Home » Kurnool
కర్నూలు జిల్లా కల్లూరు మండలంలో గురువారం ఉగాది ఉత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. చిన్నటేకూరు గ్రామంలో ఊరేగింపు సమయంలో ప్రభకు విద్యుత్ వైరు తగిలి షార్ట్సర్క్యుట్ కావడంతో ప్రభలో కూర్చున్న 13 మంది చిన్నారులు విద్యుత్ షాక్కు గురై గాయపడ్డారు. చిన్నటేకూరు గ్రామంలో ఉగాది పండుగ సందర్భంగా మూడు రోజులుగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
కర్నూలు: టీడీపీ నాయకురాలు కప్పట్రాళ్ల బుజ్జమ్మ, రామచంద్ర నాయుడు దంపతులకు వైసీపీ ప్రభుత్వం గన్మెన్లను తొలగించింది. వైసీపీలో ఉన్న కప్పట్రాళ్ల బుజ్జమ్మకు టు ప్లస్ వన్, రామచంద్ర నాయుడుకు వన్ ప్లస్ వన్ చొప్పున గన్ మెన్లను ఏర్పాటు చేసింది. ఇటీవలే బుజ్జమ్మ దంపతులు..
కర్నూలు జిల్లా: సార్వత్రిక ఎన్నికల వేళ కర్నూలు జిల్లా, పెద్ద కడుబూరు మండలంలో గన్ కలకలం రేగింది. పెద్ద తుంబలం గ్రామానికి చెందిన పెద్ద ఉరుకుందు, మరో వర్గానికి.. హులికన్వి గ్రామ పరిధిలో సర్వే నంబర్ 29లో 4.77 ఎకరాల భూ వివాదం ఉంది.
కర్నూలు జిల్లా: కోడుమూరు మండలం, కొత్తూరు గ్రామ సమీపంలో అర్ధరాత్రి అట్ట పెట్టెలతో ఉన్న లారీలో మంటలు చెలరేగాయి. బళ్లారి నుంచి హైదరాబాద్కు అట్ట పెట్టెల లోడుతో వెళుతున్న లారీలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంటలు రావడాన్ని గ్రహించిన లారీ డ్రైవర్ అప్రమత్తమై లారీ దిగి ప్రాణాలు కాపాడుకున్నాడు.
నంద్యాల: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో వైభవంగా ఉగాది మహోత్సవాలు జరుగుతున్నాయి. రెండవరోజు ఆదివారం మహాదుర్గ అలంకారంలో శ్రీశైల భ్రమరాంబికాదేవి అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు.
Andhrapradesh: నంద్యాలలో నమాజ్ చేసుకొని వస్తున్న ముస్లిం యువతిని వైసీపీ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి అవమానించడాన్ని టీడీపీ తీవ్రంగా ఖండిస్తుందని ఏపీ టీడీపీ చీఫ్ కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లింలపై దాడులు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ముస్లింల ద్రోహి జగన్ రెడ్డి అని - ముస్లింలపై జాతి అహంకారంతో జగన్ రెడ్డి అండ్ కో విర్రవీగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘
Andhrapradesh: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీభ్రమరాంబమల్లికార్జున స్వామి దేవాలయంలో ఉగాది మహోత్సవాలు శనివారం ఉదయం వైభవంగా ప్రారంభమయ్యాయి. శాస్త్రోక్తంగా యాగశాలలో అర్చకులు, వేదపండితులు, ఈవో పెద్దిరాజు కలిసి ఉగాది మహోత్సవాల ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉగాది మహోత్సవాల నేపథ్యంలో ఆలయానికి భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. దీంతో స్వామివారి గర్భాలయ స్పర్శ దర్శనానలను అధికారులు నిలిపివేశారు.
డోన్ (కర్నూలు): మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన కుమారుడు అమర్ నాథ్ అర్జున్ రెడ్డిని ఎన్నికల ప్రచారంలోకి దించారు. ఇటీవల జలదుర్గం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయనకు స్థానిక మహిళల నుంచి ఊహించని పరినామం ఎదురైంది.
నంద్యాల: శ్రీశైల మహాక్షేత్రంలో శనివారం నుంచి ఉగాది ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 10వ తేదీ వరకు ఐదురోజులపాటు ఉగాది మహోత్సవాలను దేవస్థానం ఘనంగా నిర్వహించనుంది. కాగా శుక్రవారంతో మల్లన్న స్పర్శ దర్శనం ముగియనుంది. ఉగాది ఉత్సవాల్లో అలంకార దర్శనం మాత్రమేనని దేవస్థానం అధికారులు వెల్లడించారు.
Andhrapradesh: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఈనెల 6 నుంచి 10 వరకు ఉగాది మహోత్సవాలు జరుగనున్నాయి. ఐదు రోజుల పాటు క్రోధి నామ ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉగాది సమీపిస్తుండటంతో అమ్మవారిని ఆడపడుచుగా భావించే కన్నడ భక్తులు ఎండను సైతం లెక్కచేయకుండా పాదయాత్రగా శ్రీశైలానికి తరలివస్తున్నారు. నల్లమల అటవీ ప్రాంతం నుంచి వేలాదిగా కన్నడ భక్తులు క్షేత్రానికి చేుకుంటున్నారు.