Home » KTR
Telangana: బలహీన వర్గాలను ఒక్కటి చేసిన బాహుబలి కాసాని జ్ఞానేశ్వర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంగళవారం చేవెళ్ల లోక్సభ పరిధిలోని రాజేంద్ర నగర్లో కాసాని జ్ఞానేశ్వర్కు మద్దతుగా కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. చేవెళ్ల అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ సందర్భంగా బద్వేల్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణా ఏర్పడ్డాక మొట్టమొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, కేసీఆర్, కేటీఆర్ తెలంగాణ సమాజానికి ఒరగబెట్టింది ఏంటని ప్రశ్నించారు.
‘‘దేశంలో విపక్షాలు ఉంటే నా జేబులో ఉండాలి లేదంటే జైలులో ఉండాలి అన్నట్లు ప్రధాని మోదీ(PM Modi) తీరు ఉంది. గతంలో పండుగలకు నేతలు ఒకరి దగ్గరకు ఒకరు వెళ్లి శుభాకాంక్షలు తెలుపుకొనేవారు. మోదీ వచ్చాక విద్వేషాలు రెచ్చగొట్టి ఆ పరిస్థితి లేకుండా చేశారు’’ అని బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) వ్యాఖ్యానించారు.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బీజేపీ పార్టీలో చేరబోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) ఆరోపించారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్లో మంగళవారం నాడు ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికలపై బీఆర్ఎస్ క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ... పార్లమెంట్ ఎన్నికలు పార్టీ భవిష్యత్కు సంబంధించిన ఎన్నికలని చెప్పారు.
లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణ గట్టు మీద ప్రధాన పార్టీల అధినేతల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై బీజేపీ ముఖ్య నేత లక్ష్మణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ అంశం గురించి మాట్లాడుతూ దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
హైదరాబాద్: తెలంగాణ భవన్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుక కార్యక్రమం ఘనంగా జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటిఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
లోక్సభ ఎలక్షన్ల తర్వాత మాజీ మంత్రి కేటీఆర్ (KTR) జైలుకు పోవడం ఖాయమని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ (Shabbir Ali) అన్నారు. శనివారం నాడు కామారెడ్డిలో కాంగ్రెస్ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఎన్నికలకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు.
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో తవ్వేకొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivasa Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లా కాంగ్రెస్ (Congress) పార్టీ కార్యాలయంలో శనివారం నాడు ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి. ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు.
Telangana: ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రేపు (ఆదివారం) ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయి ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న సోదరి కవితను కలిసేందుకు కేటీఆర్ ఢిల్లీ వెళ్తున్నట్లు సమాచారం. కస్టడీ సమయంలో రోజూ గంట పాటు కుటుంబ సభ్యులను కలిసేందుకు వెసులుబాటు ఉంది. ప్రస్తుతం సీబీఐ హెడ్క్వార్టర్స్లో కవిత విచారణను ఎదుర్కొంటున్నారు. సాయంత్రం 6:00 గంటల నుంచి 7:00 గంటల మధ్య న్యాయవాది, కుటుంబ సభ్యులను కలిసేందుకు కవితకు అవకాశం ఉంది.
Telangana: మహాత్మ జ్యోతిరావు పూలే ఎంచుకున్న మార్గం, ఆయన బోధనలు అందరికీ ఆచరణీయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం తెలంగాణ భవన్లో మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కేటీఆర్, మధుసుధనాచారి, బీఆర్ఎస్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొని పూలేకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సమాజంలోని అన్ని వర్గాలు జ్యోతిబాపూలే వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవాలన్నారు.