Home » Maharashtra
మహారాష్ట్రలో కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది. ఎన్డీఏ నేతృత్వంలోని అధికార ‘మహాయుతి’ కూటమి గెలుపు దిశగా దూసుకుపోతోంది.
మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ జోరుగా సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 29 మున్సిపల్ కార్పొరేషన్లలోని 2869 స్థానాలకు గురువారం ఉదయం 7.30 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 3.48 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
మహారాష్ట్ర రాజధాని నగరం ముంబైలో 227 వార్డుల్లో ఓటింగ్ జరుగుతుంది. సుమారు 1,700 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బీఎంసీ ఎన్నికల్లో 1,03,44,315 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.
మహాయూతి కూటమి రోడ్షో సందర్భంగా బడ్కాస్ చౌక్ను సర్వాంగసుందరంగా అలంకరించారు. ఈ చౌక్ నుంచి 200 మీటర్ల దూరంలో ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఉంది.
ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, బీజేపీపై సుప్రియ సూలే విమర్శలు గుప్పించారు. కమలం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు బలం, కండబలం చూపించిందని ఆరోపించారు. ఇండియాను అవినీతి రహిత దేశంగా చేస్తామని ప్రధాని మోదీ చెబుతుంటే ఈ పరిణామం మాత్రం ఇందుకు భిన్నంగా ఉందన్నారు.
ఠాక్రే సోదరుల మధ్య భిన్న సైద్ధాంతిక విభేదాలున్నా దేశానికి ప్రాధాన్యతనిచ్చి ఐక్యంగా నిలిచారని సంజయ్ రౌత్ అన్నారు. ఠాక్రేలు అంటేనే ఒక బ్రాండ్ అని, ఠాక్రేలు ఉన్నంత కాలం మరాఠా ప్రజలకు రక్షణ ఉంటుందని చెప్పారు.
జీవితంలో ఇకచూడలేం అన్న దాన్ని కళ్లారా చూస్తే వారు పొందే ఆనందం మాటల్లో వర్ణించలేం. జీవిత కాలం మొత్తం సముద్రం గురించి వినడమే తప్ప చూడని వృద్ధ దంపతుల కోరిక తీరిన వేళ.. వారు పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. కాగా, దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
తనకన్నా చిన్నవయసు ఉన్న యువకుడి పాదాలు తాకిన బీజేపీ ఎమ్మెల్యేకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పెద్దరికం అన్న గౌరవం లేదా అని ప్రశ్నిస్తున్నారు.
డిసెంబర్ ఎన్నికల్లో కొన్ని మున్సిపల్ కౌన్సిల్స్లో ఏ పార్టీకి మెజారిటీ రాని 'హంగ్' పరిస్థితి తలెత్తింది. దీంతో అంబర్నాథ్ మున్సిపల్ కౌన్సిల్ మేయర్ పదవి కోసం బీజేపీ నేతలు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు.
మహారాష్ట్రలో ఉత్తరాది వారి గురించి ఫడ్నవిస్ మాట్లాడుతూ, వాళ్లేమీ పాకిస్థాన్ వాళ్లు కాదని చెప్పారు. ఉత్తరాది వారిని బయట వ్యక్తులుగా చిత్రీకరించడం, వాళ్ల పట్ల వివక్ష చూపించే ఎలాంటి చర్యలనైనా తాను వ్యతిరేకిస్తామని అన్నారు.