Home » KCR
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టికెట్ కోసం కొడుకు పేరు మార్చిన ఘనత కేసీఆర్ ది అంటూ వ్యాఖ్యానించారు.
ప్రజా జీవితంలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ శుభాకాంక్షలు తెలియజేశారు.
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పాలనలో అప్పులపై కేసీఆర్ స్పందించాలన్నారు.
బీఆర్ఎస్ పార్టీలోని అగ్రనేతల వైఖరిని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి మరోసారి ఎండగట్టారు. సోమవారం హైదరాబాద్లో సీఎల్పీ మీడియా హాల్లో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ధనిక రాష్ట్రంగా తెలంగాణ ఇచ్చారని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. అలాంటి రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఏ విధంగా దోచుకుని.. అప్పులు పాలు చేశారో తెలంగాణ ప్రజలందరికి తెలుసునని ఆయన విమర్శించారు. పందికొక్కుల్లా దోచుకుని రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారంటూ బీఆర్ఎస్ నాయకులపై ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నిప్పులు చెరిగారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో కిరణ్ స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డ్ చేశారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం జడ్చర్ల సభ వేదికపై నుంచి నిప్పులు చెరిగారు. నీ పదేళ్ల పాలన.. నా రెండున్నరేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా? అంటూ కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డి సవాల్ విసిరారు.
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ కచ్చితంగా ఇక్కడి భూమి పుత్రుల జాగీరే అని స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ కార్యాలయంలో అమరవీరులకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల పాలైందని మాజీ మంత్రి వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే హైదరాబాద్ సిటీలో 24 గంటల పాటు తాగునీటిని సరఫరా చేస్తామని కేటీఆర్ అన్నారు. 24 గంటల కరెంట్ ఇచ్చిన తీరుగానే ప్రతి ఇంటికి మంచి నీరు అందిస్తామని స్పష్టం చేశారు.