Home » Komatireddy Rajgopal Reddy
పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా చేర్యాల పట్టణంలో భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్ధి చామల కిరణ్ కుమార్ రెడ్డి మద్దతుగా కార్నర్ మీటింగ్ జరిగింది. ఈ మసమావేశంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జనగామ జిల్లా అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో జోకర్ గాళ్ళు, బ్రోకర్ గాళ్ళు ఎక్కువని విమర్శించారు.
కేసీఆర్ ఎక్కువ తక్కువ మాట్లాడితే జైల్లో వేస్తామని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి హెచ్చరించారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హితవుపలికారు.
Telangana: ఎక్కడో గెలిస్తే కిక్కు ఏముందని.. భువనగిరిలో గెలిస్తేనే కిక్కు అని భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జ్, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అన్నారు. గురువారం మునుగొడులో భువనగిరి పార్లమెంట్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆలేరు, భువనగిరి, నకిరేకల్, తుంగతుర్తి, ఇబ్రహీంపట్నం, నియోజకవర్గ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
Telangana: ‘‘నేను నిఖార్సయిన ఉద్యమకారుడిని, ఫైటర్ను.. ప్రజల కోసం ఎన్ని సార్లు అయినా జైలుకి పోయే దమ్మున్న నాయకుడిని. నన్ను విమర్శించే అర్హత కోమటిరెడ్డి సోదరులకు లేదు. కోమటిరెడ్డి సోదరులకు నడిమంతరపు సిరి వచ్చి కింద మీద ఆగడం లేదు. కోమటిరెడ్డి సోదరులకు బ్రోకర్లు అని పేరుంది’’ అంటూ కోమటిరెడ్డి సోదరులపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని.. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) 5 ఏళ్లలో సగం రోజులు మాత్రమే సీఎంగా ఉంటారని.. ప్రతిపక్షాలు తరచూగా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి (Maheswara Reddy) కూడా హాట్ కామెంట్స్ చేశారు.
భువనగిరి ఎంపీ టికెట్ బీసీలకు కేటాయించాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి(MLA Komati Reddy Raj Gopal Reddy) అన్నారు. శుక్రవారం నాడు మునుగోడు క్యాంపు కార్యాలయంలో రాజ్ గోపాల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భువనగిరి ఎంపీగా తన సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి పోటీ చేయడం లేదని పోటీ కోసం దరఖాస్తు చేయలేదని తేల్చిచెప్పారు.
Telangana: ఎల్ఆర్ఎస్పై(లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం) తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరుబాటకు దిగింది. మార్చి 6న అన్ని నియోజకవర్గాల్లో, హైదరాబాద్లో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ కార్యాలయాల వద్ద రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చింది. 7న జిల్లా కలెక్టర్, ఆర్డీవోలను కలిసి వినతి పత్రాలు సమర్పించాలని నిర్ణయించింది.
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయ వారసుడు మాజీమంత్రి హరీష్ రావు మాత్రమేనని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (MLA Komatireddy Rajagopal Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలు ఉపయోగిస్తున్న భాష అభ్యంతరకరంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతలు.. ప్రస్తుత సీఏం రేవంత్ రెడ్డిపై అలాంటి భాష వాడడం బాధాకరమన్నారు
తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సెషన్ చర్చ సందర్భంగా అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్దం తీవ్రస్థాయికి చేరింది. శాసన సభ్యులు కడియం శ్రీహరి, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకరికొకరు తీవ్రంగా విమర్శించుకున్నారు.