Home » Mahesh Kumar Goud
ఓటు చోరీపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సంధించిన ప్రశ్నలకు మోదీ ప్రభుత్వం జవాబు చెప్పాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో పవర్ ఆఫ్ ఓటుకి దెబ్బ తగులుతోందని చెప్పుకొచ్చారు. దేశంలో 80 శాతం మంది ప్రజలు ఓటు చోరీ జరిగిందని నమ్ముతున్నారని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
కార్ల విషయంలో తాను తప్పు చేస్తే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్లో మాగంటి సునీత మంచి మెజారిటీతో గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ ప్రజల ఆశీర్వాదం కేసీఆర్కు ఉందని కేటీఆర్ ఉద్ఘాటించారు.
ఏడాది కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ధి చేశామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. గాంధీ భవన్లో మంత్రుల ముఖాముఖి కార్యక్రమం చాలా బాగా జరుగుతోందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
గిన్నిస్ బుక్ రికార్డులో చేరే విధంగా బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. కొత్తగా కవులు, రచయితలను పిలిచి వారితో చర్చించి బతుకమ్మ పాటలు పాడేలా ప్లాన్ చేస్తామని పేర్కొన్నారు.
కేటీఆర్ మీ రాజకీయ శకం ముగిసిందని మహేష్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. మోదీ మోక్షం కోసం కేటీఆర్ రాహుల్ గాంధీని విమర్షిస్తున్నారని ఆరోపించారు. కేటిఆర్, హరీష్ రావులు పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి చూశారని కవిత చెప్పారని గుర్తు చేశారు.
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.. భారీ వర్షాలకు కామారెడ్డిలో చాలా నష్టం వాటిల్లిందని తెలిపారు. వరద పరిశీలనకు వస్తున్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డితో బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ గురించి మాట్లాడినట్లు గుర్తు చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని జూబ్లీహిల్స్లోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డితో మహేష్ గౌడ్ భేటీ అయ్యారు. ఇద్దరు నేతలు పలు కీలక అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
కవితను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేది లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహే్షకుమార్గౌడ్ స్పష్టం చేశారు. కవితనే కాదని, అవినీతి మరకలున్న కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరినీ చేర్చుకోబోమన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంశం మీద టీపీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అన్నదమ్ములిద్దరూ ముక్కుసూటిగా మాట్లాడుతారన్నారు. మంత్రి పదవుల విషయంలో జిల్లాను యూనిట్గా చూడలేమని..
కవిత.. కేసీఆర్ విడిచిన బాణమేనని టీపీసీసీ చీఫ్ మహే్షకుమార్గౌడ్ అన్నారు. ప్రజల్ని మభ్యపెట్టేందుకు కేసీఆర్ కుటుంబం ఆడుతున్న కొత్త నాటకమిదన్నారు