Home » Khammam News
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మద్యం టెండర్లు(Liquor tenders) జరిగితే సరిహద్దు జిల్లాలోని మద్యం వ్యాపారులు పాల్గొంటారు. గతేడాది తెలంగాణలో జరిగిన మద్యం టెండరు ప్రక్రియలో ఏపీకి చెందిన మద్యం వ్యాపారులు జోరుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మద్యం టెండర్లలో పాల్గొన్నారు. అ
ఖమ్మంలో అక్రమ నిర్మాణాలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో యంత్రాంగం చాలా బాగా పనిచేసిందని ప్రశంసించారు.
వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. అన్నదాతల బాధలు చూసి వారిని ఆదుకునేందుకు ఎకరాకు రూ.10వేలు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.
మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేయడంలో అన్ని శాఖల సిబ్బంది సమన్వయంతో పని చేశారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు, నష్టం అంచనాలపై ఈరోజు( మంగళవారం) మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఖమ్మం జిల్లాలో గత వారం రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. కుండపోతగా వానలు కురుస్తుండటంతో ఇద్దరు వ్యక్తులు కొట్టుకుపోగా మరొకరు గల్లంతయ్యారు.
గత వారంరోజులుగా ఖమ్మ జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి. దీంతో మున్నేరు వాగు పొంగి ఖమ్మం పట్టణంలోని చాలా ప్రాంతాలు ముంపునకు గురి అయ్యాయి. ప్రజలు చాలా రకాలుగా నష్టపోయారు. ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటున్న సమయంలో ప్రైవేట్ సంస్థలు కూడా తమ వంతు బాధ్యతగా ప్రజలకు నిత్యవసర సరుకులు అందజేస్తూ వారి మానవతా దృక్పథాన్ని చాటుతున్నారు.
ఖమ్మం జిల్లాలో గత వారం రోజుల నుంచి భారీ వర్షం కురుస్తోంది. వానలు దంచికొడుతుండటంతో ఖమ్మం జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. వరద కాలనీలను నీరు ముంచెత్తడంతో ప్రజలు నరకయాతన పడుతున్నారు.
మున్నేరు(Munneru) వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) పర్యటించారు. ఖమ్మం నగరంలోని 16వ డివిజన్ దంసాలపురం, తిరుమలాయపాలెం, రాకాసి తండాలో వరదముంపు బాధితులతో కేంద్ర మంత్రి మాట్లాడారు.
ఖమ్మంలో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వరద ముప్పు పెరగడంతో వరద బాధిదులు మళ్లీ బయాందోళనలకు గురువుతన్నారు. మున్నేరు మళ్లీ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఖమ్మం వద్ద మున్నేరు ప్రవాహం పెరుగుతోంది.
తెలంగాణలో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో కుండపోతగా వానలు కురుస్తుండటంతో మున్నేరు వారు పొంగి ఉధృతంగా ప్రవహించింది. దీంతో లోతట్టు కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద బాధితులను ఆదుకోవడానికి బీజేపీ పార్టీ ముందుకు వచ్చిందని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తెలిపారు.