Home » Mandipalli Ram Prasad Reddy
ఏపీలో 24 గంటల్లోనే కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ పూర్తి చేయనున్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ కొత్త విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు.
పెట్రోల్, డీజిల్ సరఫరాలో తాత్కాలిక అంతరాయాలు ఉన్నప్పటికీ రవాణా సేవలు ఆగకూడదని అధికారులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశించారు. రవాణా సంస్థలు అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కనుసన్నల్లోనే పెద్ద దస్తగిరి హత్య జరిగిందని ఆరోపించారు.
మార్కాపురంలో జరిగిన బస్సు ప్రమాద ఘటనా స్థలిని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరిశీలించారు. బస్సు ప్రమాద ఘటన బాధాకరమని, మృతుల కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి తెలిపారు.
విజయవాడలో ఈరోజు సాయంత్రం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆత్మీయ సమావేశం జరగనుందని, ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరుకానున్నట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
ఏపీఎస్ఆర్టీసీ పనితీరుపై సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రశంసలు కురిపించారు. సీఎం ప్రశంసలతో తమకు బాధ్యత మరింత పెరిగిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు..
ఏపీని క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఏపీ క్రీడా, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఏపీలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని తెలిపారు.
ఏపీఎస్ఆర్టీసీకి ప్రతిష్టాత్మక గవర్నెన్స్ నౌ - 6వ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సమ్మిట్ అవార్డు రావడం గర్వకారణమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ అన్నారు. ఈ విజయం ఆర్టీసీ అధికారులు, సూపర్వైజర్లు, సిబ్బంది అందరూ ప్రజలకు అంకితభావంతో అందిస్తున్న సేవలకు నిదర్శనమని అభివర్ణించారు.
విద్య, ఐటీ రంగాల్లో రాయచోటిని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. రానున్న మూడేళ్లలో రాయచోటిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వపరంగా పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు..
తనకు పార్టీ, రాయచోటి నియోజకవర్గ ప్రజలు రెండు కళ్లలాంటివని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాయచోటి విషయంలో బాధ పడుతున్నట్లు సీఎం చంద్రబాబు కూడా చెప్పారని పేర్కొన్నారు.