Home » KTR
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్, మంత్రులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు.
రెండున్నరేళ్లు గడుస్తున్నా ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించలేదని కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఈ అంశంపై అసెంబ్లీలో పోరాడుతామని తెలిపారు.
తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోన్న డ్రగ్స్ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. డ్రగ్స్ మహమ్మారిపై తన నిబద్ధతను చాటుతూనే.. ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్పై మంత్రి సీతక్క విరుచుకుపడ్డారు. ఫిరాయింపులపై కేటీఆర్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీల అమలుకు చట్టబద్ధత కల్పించాలని అసెంబ్లీలో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెడతామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు.
హైదరాబాద్లోని గండిపేట వద్ద గోల్కొండ రిసార్ట్స్లో బీఆర్ఎస్ వర్క్షాప్ నిర్వహించనుంది. అసెంబ్లీ వ్యవహారాలు, వ్యూహాలు, ప్రజా సమస్యలను సభలో ఎలా లేవనెత్తాలనే అంశాలపై కేటీఆర్, హరీశ్ రావు ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నారు.
ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు కూలగొట్టడమేనా అని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. మూడో పంటకు రైతు బంధు వేయాలని డిమాండ్ చేశారు. కానీ నేటికి మూడో నెల వచ్చిన రైతు బంధు వేయలేదని రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫార్ములా- ఈ రేసు కేసుకు సంబంధించి కీలక పాత్ర పోషించిన ఐఏఎస్ అధికారి అర్వింద్కుమార్ అప్రూవర్గా మారడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిని తన మెడలో వేస్తారా ? అంటూ తన సోదరుడు కేటీఆర్తోపాటు బీఆర్ఎస్ శ్రేణులపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు.
ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసు వల్ల గత అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా నష్టపోయిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.