుకలగుట్ట నుంచి కదిలివచ్చింది సమ్మక్క తల్లి! తనను నమ్ముకున్న భక్తులకు కష్టాల చీకట్లను తరమికొట్టి, వారిని సల్లంగ చూసేందుకు చల్లని పున్నమి వెన్నెల కాంతుల నడుమ మేడారం గద్దెపై ఆసీనురాలైంది.
సమ్మక్క తల్లి గురువారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో గద్దెపైకి చేరుకున్నారు. జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ గాల్లోకి కాల్పులు జరిపి అధికారికంగా సమ్మక్కకు స్వాగతం పలికారు.
లక్షలాది మంది భక్తులు నిలువెల్లా కనులై ఎదురుచూస్తున్న సారలమ్మ బుధవారం ఆదివాసీ సంప్రదాయాల మధ్య అట్టహాసంగా మేడారంలోని గద్దెపైకి చేరుకుంది. దీనితో మహా జాతర తొలిఘట్టం ప్రశాంతంగా పూర్తయినట్టయింది.
మేడారం మహాజాతరకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఈరోజు సాలరమ్మ గద్దెపైకి చేరుకోనున్నారు. లక్షలాదిగా తరలివస్తున్న భక్తులు వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.