Home » Kurnool
వ్యవసాయ పనులు తగ్గిపోవడం అధికారులు ఎలాంటి ఉపాధి పనులు కల్పించకపోవడంతో వలస కూలీలు బెంగళూరు, గుంటూరుకు మంగళవారం రాత్రి ఒక్కరోజే మండలం నుంచి సుమారు 200 కుటుంబాలు వలస వెళ్లాయి.
కర్నూలు జిల్లా పాణ్యం వద్ద ఓ ఆర్టీసీ బస్సులో చోరీ జరిగింది. బనగానపల్లెకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో కండక్టర్ వద్ద నుంచి రూ. 6570 నగదు మాయమైంది. నగదు పోయినట్టు గుర్తించిన కండక్టర్ ఆర్టీసీ బస్సును పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకువెళ్లారు.
శ్రీశైలం మహాక్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నాలుగో రోజు స్వామి అమ్మవార్లు నంది వాహనంపై ఊరేగనున్నారు.
శ్రీగిరి క్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మూడవరోజైన బుధవారం ఉదయం స్వామివారి యాగశాలలో చండీశ్వరునికి షోడశోపచార పూజా క్రతువులు శాస్త్రోక్తంగా జరిపించినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు.
రాష్ట్రంలోనే ఏకైక సరస్వతీ ఆలయంగా పేరుగాంచిన కొలనుభారతి క్షేత్రంలో జనవరి 23న అమ్మవారి జన్మదినం సందర్భంగా నిర్వహించే వసంతపంచమి వేడుకలకు ఏర్పాట్లను చేపట్టేందుకు శ్రీశైల దేవస్థానం సిద్ధమైంది.
బ్యాంకులో భద్రంగా దాచుకున్న సొమ్ము మాయమవడంతో ఓ ఖాతాదారుడు లబోదిబోమంటున్నాడు.
దేశంలో ఎక్కడా లేని విధంగా నవనారసింహులు కొలువైన క్షేత్రం అహోబిలం. ఆళ్లగడ్డ నుంచి 24 కిలోమిటర్ల దూరం లో ఉంది.
కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో అనుమతి లేకుండా అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి జిరాక్స్ సెంటర్ పేరుతో కంటైనర్బాక్స్ను ఏర్పాటు చేయడం కలకలం రేపింది.
నాగార్జునసాగర్-శ్రీశైలం అభయారణ్యం పరిధిలో జరుగుతున్న అఖిల భారత పులుల లెక్కింపు ప్రక్రియ వల్ల శ్రీశైలానికి కన్నడ పాదయాత్రికులు కర్నూలు - గుంటూరు జాతీయ రహదారి మీదుగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఎన్.రాఘవేంద్రరెడ్డి అన్నారు.