సర్పంచ్ బరిలో ఉన్నత చదువులు చదివిన విద్యార్థులు
ABN, Publish Date - Dec 09 , 2025 | 06:38 PM
చదువు, ఉద్యోగాల పేరుతో మెజారిటీ యువత గ్రామాలకు దూరమైనా.. కొందరు మాత్రం తమ సామాజిక బాధ్యతను గుర్తించి గ్రామాభివృద్ధికి నడుం బిగిస్తున్నారు. గ్రామాభివృద్ధే లక్ష్యమంటూ పలువురు విద్యావంతులు సర్పంచ్ బరిలో నిలిచారు.
తెలంగాణలో ఇవాళ్టితో తొలి విడత సర్పంచ్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు నానా పాట్లు పడుతున్నారు. వెరైటీ హామీలు ఇస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓట్ల కోసం ఉగ్గాని బజ్జీలు, బిర్యానీ, గ్యాస్ స్టవ్, గౌన్ కత్తెరలను పలువురు అభ్యర్థులు పంపిణీ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సర్పంచ్ ఎన్నికల్లో ఉన్నత విద్యలు చదివిన యువత బరిలో దిగారు. కొణిజర్ల సర్పంచ్ అభ్యర్థి గూదె పుష్పావతి ఎం.ఫార్మసీ చదివింది. అలానే నిజామాబాద్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో ఎంబీఏ చదివిన యువకుడు, కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి సర్పంచ్ గా నామినేషన్ వేశాడు. ఇంకా అనేక మంది యువత సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచారు. పూర్తి వివరాల కోసం పై వీడియోను చూడండి.
ఇవి కూడా చదవండి...
పరకామణి కేసు.. హైకోర్టుకు సీఐడీ మరో నివేదిక
ప్రాజెక్ట్ వైజ్ ల్యాండ్ పూలింగే.. ఫేజ్ వైజ్ కాదు..
Updated at - Dec 09 , 2025 | 06:38 PM