Home » Latest News
ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ చరిత్రాత్మక రికార్డ్ సాధించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. 8,575 కొనుగోలు కేంద్రాల నుంచి 46.21 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు.
ఉత్తరాఖండ్ నైనిటాల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కైంచి ధామ్ సమీపంలో ప్రమాదవశాత్తూ లోయలోకి కారు దూసుకెళ్లడంతో ఐదుగురు మృతిచెందారు.
తాగునీటి నాణ్యతపై రాజీపడొద్దని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామీణ నీటి సరఫరా శాఖ ఉన్నతాధికారులతో గురువారం సచివాలయంలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో పలు కీలక అంశాలపై డిప్యూటీ సీఎం చర్చించారు.
ఆంధ్రప్రదేశ్కు కేంద్రప్రభుత్వం భారీ పారిశ్రామిక ప్రాజెక్టును ప్రకటించింది. రాష్ట్రంలో రూ.30,000 కోట్ల వ్యయంతో మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర నౌకాశాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ వెల్లడించారు. ఈ నెల్లోనే ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అధికారిక ఆమోదం ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పెట్టుబడులు, పారిశ్రామిక ప్రాజెక్టుల పురోగతిపై కీలక సమీక్షా సమావేశం గురువారం సచివాలయంలో జరిగింది. విశాఖ భాగస్వామ్య సదస్సులో కుదిరిన ఒప్పందాలు, అలాగే ఎస్ఐపీబీ ద్వారా ఆమోదం పొందిన ప్రాజెక్టుల అమలుపై మంత్రుల కమిటీతో సీఎం సమీక్షించారు.
భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ను గుంటూరు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు గురువారం ఢిల్లీలో కలిశారు. విద్యా పర్యటనలో భాగంగా 41 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల బృందం ఢిల్లీ వచ్చారు.
కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ‘TRS’ పేరుతో రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ కోసం బహిరంగ ప్రకటన వెలువడటం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. కల్వకుంట్ల కవిత, ఆమె భర్త అనిల్ కుమార్ కలిసి ‘తెలంగాణ రక్షణ సేన’ పేరుతో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి రాజారెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పార్థసారథిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు(గురువారం) సాయంత్రం 5 గంటలకు కేంద్ర మంత్రిమండలి సమావేశం ప్రారంభమైంది. దేశంలోని ప్రస్తుత పరిస్థితులు, ప్రభుత్వ పనితీరు, అభివృద్ధి కార్యక్రమాల అమలు, అంతర్జాతీయ పరిణామాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చిస్తున్నారు.
కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గురువారం ఢిల్లీలో కలిశారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ఇరువురు చర్చించారు. తెలంగాణలో రైల్వేప్రాజెక్టుల పురోగతి, కొత్త ప్రాజెక్టులు, ఎలక్ట్రిఫికేషన్ తదితర ప్రాజెక్టులపై మాట్లాడారు.