Home » Maharashtra
Wedding Invite Scam: వెడ్డింగ్ ఇన్విటేషన్ల పేరిట ప్రతీ ఏటా వాట్సాప్ ద్వారా పెద్ద ఎత్తున సైబర్ నేరాలు జరుగుతున్నాయి. చదువురాని వారే కాకుండా చదువుకున్న వాళ్లు కూడా డబ్బులు పోగొట్టుకుంటున్నారు.
మహారాష్ట్రలో నాసిక్లోని నిఫాద్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమీప అటవీ ప్రాంతం నుంచి ఇటీవల రాత్రి వేళ ఓ చిరుత పులి నిఫాద్ ప్రాంతంలోకి చొరబడింది. ఆ సమయంలో అక్కడే ఉన్న వీధి కుక్కలు చిరుతను చూశాయి. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
మహారాష్ట్రలోని గడ్చిరోలీ ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు బిహార్ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రధానిపై అభ్యంతరకర పోస్టు పెట్టారంటూ ఎమ్మెల్యే తేజస్విపై ఆయన ఫిర్యాదు చేశారు.
అన్ని ఎలక్ట్రిక్ వాహనాలకు టోల్ప్లాజాలలో టోల్ మినహాయింపు కల్పిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కాలుష్యం తగ్గించడంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల కొనగోలును ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మహారాష్ట్రలో కురుస్తోన్న భారీ వర్షాల ప్రభావం హైదరాబాద్ నుంచి బయల్దేరే పలు రైళ్ల రాకపోకలపై పడింది. ముంబై నుంచి హైదరాబాద్కు రావాల్సిన హుస్సేన్సాగర్ ఎక్స్ప్రెస్ 10 గంటలు ఆలస్యంగా వచ్చింది.
సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డవలపింగ్ సొసైటీస్ (సీఎస్డీఎస్)కు చెందిన సైఫాలిజిస్ట్ రెండ్రోజుల క్రితం చేసిన పోస్టులపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ తప్పుడు అభియోగాలకు ఊతమిచ్చేలా నిర్ధారణ కాని డాటాను సీఎస్డీఎస్ తీసుకొచ్చిందంటూ విమర్శించింది.
మహారాష్ట్రలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. తన ఆటోకు వేలాడుతున్న మహిళా పోలీసును ఓ ఆటో డ్రైవర్ ఏకంగా 120 మీటర్ల మేర రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. స్థానికులు వెంటనే ఆటోను అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. సతారా జిల్లాలో ఈ దారుణం జరిగింది.
Police Use AI: ఆ వ్యక్తికి ట్రక్ ఆనవాళ్ల గురించి పెద్దగా తెలీదు. ట్రక్పై రెడ్ మార్క్ ఉందని మాత్రమే చెప్పాడు. పోలీసులకు ఈ కేసు ఛాలెంజింగ్గా మారింది. అతడు చెప్పిన ఆనవాళ్లతో ఆ ట్రక్ను పట్టుకోవటం అసాధ్యం. కానీ, ఏఐ ద్వారా అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు.
కుటుంబకలహాలు ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేశాయి. భార్య కాపురానికి రాకుండా ఫోన్ నెంబర్ బ్లాక్ చేసిందనే మనోవేదనతో ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. నలుగురు పిల్లలను దారుణంగా హతమార్చి తర్వాత తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహారాష్ట్రలో జరిగిన ఈ అమానవీయ ఘటన అందరి హృదయాలనూ కలచివేస్తోంది.
జన్మాష్టమి 2025 వేడుకలు మహారాష్ట్రలో ఘనంగా జరిగాయి. ఆ క్రమంలోనే రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఓ వేదికపైకి చేరిన క్రమంలో కార్యకర్తలు ఒక్కసారిగా ఎగబడ్డారు. హఠాత్తుగా పెరిగిన బరువును తట్టుకోలేక వేదిక కూలిపోయింది.