Home » Khammam News
తాను గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవ్వరూ మాజీ సీఎం కేసీఆర్ (KCR) వెంట ఉండరని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒక్కటై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. మణుగూరులో సోమవారం నాడు జరిగిన ప్రజా దీవెన సభలో బీఆర్ఎస్, బీజేపీ నేతలపై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాతృ భాష పరిరక్షణకు అందరం కృషి చేయాలని సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ(N.V.Ramana) వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు ఖమ్మంలో ఎన్వీ రమణ అభిమానులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. స్వర్ణ భారతి కళ్యాణ మండపంలో ఎర్నేని రామారావు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓటమే తమ లక్ష్యంగా పని చేస్తామని మాస్ లైన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఠాగూర్(Pradeep Singh Tagore) అన్నారు. విప్లవ పార్టీలు ఐక్యం కావాలని, ప్రజా సమస్యలపై పోరాటాలు ఉధృతం చేస్తామని అన్నారు.
త్వరలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy) భద్రాద్రి రాములవారి సన్నిధిలో ప్రారంభిస్తారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి( Minister Ponguleti Srinivasa Reddy ) తెలిపారు. సోమవారం నాడు సత్తుపల్లిలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
గత కేసీఆర్ పాలనలో సింగరేణి సంక్షోభంలో కూరుకుపోయిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అన్నారు. కోల్ బ్లాక్ ఆక్షన్లో పాల్గొనకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణికి నష్టం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోల్ బ్లాక్ ఆక్షన్లో తప్పకుండా పాల్గొంటుందని తెలిపారు.
BRS Rajya Sabha Candidate: బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా ఖమ్మం జిల్లా నేత వద్దిరాజు రవిచంద్ర పేరు ఖరారైంది. పార్టీ అధినేత చంద్రశేఖర్ రావు.. రాజ్యసభ ఎంపీగా వద్దిరాజు పేరును ఖరారు చేశారు. ఈ మేరకు బుధవారం నాడు పార్టీ పెద్దలతో, ముఖ్యులతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. కాగా, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలతో
కాంగ్రెస్ పార్టీ ( Congress Party ) అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలయ్యేలా కనిపించడం లేదని బీఆర్ఎస్ ( BRS ) రాజ్యసభ ఎంపీ వద్ది రాజు రవిచంద్ర ( Vaddiraju RaviChandra ) అన్నారు. మంగళవారం నాడు తెలంగాణ భవన్లో ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు.
మధిర నియోజకవర్గ బీఆర్ఎస్ ( BRS ) అభ్యర్థి లింగాల కమల్రాజ్ ( Lingala Kamalraj ) కు పార్టీ అన్ని విధాలా సహకరించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ( KTR ) అన్నారు.
ఖమ్మం జిల్లాలో నేతల మధ్య విభేదాలు ఎక్కువ అయ్యాయని.. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు ఓడి పోయామని బీఆర్ఎస్ ( BRS ) ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ( Pocharam Srinivasa Reddy ) అన్నారు. తెలంగాణ భవన్లో మంగళవారం నాడు ఖమ్మం పార్లమెంట్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర ప్రజల అందరి దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ( Minister Ponguleti Srinivas Reddy ) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... నేలకొండపల్లి మండలం శంకరగిరి తండాలో ప్రజా పాలన గ్రామసభ నిర్వహించారు. ఈ సభలో పొంగులేటి పాల్గొని మీడియాతో మాట్లాడుతూ..... ఇందిరమ్మ రాజ్యంలో ముఖ్యమంత్రి మంత్రులు మీ సేవకులుగా పనిచేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చెప్పారు.