Home » Kerala
కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని మరింత బలోపేతం చేయడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగుతున్నారు. ఇవాళ సాయంత్రం ఆయన కేరళంకు బయలుదేరనున్నారు. అక్కడ రెండు రోజుల పాటు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్కు బీజేపీ పరోక్షంగా మద్దతిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో పోటీ యూడీఎఫ్కు, సీపీఎం-బీజేపీ కంబైన్కు మధ్యే జరగనుందని అన్నారు.
కేరళలో కాంగ్రెస్-లెఫ్ట్ పార్టీల మధ్య సంబంధాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశ్నించారు. రెండు పార్టీలు పరస్పర ప్రత్యర్థులుగా కనిపిస్తూ, వంతులవారిగా రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నాయని విమర్శించారు.
సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ‘సూపర్ మ్యాన్’ ఫేమ్ వాలెరీ పెర్రీస్, రాజస్థాన్ యువ నటి హర్షిల్ కాలియా కన్నుమూసిన విషయం మరవక ముందే మలయాళ ప్రముఖ నటుడు, దర్శకుడు ఇ.ఏ.రాజేంద్రన్ కన్నుమూశారు.
అసెంబ్లీ ఎన్నికల వేళ కేరళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. బీజేపీకి కాంగ్రెస్, రాహుల్ గాంధీ బి-టీమ్ అంటూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది.
వచ్చే నెలలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా భారత ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ జారీ చేసింది. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ప్రామాణిక వసతులు కల్పించాలని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులను ఆదేశించింది.
పుదుచ్చేరిలో సిట్టింగ్ మంత్రులు, కీలక నేతలకు మరోసారి అవకాశం కల్పించడం ద్వారా 'ప్రో-ఇంకంబెన్సీ'ని వాడుకోవాలని బీజేపీ చూస్తోంది. అటు కేరళలో సినీ నటులు (వివేక్ గోపన్), సామాజిక సమీకరణలతో అభ్యర్థులను ఎంపిక చేయడం విశేషం.
కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, రాహుల్ బీజేపీకి 'బీ టీమ్' అని ఆక్షేపించారు.
ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతల నడుమ, దేశ వ్యాప్తంగా గ్యాస్ వినియోగదారులు ఎన్ని కష్టాలు పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రతిరోజూ గ్యాస్ ఏజెన్సీ ఎదుట ఉదయం నుంచి గ్యాస్ సిలిండర్లతో బారులు తీరుతున్నారు.
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ఊపందుకుంటోంది. సీపీఎం వెటరన్ నేత, ముఖ్యమంత్రి పినరయి విజయన్ కన్నూరు జిల్లా ధర్మదం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గురువారంనాడు నామినేషన్ వేశారు.