Home » KTR
‘‘ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి సీఎం రేవంత్ ఫేక్ నోటీసులు పోస్టుచేశారు.. ఆ తప్పును బయటపెట్టినందుకే బీఆర్ఎస్ నేత క్రిశాంక్పై అక్రమ కేసు మోపి జైల్లోపెట్టారు’’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు ఆరోపించారు. తాను చెప్పింది తప్పయితే చంచల్గూడ జైలుకైనా వెళ్తానని.. కాదంటే సీఎం
45 ఏళ్లుగా మామ(కేసీఆర్), అల్లుడు(హరీశ్రావు) శనిలాగా, పాపాల బైరవుల్లా ఉమ్మడి మెదక్ ప్రజలను పీక్కుతుంటున్నారని సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) ఆరోపించారు.
బడాబాయ్(మోదీ), చోటాబాయ్(రేవంత్రెడ్డి) కనుసన్నల్లో ఎన్నికల కమిషన్ పనిచేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) సంచలన ఆరాోపణలు ఆరోపించారు. ఎన్నికల కమిషన్ కూడా అచ్చంగా బీజేపీ కనుసన్నల్లో నడుస్తోందని విమర్శించారు. బీజేపీ నేతలు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
తెలంగాణలో కేసీఆర్ (KCR) ఆనవాళ్లు లేకుండా చేయటం రేవంత్ రెడ్డి జేజమ్మతో కూడా కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) అన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలంటే తెలంగాణనే లేకుండా చేయాలని అన్నారు. కార్మికులను, కర్షకులను చావ గొట్టిన్నందుకా? దేనికి మోదీ దేవుడని ప్రశ్నించారు.
Telangana: నల్గొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భావోద్వేగంగా ప్రసంగించారు. ‘‘గల్లీ నుంచి నన్ను ఢిల్లీ వరకు పంపిన మీకు నా చర్మం వలిచి చెప్పులు కుట్టించినా తక్కువే. కాంగ్రెస్ కార్యకర్తల కోసం నా ప్రాణాలైన ఇస్తా. నాకు కొడుకు లేడు.. మీరే నా వారసులు.. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో నా సొంత డబ్బులతో 35 ఏసీలు పెట్టించిన’’...
తెలంగాణలో ఛోటాభాయ్ (రేవంత్రెడ్డి) అక్రమంగా డబుల్ఆర్ టాక్స్ వసూలు చేస్తుంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న మీరేం చేస్తున్నారు? మోదీ జీ’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.
Telangana: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్పై మంత్రి కొండా సురేఖ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండాలో అనేది రాజశేఖర్ రెడ్డి అయితే.. ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదో అది కేసీఅర్ అంటూ వ్యాఖ్యలు చేశారు. సోమవారం కొండపాక మండల కేంద్రంలో మెదక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ రాజుకుంటోంది. ఇరు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ ఒక డ్రామా ఆర్టిస్ట్ అని.. ఆయనకు ఒకప్పుడు వేసుకునేందుకు బట్టలు కూడా ఉండేవి కావని ఎద్దేవా చేశారు. తనను గాలి తిరుగుడు అనడంపై బండి సంజయ్ మండిపడ్డారు
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుండటంతో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నారు. మరోసారి బీజేపీ, కాంగ్రెస్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) తీవ్ర విమర్శలు గుప్పించారు. దేవుడైనా రాముడిని బీజేపీ నేతలు రాజకీయాల్లోకి తీసుకొచ్చి లబ్ధి పొందేలా ప్లాన్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి దానికి రాముడిని తెరమీదకు తీసుకువస్తున్నారని చెప్పారు. రాముడు ఏమైనా బీజేపీ ఎంపీనా, లేక బీజేపీ ఎమ్మెల్యేనా అని సూటిగా బీజేపీ నేతలను కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు.
సీఎం సొంత జిల్లాలోనూ కాంగ్రెస్ పార్టీ గెలవడం కష్టమేనని, అందుకే ఇన్చార్జి బాధ్యతల నుంచి రేవంత్ తప్పుకొన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.