Home » Maharashtra
ముంబై దాడుల మాస్టర్ మైండ్ తహవ్వుర్ రాణా కెనడా పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమైంది. భారత్ కస్టడీలో ఉన్న అతడికి ఈ సమాచారాన్ని అందించింది. కెనడా ప్రధాని కార్నీ త్వరలో భారత్లో పర్యటించనున్న నేపథ్యంలో ఈ పరిణామానికి ప్రాధాన్యం సంతరించుకుంది.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు శరద్ పవార్ (85) మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను పుణెలోని రుబీ హాల్ ఆసుపత్రికి ఆదివారంనాడు తరలించారు.
మహారాష్ట్రలో బోర్డు ఎగ్జామ్స్ నిర్వహణ లోపాలు మరోసారి తేటతెల్లం అయ్యాయి. ఆ రాష్ట్ర బోర్డు నిర్వహించే 12వ తరగతి పరీక్షలకు సంబంధించిన కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్, ఆన్సర్లు వాట్సాప్లో చక్కర్లు కొట్టడం కలకలం రేపుతోంది.
మహారాష్ట్రలో నమోదైన పరువు నష్టం కేసులో.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారంనాడు బివాండీ కోర్టుకు హాజరయ్యారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాజేష్ కుంటే వేసిన పరువునష్టం కేసులో కొత్త పూచీకత్తు సమర్పించేందుకు రాహుల్ కోర్టుకు వచ్చారు.
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ (India AI Impact Summit)కు కాంగ్రెస్ కార్యకర్తలు అంతరాయం కలిగించడంపై బీజేపీ కార్యకర్తలు శనివారంనాడు పెద్దఎత్తున నిరసన తెలిపారు. ఆ పార్టీ మద్దతుదారులు, యువజన విభాగం కార్యకర్తలు దేశవ్యాప్తంగా పలుచోట్ల రోడ్లపైకి వచ్చారు.
ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు ఎదురైనట్టు తెలుస్తోంది. రూ.10 కోట్లు చెల్లించాలంటూ రణ్వీర్ మేనేజర్ వాట్సాప్నకు బిష్ణోయ్ గ్యాంగ్కు చెందిన వ్యక్తి వాయిస్ మేసేజ్ పంపినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ధైర్యానికి, దేశభక్తికి, దైవభక్తికి, ధీరత్వానికి మారుపేరు.. నవతరానికి ఒక స్ఫూర్తి... ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి నేడు. ఆయన స్థాపించిన మరాఠా సామ్రాజ్యం తర్వాతి కాలంలో భారత దేశమంతటా విస్తరించింది. నేటికీ శివాజీ మహరాజ్ సుపరిపాలనకు గొప్ప చిహ్నంగా నిలుస్తారు.
అజిత్ పవార్ విమానప్రమాదానికి గురైన జనవరి 28న కీలకమైన అడ్మనిస్ట్రేటివ్ నిర్ణయం జరిగింది. మైనారిటీ స్కూళ్లకు సంబంధించిన 75కు పైగా ఫైళ్లను మహారాష్ట్ర మైనారిటీ శాఖ క్లియర్ చేసింది.
డేటా సెంటర్ల భూ సేకరణ పురోగతిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సచివాలయంలో ఇవాళ(మంగళవారం) సమీక్షా సమావేశం నిర్వహించారు. డేటా సెంటర్లకు రాయితీలపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు..
విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణానికి దారితీసిన పరిస్థితులపై ప్రతి ఒక్కరిలోనూ అనుమానాలున్నాయని ఆయన మేనల్లుడు, ఎన్సీపీ (ఎస్పీ)నేత రోహిత్ పవార్ అన్నారు.