Home » Kollu Ravindra
AP Budget Reactions: ఏపీ బడ్జెట్పై అధికార, విపక్ష నేతలు పలు రకాలుగా స్పందించారు. బడ్జెట్ అద్బుతం అని అధికార పక్షం నేతలు చెబుతుండగా.. బడ్జెట్లో అంతా అరకొరకే నిధులు కేటాయించారని.. హామీలు పూర్తిగా విస్మరించారని విపక్ష నేతలు వ్యాఖ్యలు చేశారు.
2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అలాగే శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అనంతరం వ్యవసాయ బడ్జెట్ను మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో సమర్పించనున్నారు. మండలిలో మంత్రి నారాయణ వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెడతారు.
అధర్మంగా, దుర్గార్గంగా వ్యవహరించిన ప్రతి ఒక్కరినీ ధర్మం శిక్షిస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లను పోసాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దూషించాడని, ఇంట్లో ఉన్న ఆడ బిడ్డల గురించి కూడా చాలా అసహ్యంగా మాట్లాడాడని మంత్రి మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై అనుచిత పోస్టులు పెట్టే ఏ ఒక్కరినీ ఉపేక్షించమని స్పష్టం చేశారు.
Minister Kollu Ravindra: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్పై మంత్రి కొల్లు రవీంద్ర సంచలన ఆరోపణలు చేశారు. పెయిడ్ ఆర్టిస్టులను రైతులుగా నిలబెట్టి... ఐ ప్యాక్ చేత జగన్ చేస్తున్న డ్రామాలను ప్రజలు ఛీ కొడుతున్నారని విమర్శించారు.
ఒంగోలులో బుధవారం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామితో కలిసి నవోదయం 2.0 కార్యక్రమాన్ని మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు.
AP Ministers: మాజీ సీఎం వైస్ జగన్ గుంటూరు మిర్చి యార్డు పర్యటనపై రాష్ట్ర మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్కు లేదన్నారు మంత్రి కొల్లురవీంద్ర. జగన్ ఐదేళ్ల పాలనలో 14 వేల మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు.
వల్లభనేని వంశీ అడ్డంగా బుక్కయ్యారు. తనపై అక్రమ కేసులు పెట్టారంటూ బుకాయిస్తున్న వంశీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు టీడీపీ నేతలు. ఇదిగో సాక్ష్యం అంటూ సంచలన వీడియోను బయటపెట్టారు.
KOllu Ravindra: మాజీ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీకి రావాలని మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో జగన్ చర్చించాలని సూచించారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని జగన్ అనడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు.
రాష్ట్ర మద్యం విధానంపై వైఎస్ జగన్మోహన్రెడ్డి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని ఎక్సైజ్శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు.
Kollu Ravindra: గత జగన్ ప్రభుత్వ హయాంలో మద్యం విషయంలో ఏం జరిగిందో అందరికి తెలుసునని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మద్యం పాలసీపై తమ ప్రభుత్వం పారదర్శకంగా వెళ్తుందన్నారు. బెల్ట్ షాపులు అనేవి లేవని చెప్పారు. ఓ వేళ ఎవరైనా నిర్వహిస్తే కేసు నమోదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.