Home » Maharashtra
సిందేవాహి తాలూకాలోని నవర్గావ్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల అనురాగ్ అనిల్ బోర్కర్ తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఇటీవల నిర్వహించిన NEET UG 2025 పరీక్షలో 99.99 శాతం స్కోర్ సాధించాడు.
మహారాష్ట్ర నుంచి ఈరోజు కలకలం రేపే వార్త వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అధికారిక X ఖాతా హ్యాక్ అయ్యింది. ఆ క్రమంలో హ్యాకర్లు షాక్కు గురిచేసేలా పాకిస్తాన్, టర్కీ జెండాలతో పోస్టులు చేయడం సంచలనంగా మారింది.
జన్ జెడ్ను రెచ్చగొట్టి ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోయాలని రాహుల్ కోరుతున్నారని, ఇది ఓటు చోరీ కాదని, ఆయన మెదడును ఎవరో చోరీ చేశారని దేవేంద్ర ఫడ్నవిస్ వ్యాఖ్యానించారు.
సమాచారం తెలిసిన వెంటనే అధికారులు హుటాహుటిన శివాజీ పార్క్ వద్దకు చేరుకుని విగ్రహాన్ని శుభ్రం చేసేందుకు చర్యలు చేపట్టినట్టు పార్టీ సీనియర్ నేతలు తెలిపారు. శివాజీ పార్క్ చుట్టుపక్కల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా ముంబై పోలీసులు అదనపు బలగాలను మోహరించారు.
రైల్వే స్టేషన్లో మహిళ నుంచి 8 కిలోల గంజాయి సరుకును సికింద్రాబాద్ రైల్వే, సికింద్రాబాద్ ఆర్పీఎస్ పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం జీఆర్పీ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైల్వే డీఎస్పీ జావెద్, సికింద్రాబాద్ రైల్వే ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్గౌడ్లు వివరాలను వెల్లడించారు.
దేశంలో మళ్లీ బాంబు బెదిరింపులు కలవరపెడుతున్నాయి. తాజాగా మహారాష్ట్ర నాసిక్లోని కేంబ్రిడ్జ్ హైస్కూల్ లక్ష్యంగా బాంబు బెదిరింపు మెయిల్ రావడం చర్చనీయాంశంగా మారింది.
ఈ-20 పెట్రోల్ వాడకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుండటంపై చర్చ జరుగుతుండగా కేంద్రమంత్రి గడ్కరీపై కాంగ్రెస్ విమర్శలు చేసింది. ఇథనాల్పై ప్రభుత్వ విధానం వల్ల కేంద్ర మంత్రి కుమారులు ప్రయోజనం పొందారని, ఇందువల్లే ఇథనాల్ ప్రొడక్షన్పై చురుగ్గా లాబీయింగ్ చేస్తున్నారని విమర్శించింది.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన సీపీ రాధాకృష్ణన్.. మహారాష్ట్ర గవర్నర్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం గుజరాత్ గవర్నర్గా ఉన్న ఆచార్య దేవవ్రత్... మహారాష్ట్ర గవర్నర్గా అదనపు బాధ్యతలు చేపట్టారు.
నిరుద్యోగ యువకులను కొందరు జాబ్ పేరుతో టార్గెట్ చేసి మోసం చేస్తున్నారు. ఏకంగా ప్రభుత్వ భవనాల్ని, ఆసుపత్రుల్ని ఉపయోగించి చీట్ చేసిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇది ఎక్కడ జరిగింది, ఏంటనే విషయాలను ఇక్కడ చూద్దాం.
మరాఠా రిజర్వేషన్ల కోటా ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న మనోజ్ జరంగే డిమాండ్లకు మహారాష్ట్ర ప్రభుత్వం తలవంచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు కానుకగా.. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 మధ్య ‘కున్బీ’ కులధృవీకరణ పత్రాలు జారీ చేస్తామని ప్రకటించింది.