Home » Latest News
తెలంగాణ పోలీస్ శాఖలో పునర్వ్యవస్థీకరణ చేపట్టారు. మారుతున్న సవాళ్లకు అనుగుణంగా శాఖలో మార్పులు చేస్తున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ కుమార్తె కొండా సుస్మిత వ్యవహారంపై తెలంగాణ పీసీసీ అగ్రహం వ్యక్తం చేసింది. సుస్మిత వ్యాఖ్యలపై ఆమె తల్లి కొండా సురేఖను వివరణ కోరాలని నిర్ణయించింది.
రంగారెడ్డి జిల్లాలో నైట్రాజెపామ్-10 ఎంజీ టాబ్లెట్లు విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. అందుకు సంబంధించి ముగ్గురి వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
సముద్రంలో గల్లంతైన కోనసీమకు చెందిన ఏడుగురు మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పారాదీప్కు 15 నాటికల్ మైళ్ల దూరంలో ‘ముత్యాలమ్మ’ పేరుతో ఉన్న పసుపు రంగు బోటును అధికారులు గుర్తించారు.
దుస్తులు, దుప్పట్లు, తివాచీలు ఒకరు లేదా ఇద్దరు కలిసి ఉతుకుతుంటారు. కానీ దాదాపు12 మంది ఒకేసారి తివాచీని ఉతికారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు..
జల్సాలకు డబ్బుల కోసమే ప్రిన్సిపాల్ రూపారెడ్డిని ఇద్దరు మైనర్ విద్యార్థులు హత్య చేశారని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. బుధవారం నల్గొండలో విలేకర్ల సమావేశంలో ఈ హత్యకు సంబంధించిన వివరాలను ఆయన వివరించారు.
విడిపోయిన తర్వాత కూడా మాజీ ప్రియుడు లేదా ప్రియురాలు కలలో కనిపిస్తున్నారా? అయితే దీని వెనుక కొన్ని మానసిక కారణాలు ఉంటాయని మనస్తత్వవేత్తలు చెబుతున్నారు.
అసెంబ్లీ, శాసన మండలిని వైసీపీ సభ్యులు బహిష్కరించటంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. దేవాలయం లాంటి అసెంబ్లీని బహిష్కరించటం దేశ చరిత్రలోనే లేదని పేర్కొన్నారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రూప్-1 పరీక్షల నిర్వహణలో భారీగా అక్రమాలు జరిగాయని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. నిబంధనలను పక్కనపెట్టి ప్రైవేటు వ్యక్తులతో మూల్యాంకనం చేయించారని ఆయన వ్యాఖ్యానించారు.
వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెక్కులు అందజేశారు. బుధవారం అసెంబ్లీలోని తన చాంబర్లో సీఎం చంద్రబాబును ప్రాజెక్టు నిర్వాసితులు కలిశారు.