Home » Mandipalli Ram Prasad Reddy
రాయచోటి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా మండి పల్లి రాంప్రసాద్రెడ్డి ఎంపిక కావడంతో మండిపల్లి భవన్ వద్ద శనివారం టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బాణసంచా పేలుస్తూ సంబరాలు చేసు కున్నారు.
AP Election 2024: సార్వత్రిక ఎన్నికలకు టీడీపీ సిద్ధమైంది. ఈ ఎన్నికల్లో వైసీపీతో తలపడేందుకు రేసుగుర్రాలను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు శనివారం ఉండవల్లిలో సంయుక్తంగా తొలిజాబితా అభ్యర్థులను ప్రకటించారు. ఈ సందర్భంగా తంబళ్లపల్లె, పీలేరు, రాయచోటి నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. మిగతా నియోజకవర్గాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. అభ్యర్థులను ప్రకటించిన మూడు నియోజకవర్గాల్లోనూ టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి..