Home » Maharashtra
మహారాష్ట్ర నూతన డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆమె నేడు ప్రమాణం స్వీకారం చేయనున్నారు.
సునేత్ర ప్రమాణస్వీకార కార్యక్రమంపై శరద్ పవార్ బారామతిలో జరిగిన మీడియా సమావేశంలో స్పందించారు. శనివారం సాయంత్రం ప్రమాణస్వీకారం ఉంటుందనే విషయం మీడియా ద్వారానే తనకు తెలిసిందని చెప్పారు.
లెజిస్లేటివ్ బిల్డింగ్లో శనివారంనాడు ఎన్సీపీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. సునేత్ర పేరును ఎమ్మెల్యే దిలీప్ వాల్సే పాటిల్ ప్రతిపాదించగా, ఎన్సీపీ మంత్రి ఛగన్ భుజ్బుల్ బలపరిచారు.
అజిత్ పవార్ మరణంతో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయన భార్య సునేత్ర పవార్ బాధ్యతలు చేపట్టనున్నారు.
మహాయుతి కూటమి ప్రభుత్వంలోని ఎన్సీపీ కోటాలో భాగంగా అజిత్ పవార్ చేతిలో కీలకమైన ఆర్థిక, రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా శాఖలు ఉన్నాయి.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించడంతో నేషనల్ కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలు తిరిగి కలిసిపోయే ప్రయత్నాలు జోరుగా జరుగుతున్నాయి.
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ బుధవారం విమాన ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. అజిత్ పవార్ మృతితో ఆయన అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో ఓ వీరాభిమానికి చెందిన స్టోరీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది..
మహారాష్ట్రలో బుధవారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ విమాన ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు పైలట్లు మాట్లాడిన మాటలను డీజీసీఏ అధికారులు వెల్లడించారు.
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. పుణెలోని ప్రతిష్ఠాన్ మైదాన్లో అంతిమక్రియలు నిర్వహించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు అంత్యక్రియలకు హాజరై అజిత్ పవార్కు తుది వీడ్కోలు పలికారు.
అజిత్ పవార్ విమానంలో కోపైలట్గా శాంభవి పాఠక్ తన బామ్మకు పంపిన చివరి మేసేజ్ ప్రస్తుతం వైరల్గా మారింది. అది తన మనవరాలి చివరి మేసేజ్ అవుతుందని తాను అనుకోలేదంటూ వృద్ధురాలు కన్నీరుమున్నీరయ్యారు.