Home » Kurnool
అష్టాదశ శక్తిపీఠం, జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగనున్న నేపధ్యంలో రాయలసీమ ప్రజలు ప్రభుత్వంపై ఆశగా చూస్తున్నారని రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు అన్నారు.
శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నల్లమలలోని కర్నూలు - గుంటూరు జాతీయ రహదారి మీదుగా ఆంక్షలు విధించినట్లు ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్ తెలిపారు.
శ్రీశైల మహాక్షేత్రం మహాశివరాత్రి బ్రహ్మోత్సవ శోభను సంతరించుకుంది. ఆదివారం నుంచి ఈనెల 18వరకు 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.
మంత్రాలయం రాఘవేంద్ర స్వామి 431 వ జయంతి, 405 వ పట్టాభిషేకం మహోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించే రాఘవేంద్ర గురు వైభవోత్సవ అవార్డులకు పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో ప్రముఖులను ఎంపిక చేసినట్లు మఠం ఏఏవో మాధవశెట్టి, మఠం మేనేజర్లు ఎస్కే శ్రీనివాసరావు, సురేష్ కోణాపూర్, వెంకటేష్ జోషి తెలిపారు.
ఉత్తరాది ఆర్య భాషా సంస్కృతుల ఆఽధిపత్యం నుంచి దక్షిణాది రాషా్ట్రల ప్రజలు తమ అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే ద్రవిడ భాషా సంస్కృతుల కోసం ఉద్యమించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు.
కోసిగి రేణుకా ఎల్లమ్మ రథోత్సవం శనివారం అశేష జనవాహిని మధ్య అంగరంగ వైభవంగా సాగింది.
గుండ్రేవుల జలాశయం మూడు రాష్ట్రాల మధ్య సమస్య కాబట్టి తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలతో సంప్రదించి ప్రాజెక్టు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో జరిగిన సభలో హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొని, రాజముద్రతో రైతులకు పట్టాదారు పాస్పుస్తకాలను పంపిణీ చేశారు.
వ్యవసాయ పనులు తగ్గిపోవడం అధికారులు ఎలాంటి ఉపాధి పనులు కల్పించకపోవడంతో కూలీలు బెంగళూరు, గుంటూరుకు గురువారం ఒక్కరోజే హొళగుంద మండలం నుంచి సుమారు 100 కుటుంబాలు వలస వెళ్లాయి.