Home » Mamata Banerjee
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై దాడి జరగడంపై ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 'పాలకులు హంతకులుగా మారుతున్నారు. బీజేపీకి ఇది సిగ్గుచేటు' అంటూ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో మండిపడ్డారు.
పశ్చిమ బెంగాల్లోని ఫల్తా నియోజకవర్గ తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి జహంగీర్ ఖాన్.. పార్టీ అధినేత మమతా బెనర్జీకి షాక్ ఇచ్చారు. మే 21న జరగనున్న రీపోలింగ్ నుంచి తాను వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓటమిని చవిచూడటంతో పార్టీని కొత్తగా నిర్మించాలని ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ నిర్ణయించుకున్నారు. పార్టీలో ఉండాలనుకునే వాళ్లు ఉండవచ్చని, వద్దనుకునే వాళ్లు నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చని స్పష్టం చేశారు.
బెంగాల్ ఎన్నికల అనంతరం ఆ రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనల విషయంలో పోలీసులపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, మాజీ సీఎం మమతాబెనర్జీ విరుచుకుపడ్డారు.
బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ కలకత్తా హైకోర్టుకు చేరుకున్నారు. ఎన్నికల అనంతరం జరిగిన హింస కేసులో వాదనలు వినిపించేందుకు లాయర్ గౌన్లో న్యాయస్థానానికి హాజరయ్యారు.
బెంగాల్లో తృణమూల్ 'మెల్ట్డౌన్' పరిస్థితులు కనిపిస్తున్నాయి. మాజీ సీఎం మమత, ఆమె మేనల్లుడు అభిషేక్లపై సొంత పార్టీ నేతలు తిరుగుబాటు మొదలుపెట్టారు. పార్టీ ఓటమి చవిచూడగానే అంతర్గత కుమ్ములాటలు ఒక్కొకటిగా బహిర్గతమవుతున్నాయి.
టీఎంసీ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ మనసు మార్చుకున్నారు. తన ఎక్స్ ఖాతాలో బయోను మార్చారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి (15, 16, 17వ శాసనసభ) అని రాసుకున్నారు. అంతకు ముందు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అని ఉండేది.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కొత్త శకం మొదలైంది. రాష్ట్రంలో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి పగ్గాలు చేపట్టనున్నారు. కోల్కతాలోని బిశ్వ బంగ్లా కన్వెన్షన్ సెంటర్లో జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో సువేందు అధికారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయకపోవడంతో పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని మమతా ఆరోపిస్తూ పదవికి రాజీనామా చేసేందుకు నిరాకరిస్తున్నారు. దీనిపై రాజ్యాంగం ఏం చెబుతుందో ఈ కథనంలో తెలుసుకుందాం..
పశ్చిమబెంగాల్లో తాను ఓడిపోలేదని, రాజీనామా చేసేది లేదని టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీ చేసిన వ్యాఖ్యలపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందించారు. 'అప్పుడు ఒకటే మార్గం ఉంటుంది. డిస్మిస్ చేయడమే' అని ఆయన అన్నారు.