Home » Kerala
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూనైటెడ్ డెమోక్రటిక్ ఫ్రెంట్ (యూడీఎఫ్)కు ఆ రాష్ట్ర ఓటరు పట్టం కట్టారు. ఈ ఎన్నికల్లో యూడీఎఫ్కు ఓటర్ స్పష్టమైన మేజార్టీ కట్టబెట్టాడు.
కేరళం అసెంబ్లీ ఫలితాల్లో యూడీఎఫ్ ఘనవిజయం సాధించి వారం రోజులైనప్పటికీ తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే సస్పెన్స్ కొనసాగుతోంది. తాజాగా సీఎం పదవిని బలంగా ఆశిస్తున్న కాంగ్రెస్ నేత వీడీ సతీశన్ ఆ పదవి మినహా తనకు ఏ పదవీ అక్కర్లేదని తేల్చిచెప్పినట్టు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.
కేరళం ముఖ్యమంత్రి అభ్యర్థిపై కొనసాగుతున్న సస్పెన్స్కు మరి కొద్ది గంటల్లో తెరపడనుంది. సీఎం అభ్యర్థిపై కాంగ్రెస్ పార్టీ మంగళవారంనాడు ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవడం ద్వారా పార్టీలో ఎలాంటి నిరసనలు, రాజకీయ అశాంతికి తావీయరాదని కాంగ్రెస్ భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
కేరళ ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎంపీలు, మిత్ర పక్షాలతో ఇప్పటికే ఏఐసీసీ పరిశీలకులు చర్చలు జరిపారు. అభిప్రాయ సేకరణ కూడా పూర్తయింది.
కేరళం కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎంపిక పంచాయతీ ప్రస్తుతం ఢిల్లీకి చేరింది. ముఖ్యమంత్రి ఎవరనేది తేల్చేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు.
కేరళ సీఎం ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కీలక సమావేశం ప్రారంభమైంది.
కేరళంలో కాంగ్రెస్ సారథ్యంలో యూడీఎఫ్ కూటమి విజయం సాధించడంతో ముఖ్యమంత్రి ఎంపికకు కసరత్తు జరుగుతోంది. ఈ రేసులో లోక్సభ ఎంపీ కేసీ వేణుగోపాల్ ముందున్నారని తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్లు తమ నివేదికను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు సమర్పించినట్టు పార్టీ వర్గాలు శుక్రవారంనాడు తెలిపాయి.
కేరళం ఎన్నికల ఫలితాలు ఇచ్చిన సంకేతాలేంటి. కాంగ్రెస్ తొడగొట్టి అంత భారీ విజయాన్ని ఎలా నమోదు చేసింది. కాంగ్రెస్ వ్యూహాలు ఎలా పనిచేశాయి.
కేరళంలో పినరయి విజయన్ సారథ్యంలోని ఎల్డీఎఫ్ ఓటమిని చవిచూసినప్పటికీ ధర్మాదం నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు. ఈ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయడం మూడోసారి. అయితే గత రెండు పర్యాయాల్లో ఆయన సాధించిన ఆధిక్యం కంటే ఈసారి తగ్గింది.
కేరళం ముఖ్యమంత్రి రేసులో ముగ్గురు కాంగ్రెస్ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, అసెంబ్లీలో విపక్ష నేత వీడీ సతీశన్, పార్టీ కేరళం విభాగం మాజీ అధ్యక్షుడు రమేష్ చెన్నితాల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.