Home » Maharashtra
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం కూలే కొద్ది క్షణాల ముందు గాల్లో ఓ పక్కకు వొంపు తిరిగినట్టు ఉన్న వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మహారాష్ట్రలోని బారామతిలో బుధవారంనాడు జరిగిన విమాన ప్రమాదంలో తన మేనల్లుడు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంపై శరద్ పవార్ తొలిసారి స్పందించారు.
విమాన అటెండెంట్గా పింకీ మాలీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్తో పాటు విమానంలో వెళ్లారు. దీనికి ఒకరోజు ముందే పింకీ మాలి తన తండ్రి శివకుమార్తో ఫోనులో మాట్లాడారు.
విమాన ప్రమాద ఘటనకు ముందు అజిత్ పవార్ తన సెక్యూరిటీ సిబ్బందితో దిగిన ఫోటో ఒకటి తాజాగా వెలుగుచూసింది. బుధవారం ఉదయమే అజిత్ ఈ ఫోటో దిగారని పార్టీ నాయకులు ధ్రువీకరించారు.
విమాన ప్రమాద ఘటనా స్థలంలో లభ్యమైన శరీర భాగాలను గుర్తించడం అధికారులకు సవాలుగా మారింది. అయితే అజిత్ పవార్ చేతికున్న వాచ్ ఆధారంగా ఆయన మృతదేహాన్ని గుర్తించి బయటకు లాగారు.
మహారాష్ట్రలో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కీలక విషయాలను వెల్లడించింది. పైలట్ల నుంచి మేడే కాల్ రాలేదని తెలిపింది.
దేశ స్వాతంత్ర్యం కోసం తన జీవిత సర్వస్వాన్ని త్యాగం చేసిన పంజాబ్ కేసరి లాలా లజపతి రాయ్కి సెల్యూట్ చేస్తున్నానని, ఆయన దేశభక్తి తమకు నిరంతరం స్ఫూర్తిగా నిలుస్తుందని అజిత్ పవార్ ఆ ట్వీట్లో పేర్కొన్నారు.
పుణెలోని బారామతిలో బుధవారం ఉదయం జరిగిన విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణించిన సంగతి తెలిసిందే. ఆ విమానంలో ఆయనతో పాటు మరో నలుగురు ప్రయాణిస్తున్నారు.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతిపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాదాపు నాలుగున్నర దశాబ్దాలు ఆయన తన జీవితాన్ని ప్రజా సేవకే అంకితం చేశారని కీర్తించారు.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం చెందడం దేశ రాజకీయాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘోర ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.