Home » Khammam News
జాగృతి జనం బాటలో భాగంగా ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించేలా ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తనపై ఆరోపణలు చేస్తున్న వ్యక్తులని దీర్ఘకాలం ఎవరూ రక్షించలేరని హెచ్చరించారు.
నవ మాసాలు మోసి.. కనీపెంచి పోషించిన తల్లికి అండగా ఉండాల్సిన ఆ కుమారుడు విచక్షణ మరిచిపోయాడు. మద్యానికి బానిసై కన్నబంధాన్ని మరిచి దారుణంగా తల్లినే హతమార్చాడు. ఈ విషాదకర సంఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం కాకరవాయిలో జరిగింది.
కూల్డ్రింక్లో పురుగుల మందు ఉన్న విషయం తెలియని నాగరాజు దానిని తాగడంతో.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.
పినపాక అభివృద్ధి కోసం ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసిన దాడి సిగ్గుమాలిన చర్య అని రేగా కాంతారావు పేర్కొన్నారు.
మణుగూరు తమ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు గుప్పించింది.
పాలేరు జలాశయానికి వరద కొనసాగుతోంది, గురువారం సాయంత్రానికి అధికారుల అంచనా ప్రకారం సుమారు 45వేల క్యూసెక్కులనీరు పరీవాహకప్రాంతాలనుంచి పాలేరు జలాశయానికి వస్తోంది.
సత్తుపల్లిలో బీసీ బంద్లో భాగంగా బీసీ సంఘాల నాయకులు, కాంగ్రెస్ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి పాల్గొనేందుకు వచ్చిన బీజేపీ కార్యకర్తలను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లు ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటూనే మరోపక్క ర్యాలీకి ఎలా వస్తారంటూ బీజేపీ కార్యకర్తలను కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.
భూ భారతిలో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పిస్తామంటూ ఓ ముఠా రైతులను మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. డబ్బులు ఇచ్చి పట్టాదారు పుస్తకం కోసం వెళ్లగా.. నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు ఇచ్చేవారని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ నాయకులకు ప్రజలు రెండు పర్యాయాలు బుద్ధి చెప్పారని మంత్రి పొంగులేటి గుర్తు చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రజలు బుద్ధి చెప్తారని పేర్కొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం వద్ద గోదావరి నదిలో వరద ఉధృతి తీవ్రంగా పెరుగుతున్న కారణంగా రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.