Home » Kurnool
ఎమ్మిగనూరు నీలకంఠేశ్వర స్వామి జాతరను పురష్కరించుకొని దివంగత నేత బీవీ మోహన్ రెడ్డి స్మారకార్థం నిర్వహించిన రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీల్లో ఎమ్మిగనూరుకు చెందిన చైతన్య జట్టు విజయం సాధించగా, రన్నర్గా కర్ణాటకలోని హోబ్బళ్లి జట్టు నిలిచింది.
కృషి విజ్ఞాన కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం విస్తరణ విభాగం డైరెక్టర్ డాక్టర్ జి. శివనారాయణ తెలిపారు.
విద్యుత్ వినియోగదారుల సమస్యలను ఎప్పటి కప్పుడు వెంటనే పరిష్కరించేందుకే ప్రతి మంగళ, శుక్రవారంలో కరెంటోళ్ల జనబాట కార్యక్రమాన్ని విద్యుత్ శాఖ అధికారులు చేపడుతున్నట్లు విద్యుత్శాఖ డీఈ విజయరాజు, ఏఈ సుధాకర్రావు తెలిపారు.
కర్నూలు మార్కెట్ యార్డులో శుక్రవారం కంది రైతులు గిట్టుబాటు ధర కోసం ఆందోళన వ్యక్తం చేశారు.
ఏళ్ల తరబడి పరిష్కారం కాని బీఎనఎనఎల్ పెన్షనర్ల సమస్యలను పట్టించుకోరా? అని ఆల్ ఇండియా బీఎ్సఎనఎల్ డీఓటి పెన్షనర్స్ అసోసియేషన(ఏఐబీడీపీఏ) జిల్లా కార్యదర్శి జె.వెంకటరమణ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఉపాధ్యా యులు అర్థమయ్యే రీతిలో బోధించి విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచాలని కర్నూలు డైట్ లెక్చరర్లు గోవిందు, రామాంజనేయులు సూచించారు.
దివంగత నందమూరి తారక రామారావు కుటుంబం ప్రజల ఆరోగ్య రక్షణకు అంకితమైందని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అన్నారు.
మండలంలోని ఎరిగేరి గ్రామంలో గ్రామ దేవత బంగారమ్మవ్వ దేవరను బుధవారం ఘనంగా నిర్వహించారు.
ఉమ్మడి కర్నూలు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మనగా తుగ్గలి నాగేంద్రను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అఽధికారికంగా ఉత్తర్వులు జారీచేసింది.
బంధువుల గ్రామంలో దేవర ఉండగా వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీకుమారుడు దుర్మరణం చెందారు.