Home » Mandipalli Ram Prasad Reddy
ఏపీని క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఏపీ క్రీడా, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఏపీలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని తెలిపారు.
ఏపీఎస్ఆర్టీసీకి ప్రతిష్టాత్మక గవర్నెన్స్ నౌ - 6వ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సమ్మిట్ అవార్డు రావడం గర్వకారణమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ అన్నారు. ఈ విజయం ఆర్టీసీ అధికారులు, సూపర్వైజర్లు, సిబ్బంది అందరూ ప్రజలకు అంకితభావంతో అందిస్తున్న సేవలకు నిదర్శనమని అభివర్ణించారు.
విద్య, ఐటీ రంగాల్లో రాయచోటిని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. రానున్న మూడేళ్లలో రాయచోటిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వపరంగా పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు..
తనకు పార్టీ, రాయచోటి నియోజకవర్గ ప్రజలు రెండు కళ్లలాంటివని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాయచోటి విషయంలో బాధ పడుతున్నట్లు సీఎం చంద్రబాబు కూడా చెప్పారని పేర్కొన్నారు.
క్రీడా రంగం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తీసుకుంటున్న నిర్ణయాలు చారిత్రాత్మకమైనవి అని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ అన్నారు. యువ క్రీడాకారులకు ప్రోత్సాహకంగా తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్ తరాలకు ఆదర్శమని తెలిపారు.
15 ఏళ్ల పాలనలో అభివృద్ధి, పరిపాలన, ప్రజా సేవకు కొత్త ప్రమాణాలు సృష్టించారని.... ఆధునిక ఆంధ్రప్రదేశ్ రూపకర్త, దూరదృష్టి కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని కొనియాడారు.
అధికార మదంతో అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకుని, భక్తుల విశ్వాసంతో చెలగాటమాడారని మంత్రి మండిపల్లి మండిపడ్డారు. స్వామి వారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు నాణ్యమైన భోజనం కూడా కష్టమయ్యే పరిస్థితిని సృష్టించిన పాపం గత పాలకులదే అంటూ దుయ్యబట్టారు.
ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఉద్ఘాటించారు. ఆటో డ్రైవర్ ఒక కుటుంబాన్ని ఏ విధంగా సురక్షితంగా ఇంటికి చేరుస్తారో.. అలాగే సీఎం చంద్రబాబు ఏపీని కూడా సురక్షితంగా ఉంచుతున్నారని పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు.
ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారని.. ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశించారు.
విశాఖపట్నంలో ఏపీఎస్ ఆర్టీసీ బస్సు అగ్నిప్రమాదానికి గురైన సమాచారాన్ని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలుసుకున్నారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంత్రి మండిపల్లి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక సూచనలు చేశారు.