• Home » KTR

KTR

ఆదేశాలిచ్చింది మీరేనా?

ఆదేశాలిచ్చింది మీరేనా?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అనధికార, అక్రమ టెలిఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సిట్‌ అధికారులు ఆదివారం విచారించారు. నందినగర్‌లోని ఆయన నివాసంలో నాలుగున్నర గంటలకుపైగా ఈ విచారణ కొనసాగింది. విచారణలో భాగంగా..

మీరెందుకు చేశారో.. మేమూ అందుకే!

మీరెందుకు చేశారో.. మేమూ అందుకే!

గతంలో రాహుల్‌, సోనియాలను ఈడీ విచారణకు పిలిస్తే రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేతలు ఎందుకు ధర్నాలు చేశారో.. ఇప్పుడు పనికిరాని విచారణ పేరిట మా నాయకుడిని విచారణకు పిలిచినందుకు మేమూ ధర్నా చేశాం....

తెలంగాణలో రాజకీయ సెగలు.. రేపు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు కేటీఆర్ పిలుపు..

తెలంగాణలో రాజకీయ సెగలు.. రేపు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు కేటీఆర్ పిలుపు..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత ఆందోళనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. సిట్ విచారణ పేరుతో కేసీఆర్‌ను ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారని, ప్రభుత్వ చర్యలను ఎక్కడికక్కడ ఖండించాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.

కేసీఆర్‌కు నోటీసులు.. కక్షసాధింపు రాజకీయానికి నిదర్శనం: కేటీఆర్

కేసీఆర్‌కు నోటీసులు.. కక్షసాధింపు రాజకీయానికి నిదర్శనం: కేటీఆర్

మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, పాలనా లోపాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారంటూ వ్యాఖ్యలు చేశారు..

అజిత్ పవార్ మరణం మహారాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు: కేసీఆర్

అజిత్ పవార్ మరణం మహారాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు: కేసీఆర్

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి పట్ల పలువురు తెలంగాణ రాజకీయ నేతలు సంతాపం తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్, మంత్రి సీతక్క, టీపీసీసీ చీఫ్, కేటీఆర్ తదితరులు.. అజిత్ మృతిపై ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

కేటీఆర్‌ బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే: ఎమ్మెల్సీ అద్దంకి

కేటీఆర్‌ బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే: ఎమ్మెల్సీ అద్దంకి

గణతంత్ర దినోత్సవం రోజున రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న స్పీకర్‌ను అవమానించిన మాజీ మంత్రి కేటీఆర్‌ బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేనని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నట్లు నాటకాలు ఆడిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలి: కేటీఆర్

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలి: కేటీఆర్

చేవెళ్లలో కాలె యాదయ్యను తన మనిషి అనుకుని కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించారని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ గెలిపించిన కొన్ని రోజులకే.. ఆయన కాంగ్రెస్ గూటికి వెళ్లాడంటూ మండిపడ్డారు.

నిజమైన సీరియల్ త్వరలో చూస్తారు: పొంగులేటి శ్రీనివాస్

నిజమైన సీరియల్ త్వరలో చూస్తారు: పొంగులేటి శ్రీనివాస్

సిట్ విచారణ పూర్తిగా చట్టప్రకారమే జరుగుతుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అవసరమైతే కేసీఆర్‌కు సైతం నోటీసులు ఇస్తామని స్పష్టం చేశారు.

సిట్‌ విచారణతో ఉక్కిరిబిక్కిరి.. ఎర్రవల్లి ఫాంహౌస్‌కు కేటీఆర్, హరీశ్

సిట్‌ విచారణతో ఉక్కిరిబిక్కిరి.. ఎర్రవల్లి ఫాంహౌస్‌కు కేటీఆర్, హరీశ్

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో కేటీఆర్, హరీశ్ రావు సహా ముఖ్య నేతలు సమావేశంకానున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఎర్రవల్లి ఫాంహౌస్‌లో ఈ సమావేశం జరుగనుంది.

రూ.కోట్ల బాండ్లు ఎలా వచ్చాయి?

రూ.కోట్ల బాండ్లు ఎలా వచ్చాయి?

బీఆర్‌ఎ్‌సకు కోట్లాది రూపాయల ఎలక్టోరల్‌ బాండ్లు ఎలా వచ్చాయి? పారిశ్రామికవేత్తలు, వ్యాపారుల ఫోన్లను ట్యాప్‌ చేసి.. వారి కాల్‌ రికార్డుల ఆధారంగా బెదిరించి పార్టీకి బాండ్లు వచ్చేలా చేశారా? ఎన్నికల సమయంలో వార్‌రూమ్స్‌ పేరిట అక్రమ ఫోన్‌ ట్యాపింగ్‌ ఎందుకు చేశారు.....

తాజా వార్తలు

మరిన్ని చదవండి