Home » Khammam News
ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల వరకే రాజకీయాలని.. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరూ ప్రజలకు మంచి చేసే ప్రజా ప్రతినిధులేనని పేర్కొన్నారు.
ఖమ్మం జిల్లాలోని జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెలుగుమట్ల భూదాన్ యజ్ఞ బోర్డు భూముల నిర్వాసితులతో కలిసి ఆందోళనకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత దిగారు.
కొత్తగూడెం నియోజకవర్గంలో సీనియర్ నేత కోనేరు సత్యనారాయణ (చిన్ని)కు కార్పొరేషన్ చైర్మన్ పదవి కేటాయించాలని కాంగ్రెస్ అధిష్ఠానానికి పార్టీ సేవాదళ్ జాయింట్ సెక్రటరీ ఎస్.జె.కె.అహ్మద్ విజ్ఞప్తి చేశారు.
బావా, బావమరిది పెయిడ్ ఆర్టిస్టులతో తమ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఒళ్లంతా విషాన్ని నింపుకుని మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
తెలంగాణలో దుర్మార్గమైన ప్రభుత్వం రాజ్యమేలుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో తొలగించిన ఆక్రమణలను కేటీఆర్ పరిశీలించారు.
సత్తుపల్లి మున్సిపాలిటీ జనరల్ మహిళకు రిజర్వ్ అయిన చైర్పర్సన్ పదవి -దక్కించుకునేందుకు ప్రధానంగా ముగ్గురు కౌన్సిలర్లు పోటీ పడుతున్నారు. ఓట్ల లెక్కింపు ముగియగా.. సత్తుపల్లి మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది.
తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 11న(బుధవారం) మున్సిపల్ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్ జరిగింది. ఈనెల 13వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ఎన్నికల ఫలితాలపై ఓ సర్వే సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కేసీఆర్ హయాంలో భారీగా అవినీతికి పాల్పడ్డారని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో దొరల పాలనలో పేదలు అనేక ఇబ్బందులు పడ్డారని విమర్శించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీని తెలంగాణలో లేకుండా చేస్తానని కంకణం కట్టుకున్న కేసీఆర్ను తరిమికొట్టాలని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈనెల 18న ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. రూ.362 కోట్ల అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించనున్నారు. అలాగే మున్సిపల్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఈ విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రస్తావిస్తూ.. తమ ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు కోసమే నిరంతరం పని చేస్తోందన్నారు.