Home » Local Body Elections
చదువు, ఉద్యోగాల పేరుతో మెజారిటీ యువత గ్రామాలకు దూరమైనా.. కొందరు మాత్రం తమ సామాజిక బాధ్యతను గుర్తించి గ్రామాభివృద్ధికి నడుం బిగిస్తున్నారు. గ్రామాభివృద్ధే లక్ష్యమంటూ పలువురు విద్యావంతులు సర్పంచ్ బరిలో నిలిచారు.
శత్రువుకు శత్రువు మిత్రుడు అనే రీతిలో వివిధ పార్టీల అభ్యర్ధుల మధ్య ఒప్పందాలు కుదురుతున్నాయి. ఇంతకాలం ప్రత్యర్థులుగా ఉన్నవాళ్లు ప్రస్తుతం ఒకటవుతున్నారు.
గ్రామాల్లో సర్పంచ్లు, వార్డు సభ్యులు గెలుపు కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఓటర్ల అవసరాలను తీరుస్తూ గెలిస్తే పథకాలు ఇప్పిస్తామని ఆశ చూపుతూ ఓటు వేయాలని కోరుతున్నారు.
పోలింగ్ సమయం దగ్గర పడడంతో అభ్యర్థుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులు ప్రచారంలో మరింత ముమ్మరంగా తిరుగుతున్నారు. గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను కలుస్తున్నారు. ఈ సారి గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతలుగా జరుగనున్నాయి.
ఓటరుకు పల్లె 'పంచాయితీ' పద్మ వ్యూహంలా తయారైంది. అన్ని పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మ కంగా తీసుకున్నాయి. సారధులే స్వయంగా పల్లె బాట పడుతూ.. వ్యూహరచన చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో ఎన్నికల ప్రచార తీరు మారింది. విందులు, హామీలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు ఎలాగైనా గెలవాలని రకరకాల ప్రలోభాలు చేయడం ముమ్మరంగా జరుగుతోంది. డబ్బు, మద్యం పంచడం, బెదిరించడం, తప్పుడు ప్రచారం చేయడం వంటి చర్యలు నేరంగా పరిగణస్తారు. ఎన్నికల సమయంలో ఈ ప్రవర్తనలకు కఠిన శిక్షలు, జరిమానాలు విధిస్తారు.
హనుమకొండ జిల్లాలో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అభ్యర్థులు నాన్ లోకల్ ఓటర్లను కంటాక్ట్ చేసి ఓటు వేసేందుకు వారిని గ్రామాలకు రప్పిస్తున్నారు. వలస వెళ్లిన వారికి ఫోన్లు చేసి, ఖర్చులు కూడా భరిస్తామని తెలియజేస్తున్నారు.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అభ్యర్థులు గెలుపు కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు. పలువురు అభ్యర్థులు తమదైన శైలీలో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. పలు పంచాయతీల్లో సొంత కుటుంబ సభ్యులే అభ్యర్థులుగా పోటీ పడుతున్నారు.
కోర్టులో ఓడిన వారు ఏడిస్తే, గెలిచిన వారు ఇంటికి వచ్చి ఏడ్చిన మాదిరి తమ పరిస్థితి ఉందని ఏకగ్రీవాల్లో సర్పంచ్లుగా ఎన్నికైన అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏకగ్రీవంతో డబ్బు భారం ఉండదులే అనుకుంటే, మరో రూ.20లక్షలు? పెట్టాల్సి వస్తుందని, బుద్ధి ఉండి ఎన్నికలలో పోటీ చేయవద్దని బావురమంటున్నారు.
ఓట్ల కోసం కాసుల వేట మొదలైంది. మొదటి విడత ఎన్నికలకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుండడంతో... ఉమ్మడి జిల్లాలో పంచాయతీ బరిలో ఉన్న అభ్యర్థులకు 'డబ్బు' టెన్షన్ మొదలైంది. ఇప్పటికే వార్డు సభ్యులు, సర్పంచ్ అభ్యర్థులు సొమ్ముల వేట మొదలెట్టారు.