• Home » Madakasira

Madakasira

Ananthapur News: ప్రాణాలు తీసిన పొగమంచు..

Ananthapur News: ప్రాణాలు తీసిన పొగమంచు..

పొగమంచు... నిండు ప్రాణాలను బలిగొన్నది. కారులో వెళ్తున్న వారికి పొగమంచు కారణంగా రోడ్డు కనబడకపోవడంతో ప్రమాదానికి గురయ్యారు. దీంతో భార్యాభర్తలిద్దరూ మృతిచెందారు. కాగా.. వారి మరణంతో కుటుంబం శోకసముద్రంలో మునిగిపోగా చిన్నారులిద్దరూ అనాథలుగా మిగిలిపోయారు.

AIDS DAY: ఎయిడ్స్‌ రహిత సమాజాన్ని నిర్మిద్దాం

AIDS DAY: ఎయిడ్స్‌ రహిత సమాజాన్ని నిర్మిద్దాం

ఎయిడ్స్‌ రహిత సమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలని సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి వెంకటేశ్వర్లునాయక్‌ పిలుపునిచ్చారు. సోమవారం ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వైద్యులు, సిబ్బంది ర్యాలీ నిర్వహించారు.

MLA RAJU : కూటమితోనే అభివృద్ధి, సంక్షేమం

MLA RAJU : కూటమితోనే అభివృద్ధి, సంక్షేమం

ప్రజాసంక్షేమం, రాషా్ట్రభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి అన్నారు. సొమవారం మండలంలోని గౌడనహళ్ళి, భక్తరహళ్ళి, జిల్లేడగుంట గ్రామాల్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.

SEEDS : రైతులకు అండగా కూటమి ప్రభుత్వం

SEEDS : రైతులకు అండగా కూటమి ప్రభుత్వం

కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా ఉంటుందని నగర పంచాయతీ చైర్మన నరసింహరాజు అన్నారు. సోమవారం పట్టణంలోని రైతు సేవా కేంద్రంలో 80 శాతం సబ్సిడీతో ఉలవల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

TRAFFIC: రోడ్డుపై వాహనాల పార్కింగ్‌

TRAFFIC: రోడ్డుపై వాహనాల పార్కింగ్‌

పట్టణంలోని రాజీవ్‌గాంధీ సర్కిల్‌లో కూరగాయల మార్కెట్‌ నిర్వహిస్తుండటంతో వాహనాలు అన్నీ రోడ్డుపైనే నిలిపివేస్తున్నారు. సంతరోజు ద్విచక్ర వాహనాలు అన్నీ రోడ్డుపైనే నిలపడం వల్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

MLA RAJU: పేదల సంక్షేమమే ధ్యేయం

MLA RAJU: పేదల సంక్షేమమే ధ్యేయం

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో 58 మంది లబ్ధిదారులకు రూ.18.53లక్షల విలువచేసే సీఎం సహాయ నిధి చెక్కులను అందించారు.

Krishna Water: కరువు నేలలో.. కృష్ణమ్మ పరవళ్లు

Krishna Water: కరువు నేలలో.. కృష్ణమ్మ పరవళ్లు

కరువు నేలలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. నీటి వనరులే లేని మడకశిర ప్రాంతంలో కృష్ణాజలాలు ఉరకలు వేస్తున్నాయి. హంద్రీనీవా కాలువ ద్వారా గొల్లపల్లి రిజర్వాయర్‌ నుంచి నీరు విడుదల చేస్తున్నారు.

SACHIVALAYAM: సచివాలయాల నిర్వహణ అస్తవ్యస్తం

SACHIVALAYAM: సచివాలయాల నిర్వహణ అస్తవ్యస్తం

గ్రామీణ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు గత వైసీపీ ప్రభుత్వం సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చింది. అయితే వాటి నిర్వహణను సంబంధిత అఽధికాలరులు పట్టించుకోకపోవడంతో అస్తవ్యస్తంగా మారాయి. మండలంలో 18 గ్రామ సచివాలయాలు ఉన్నాయి. అందులో 131 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

AP News: పెళ్లికి వచ్చి పరలోకాలకు..

AP News: పెళ్లికి వచ్చి పరలోకాలకు..

ఓ వివాహానికి హాజరైన కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువకులు స్విమ్మింగ్‌లో మునిగి మృతి చెందిన సంఘటన సోమవారం మడకశిరలో జరిగింది. బంధువులు తెలిపిన వివరాల మేరకు కర్ణాటక రాష్ట్రం హాసన్‌కు చెందిన బాబ్జాన్‌(35) మున్వర్‌ బాషా(27) మడకశిరలో ఆదివారం జరిగిన తమ బంధువుల వివాహానికి హాజరయ్యారు.

TDP : మహిళల ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయం

TDP : మహిళల ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల సంపూర్ణ ఆరోగ్యమే ధ్యేయంగా పనిచేస్తున్నాయని వక్కలిగ రాష్ట్ర కార్పొరేషన చైర్మన లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం మడకశిర వైద్య విధాన పరిషత ఆసుపత్రిలో స్వస్థ్‌ నారీసశక్త్‌ పరివార్‌ అభియాస్‌ అనే కార్యక్రమం నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి