• Home » Khammam News

Khammam News

Minister Thummala: మున్నేరు పరివాహక ప్రాంతాలకు అలర్ట్.. మొదటి హెచ్చరిక జారీ అయ్యే అవకాశం

Minister Thummala: మున్నేరు పరివాహక ప్రాంతాలకు అలర్ట్.. మొదటి హెచ్చరిక జారీ అయ్యే అవకాశం

మున్నేరు పరివాహక ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉన్నందున ముందస్తూ.. చర్యల్లో భాగంగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. ముందుగా ముంపుకు గురి అయ్యే ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు.

Suryapeta CMRF: కోదాడ సీఎంఆర్ఎఫ్‌ చెక్కుల కుంభకోణం.. ఆరుగురి అరెస్ట్

Suryapeta CMRF: కోదాడ సీఎంఆర్ఎఫ్‌ చెక్కుల కుంభకోణం.. ఆరుగురి అరెస్ట్

ఆరోగ్య సమస్యలతో సీఎంఆర్ఎఫ్ కోసం అప్లై చేసుకున్న బాధితుల వివరాలు మార్చేసిన ముఠా ఆ డబ్బులను వేరే ఖాతాలకు మళ్లించి నొక్కేసిందని ఎస్పీ నరసింహ వివరించారు. గత కొంతకాలంగా సదరు ముఠా పలువురి సీఎంఆర్‌ఎఫ్‌ నిధులను కాజేస్తుందని గుర్తించారు.

Jagadish Reddy: మాజీలను చేర్చుకుంటే బలపడతామని బీజేపీ భ్రమపడుతుంది : జగదీష్ రెడ్డి

Jagadish Reddy: మాజీలను చేర్చుకుంటే బలపడతామని బీజేపీ భ్రమపడుతుంది : జగదీష్ రెడ్డి

కేసీఆర్‌ని అరెస్ట్ చేయడం కాంగ్రెస్ వల్ల కావడం లేదని, సీబీఐకి అప్పగిస్తే తాము అరెస్ట్ చేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ పోటీ పడుతున్నాడని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. గల్లీ నాయకులకు ఢిల్లీ ప్రమోషన్లు వస్తే.. ఇలాంటి పనులే చేస్తారని ఎద్దేవా చేశారు.

Ramchandra Rao:  తెలంగాణలో యూరియా కొరత ఎందుకొచ్చింది.. రేవంత్ ప్రభుత్వంపై టీ బీజేపీ చీఫ్ ప్రశ్నల వర్షం

Ramchandra Rao: తెలంగాణలో యూరియా కొరత ఎందుకొచ్చింది.. రేవంత్ ప్రభుత్వంపై టీ బీజేపీ చీఫ్ ప్రశ్నల వర్షం

బీసీ రిజర్వేషన్ విషయంలో తాము చిత్తశుద్ధితో ఉన్నామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ఉద్ఘాటించారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ బీసీలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆక్షేపించారు. బీసీలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని రామచంద్రరావు హెచ్చరించారు.

Minister Thummala: పెరుగుతున్న మున్నేటి వరద ప్రవాహం.. అధికారులని అలర్ట్ చేసిన మంత్రి తుమ్మల

Minister Thummala: పెరుగుతున్న మున్నేటి వరద ప్రవాహం.. అధికారులని అలర్ట్ చేసిన మంత్రి తుమ్మల

గత ఏడాది కనీవిని ఎరుగని రీతిలో మున్నేటికి వరద ముప్పు రావడంతో వందలాది మంది నిరాశ్రయులుగా మారారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మళ్లీ అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని మంత్రి తుమ్మల దిశానిర్దేశం చేశారు.

Minister Thummala: మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్‌పై మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు

Minister Thummala: మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్‌పై మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు

మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ట్రయిల్ రన్‌ని ఈనెల 24వ తేదీన నిర్వహించాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రఘునాధపాలెం మండలంలోని చెరువులన్నిటిని నింపాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డితో మాట్లాడి తక్షణమే టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టాలని సూచించారు.

KTR Criticizes Congress: ఆ ముగ్గురు మంత్రులపై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

KTR Criticizes Congress: ఆ ముగ్గురు మంత్రులపై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

కాంగ్రెస్ నేతలు మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను వంచించారని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. పాపం అంబేద్కర్.. ఇంత దగుల్బాజీ నాయకులు రాష్ట్రాన్ని పరిపాలిస్తారని ఊహించలేదని విమర్శించారు. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగితే కేసీఆర్ 100 సీట్లలో ఏకపక్షంగా గెలుస్తారని కేటీఆర్ జోస్యం చెప్పారు.

Khammam farmer: తూ.. ఏం బతుకిది.. రాయినై పుడితే బాగుండు

Khammam farmer: తూ.. ఏం బతుకిది.. రాయినై పుడితే బాగుండు

‘తూ.. ఏం బతుకిది? రాయినై పుడితే బాగుండు’ అంటూ ఓ రైతు పాట రూపంలో తనతో పాటు సాటి అన్నదాతలు పడుతున్న కష్టాల కన్నీటిని వివరిస్తున్న ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

Renuka Chowdary: రేణుకా చౌదరికి ఖమ్మం కోర్టులో ఊరట

Renuka Chowdary: రేణుకా చౌదరికి ఖమ్మం కోర్టులో ఊరట

మాజీ కేంద్రమంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరికి ఖమ్మం కోర్టులో ఊరట లభించింది. రేణుకా చౌదరిపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుని న్యాయస్థానం కొట్టివేసింది. 2014 సంవత్సరంలో వైరా ఎమ్మెల్యే టికెట్ తమకు (భూక్య రాంజీ సతీమణి కళావతి తనకు లేదా తన భర్తకు) ఇప్పిస్తానని రేణుకా చౌదరి మోసం చేశారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులోనే రేణుకాకు బిగ్ రిలీఫ్ లభించింది.

Minister Ponguleti: ఇందిరమ్మ ఇళ్లపై అదిరిపోయే అప్డేట్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

Minister Ponguleti: ఇందిరమ్మ ఇళ్లపై అదిరిపోయే అప్డేట్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని గత కేసీఆర్ ప్రభుత్వంలో అప్పుల్లోకి నెట్టారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. తమ ప్రభుత్వం పేదల మేలు కోసం పనిచేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి