Home » Kerala
దేవుడి సొంత నేల.. కొబ్బరి నేల.. చైతన్యానికి నెలవైన కేరళ ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఎలాంటి తీర్పు ఇవ్వనుందోననే ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల్లో కాంగ్రె్సకు పదిహేను సీట్లతో పట్టం కట్టిన మలయాళీలు.. అధికార లెఫ్ట్ ఫ్రంట్ను ఒక్క స్థానానికే పరిమితం చేశారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ సీనియర్ నేతలపై కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా రావనే నిరాశానిస్పృహలు బీజేపీలో కనిపిస్తున్నాయన్నారు. ఆ కారణంగానే ప్రజా సంక్షేమంతో ఏమాత్రం సంబంధంలేని రోజుకో అంశాన్ని ఆ పార్టీ నేతలు లేవనెత్తుతున్నారని ప్రియాంక తప్పుపట్టారు.
కేరళలో బర్డ్ఫ్లూ(Bird flu) కారణంగా కోళ్లు, బాతులు వందల సంఖ్యలో చనిపోవడంతో ఆ వ్యాధి రాష్ట్రంలో ప్రవేశించకుండా ఉండేందుకు 12 చోట్ల వెటర్నరీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేరళ స్వతంత్ర ఎమ్మెల్యే పీవీ అన్వర్ తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్కు గాంధీ కుటుంబంతో సంబంధం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది తన ఒక్కడి సందేహాం కాదని యావత్ దేశ ప్రజలు ఇదే మాట అనుకుంటున్నారని వివరించారు.
కేరళ రాష్ట్రంలో బర్డ్ఫ్లూ స్వైర విహారం చేస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేరళ నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించే వాహనాలపై నిఘా వేశారు. ముఖ్యంగా కేరళ నుంచి కోళ్ళ దానా, కోళ్ళ ఉత్పత్తులు, కోడిమాంసం, కోడిగుడ్లు వంటివి సరఫరా కాకుండా అడ్డుకుంటున్నారు. కేరళ రాష్ట్రంలోని ఆలప్పుళా జిల్లాలోని కుట్టనాడులో బర్డ్ఫ్లూ కేసులు వెలుగు చూశాయి. ఈ కేసులు వచ్చిన కిలోమీటరు దూరంలోని కోళ్ళఫారాల్లో కోళ్ళతో పాటు కోళ్ళ ఉత్పత్తులను నిర్వీర్యం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎండలు మండిపోతున్నాయి. ఇంటి నుంచి అడుగు బయటకు పెట్టాలంటేనే.. ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. ఎండల వేడి నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది వివిధ రకాల ప్రయత్నాలు చేయడం చూస్తూ ఉంటాం. కొందరు....
'ఇండియా' కూటమిలో మిత్రులు, కేరళలో ప్రత్యర్థులుగా ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కేరళ సీపీఎం నేత, ముఖ్యమంత్రి పినరయి విజయన్ మధ్య వాగ్యుద్ధం కొనసాగుతోంది. రాహుల్ గాంధీ ఇటీవల తనపై చేసిన వ్యాఖ్యలపై పినరయి విజయన్ శుక్రవారం ఘాటుగా స్పందించారు. మీ నాన్నమ్మ కూడా జైలుకు వెళ్లారని గుర్తుచేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, వయనాడ్ సిట్టింగ్ ఎంపీ రాహుల్ గాంధీపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఘాటు విమర్శలకు దిగారు. సంఘవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతో నిషేధానికి గురైన ఒక సంస్థకు చెందిన రాజకీయ విభాగంతో రాహుల్ 'రహస్య ఒప్పందం' కుదుర్చుకున్నారని ఆరోపించారు.
కేరళకు చెందిన అబ్దుల్ రహీమ్ కోసం.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్ రవి రంగంలోకి దిగారు. అతడిని మరణ శిక్ష నుంచి రక్షించేందుకు సాక్షాత్తు సీఎం నడుం బిగించారు. ఆ క్రమంలో అతడిని రక్షించేందుకు నేను సైతం అంటూ ప్రపంచంలోని మలయాళీలంతా కదిలి రావాలని ఆయన పిలుపు నిచ్చారు.
రాజకీయాలు ఎంత విచిత్రంగా ఉంటాయో అనడానికి ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలే నిదర్శనం.. ఒకచోట ప్రశంసలు కురిపించు కున్న వాళ్లే.. మరో చోట విమర్శలు చేసుకుంటున్నారు. ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న పార్టీలు.. ఒక చోట కలిసి పోటీ చేస్తుంటే.. మరోచోట ప్రత్యర్థులుగా బరిలోకి దిగుతున్నాయి.