Home » Maharashtra
బాస్ తనతో వ్యవహరిస్తున్న తీరుతో విసిగిపోయిన ఓ ఉద్యోగి చివరకు తన జాబ్కు రాజీనామా చేశాడు. చివరి రోజున పీడ విరగడైందంటూ బాస్ ముందు నిలబడి డ్యాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్ పరీక్షలో రైతు బిడ్డ సత్తా చాటాడు. మారుమూల గ్రామానికి చెందిన విద్యార్థి తన కల నెరవేర్చుకున్నాడు. రోజుకు 10 గంటల పాటు కష్టపడి చదివి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ కొట్టాడు. దీంతో ఆ విద్యార్థి కుటుంబంలో ఆనందానికి అవధి లేకుండా పోయింది. అంతా సంతోషంతో మునిగి తేలారు.
పిల్లలపై అప్పుడప్పుడు తల్లిదండ్రులు చూపే అలసత్వమే కొంప ముంచుతుంది. వారిని క్షణం కంటకనిపెట్టుకోకపోతే మొదటికే మోసం వస్తుంది. చిన్నారుల ప్రాణాలు కోల్పేయే ప్రమాదమూ ఉంటుంది. ఇలాంటి ఘటనే మహారాష్ట్ర రాజధాని ముంబైలో బుధవారం జరిగింది. తల్లిదండ్రుల నిర్లక్ష్యం ఇద్దరు చిన్నారుల ప్రాణాలు బలి తీసుకుంది.
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మహారాష్ట్రలోని యావత్మల్లో బుధవారం ఎన్నికల సభలో మాట్లాడుతూ స్పృహ తప్పారు.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి లోక్సభ స్థానం ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు రూ.25వేల కోట్ల కుంభకోణంలో ముంబై పోలీసులు క్లీన్చిట్ ఇచ్చారు.
కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరి మహారాష్ట్రలోని యవత్మాల్లో లోక్సభ ఎన్నికల ప్రచారంలో అస్వస్థతకు గురయ్యారు. స్టేజిపై ప్రసంగిస్తుండగానే ఆయన సొమ్మసిల్లారు. దీంతో భద్రతా సిబ్బంది, నేతలు కిందకు పడిపోకుండా పట్టుకున్నారు. వైద్యులు తక్షణ చికిత్స అందించడంతో ఆయన కోలుకున్నారు.
అడవిలో పులులు, సింహాలకు దాదాపు అన్ని జంతువులూ భయంతో వణికిపోతుంటాయి. అయితే కొన్ని జంతువుల విషయంలో పులులు కూడా పిల్లుల మాదిరి మారుతుంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా...
ప్రధాని నరేంద్ర మోదీ( PM Modi ) పై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మరోసారి విరుచుకుపడ్డారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 400 కు పైగా సీట్లు కైవసం చేసుకుంటుందన్న ప్రధాని ప్రకటనను ఆయన ఖండించారు. సాగునీటి కుంభకోణానికి సంబంధించి ప్రధాని చేసిన ప్రకటనపైనా ఆయన మండిపడ్డారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని(Rahul Gandhi) తన పార్లమెంటరీ నియోజకవర్గం వాయనాడ్(Wayanad) నుంచి ప్రజలు తరిమికొడతారని, ఆయన మరో సీటు వెతుక్కోవాల్సి ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) శనివారం జోస్యం చెప్పారు.
మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికల రెండో విడత ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇందులో భాగంగా షోలాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రణతి షిండే తరఫున బాలీవుడ్ బాద్షా 'షారూక్ ఖాన్' వచ్చారంటూ జనం శుక్రవారంనాడు ఎగబడ్డారు. ఆ తర్వాత వచ్చిందెవరో తెలిసి ఆశ్చర్యానికి లోనయ్యారు.