Home » Kurnool
సివిల్ వివాదాల్లో తలదూర్చడమే కాకుండా దౌర్జన్యానికి పాల్పడిన ఒక పోలీసు కానిస్టేబుల్తో పాటు మరో ఐదుగురిపై ఆదోని త్రీటౌన్ పోలీసులు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. సి.బెళగల్ మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో శుక్రవారం ఏవో మల్లేష్కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు.
నగర పరిధిలో గుంతల రహిత రహదారులే ప్రభుత్వ లక్ష్యమని నగర పాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ అన్నారు.
ఈ నెల 28,29 తేదీలలో ఆలూరులో జరిగే 21వ ఏఐటీయూసీ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం నాయకులు పిలుపునిచ్చారు.
ఓ కానిస్టేబుల్ వ్యవహారం ఆదోని పట్టణంలో ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. బూతులతో రెచ్చిపోవడం, సివిల్ వివాదాల్లోకి తలదూర్చడం వంటి వ్యవహారాలతో ఆయన వార్తల్లోకెక్కారు.
రాయలసీమ జిల్లాలో కరువు, వలసల నివారణ జరగాలంటే వృథాగా కడలిపాలు అవుతున్న వరద జలాలు ఒడిసిపట్టి పల్లెసీమలకు మళ్లించాలని కర్నూలు జిల్లా రిటైర్డు ఇంజనీర్ల సంఘం కార్యదర్శి జి.విశ్వనాథ్ పేర్కొన్నారు.
రాయలసీమ విశ్వవిద్యాలయంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలు, ఇతర సమస్యలపై శుక్రవారం ఎస్సీ ఎస్టీ కమిషన విచారణ జరిపింది.
నంద్యాల జిల్లాలోని నల్లమల అడవిలో కార్చిచ్చు చెలరేగింది. ఈ ఘటన స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. ఎగిసిపడుతున్న మంటల వల్ల వన్యప్రాణులకు, అటవీ సంపదకు ముప్పు ఏర్పడిందని స్థానికులు తెలిపారు.
కర్ణాటకలోని బళ్లారి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కర్నూలు జిల్లాకు చెందిన దంపతులు మృతిచెందారు. మరో ఘటనలో అన్నమయ్య జిల్లాలోని ములకలచెరువు హైవే వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే మండల స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు.