Home » Latest News
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి పనులకు అడ్డుపడితే ప్రజలు సహించరని.. మంచిని చెడుగా చూపిస్తే, ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
రాష్ట్రంలో గంజాయి రవాణాను అరికట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాం అని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరులో నూతన పోలీస్ స్టేషన్ను ఆయన ప్రారంభించారు.
మాజీ మంత్రి కేటీఆర్పై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం పేరుతో ఆయన డ్రామాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఐదేళ్లలో 20 వేల స్టార్టప్లు, లక్ష ఉద్యోగాలే లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ‘వన్ ఫ్యామిలీ–వన్ ఎంటర్ప్రెన్యూర్’ లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు.
వర్షాకాలంలో ప్రకృతి అందాలను ఆస్వాదించాలని అనుకునే ప్రయాణికుల కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. 'కేరళ హిల్స్ అండ్ వాటర్' పేరుతో అందిస్తున్న ఈ ప్యాకేజీలో ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం కల్పిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముగ్గురు అదనపు న్యాయమూర్తులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. సునీత గంధం, ఆలపాటి గిరిధర్, పురుషోత్తమ్ కుమార్ చింతలపూడి అదనపు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించారు.
వన్యప్రాణి సంబంధిత వస్తువుల అంశంలో నటుడు మోహన్లాల్ కీలక ప్రకటన చేశారు. కేరళ అటవీశాఖ క్షమాభిక్ష పథకం కింద తన వద్ద ఉన్న వన్యప్రాణి సంబంధిత వస్తువుల వివరాలను అధికారులకు వెల్లడించారు.
కృత్రిమ మొక్కలు ఇంటి వాస్తు, సానుకూల శక్తిపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే సందేహం చాలా మందికి ఉంటుంది. మరి ఈ విషయంలో వాస్తు నిపుణులు ఏమంటున్నారు? కృత్రిమ మొక్కలను ఇంట్లో ఉంచడం మంచిదేనా?
స్వీట్లు తినడం చాలా మందికి ఎంతో ఇష్టం. అయితే వాటిని ఎంత తింటున్నామన్నదే కాకుండా, ఎప్పుడు తింటున్నామన్నది కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.
హైదరాబాద్ పాతబస్తీలో దారుణ హత్య కలకలం రేపింది. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫహద్ బిన్ అబ్దుల్ రెహ్మాన్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తి హత్య చేశాడు.