Home » Khammam
రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడం కోసం తమ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. వానాకాలం 2025-2026 సీజన్లో కందులకు ఎంఎస్పీ ద్వారా కొనుగోళ్లు ప్రారంభమయ్యాయని వెల్లడించారు.
ప్రశాంతి అనే యువతి ఖమ్మంలో బీటెక్ పూర్తి చేసింది. తర్వాత ఎంఎస్ చదివేందుకు ఫ్రాన్స్ వెళ్లింది. అక్కడ ఆమెకు పారిస్ నగరానికి చెందిన తోటి విద్యార్థి నాతన్ క్రిస్టోఫ్ జూబర్ట్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కొంతకాలానికి ప్రేమగా మారింది..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ పిచ్చోడి చేతిలో రాయిలాగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఒక దేశ అధ్యక్షుడి ఇంటిపై దాడి చేసి కిడ్నాప్ చేసే నీచ స్థితికి ట్రంప్ దిగజారారని షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయాలో పీక్స్కు చేరాయి. ఒకవైపు కేటీఆర్ టూర్ మరోవైపు మంత్రి తుమ్మల కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ తో కార్పొరేటర్ల జంపింగులు ముందస్తు ఎన్నికల వ్యూహాలతో ఖమ్మం రాజకీయం హీటెక్కిపోతోంది.
సంక్రాంతి పండుగను పురష్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆయా ప్రాంతాలకు బస్సు సర్వీసులతను నడుపుతున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్ మేనేజర్ శ్రీలత తెలిపారు. విజయవాడ, నల్లగొండ, ఖమ్మం ప్రాంతాలకు ఎల్బీనగర్ నగర్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు తెలిపారు.
స్కూలు బస్సు అదుపు తప్పి కాలువలో పడింది. దీంతో 20 మంది పిల్లలు గాయాలపాలయ్యారు. పెనుబల్లి మండలం, గణేష్పాడులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 107 మంది విద్యార్థులు ఉన్నారు.
ఖమ్మంలో ప్రపంచస్థాయి డిజైన్తో క్రికెట్ స్టేడియం నిర్మాణం చేస్తున్నామని మంత్రి తుమ్మల వెల్లడించారు. సర్దార్ పటేల్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్ పూర్తి కావొచ్చిందని వెల్లడించారు. ఖిల్లాకు రోప్ వే పనులు ప్రారంభమయ్యాయని.. జూన్ నాటికి మున్నేటిపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం కాకుండా సీఎం రేవంత్ ఫుట్ బాల్ కోసం పది కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు.
గంజాయి బ్యాచ్లను ఖమ్మంకు దూరం చేయాలని ఎన్నికల సమయంలో ప్రజలు అడిగారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలో గంజాయి కూడా లేకుండా చేస్తా అని స్పష్టం చేశారు.
స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఏదో పార్టీ తరఫున సీటు సాధించడం ఒక ఎత్తు. సీటు ఖరారు కాగానే గెలుపు కోసం సమీకరణలు, పెద్దల మద్దతు, సంఘీబావంతో పాటు మరో ముఖ్యమైన అంశం నగదు ఎన్నికల్లో ప్రధానాంశంగా మారనుంది. సొమ్ములేనిదే అడుగుకూడా పడే పరిస్థితి లేదు.