Home » Karnataka
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమర్ తమ్ముడు, మాజీ ఎంపీ డీకే సురేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం శాశ్వతం కాదు.. తలరాత రాసి ఉంటే మా అన్న సీఎం అవుతారు.. అంటూ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు కన్నడనాట ఇప్పుడు సంచలనానికి దారితీశాయి.
పార్టీ పట్ల మొదటి నుంచీ క్రమశిక్షణ కలిగిన సైనికుడు గానే తన సోదరుడు ఉన్నారని డీకే శివకుమార్ అభివర్ణించారు. ఇటు పార్టీ ప్రయోజనాలు, అటు శాసనసభ్యుల ప్రయోజనాలకు ఆయన ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారని చెప్పారు..
కర్ణాటక ప్రభుత్వం డీజీపీ స్థాయి అధికారి కె.రామచంద్ర రావును సస్పెండ్ చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న కొన్ని వీడియోల్లో రామచంద్ర రావు.. మహిళలతో అనుచితంగా ప్రవర్తిస్తున్నట్టు ఉండటంతో ఈ మేరకు చర్యలు చేపట్టింది.
రోడ్డుపై డబ్బులడిగిన ఓ యాచకుడికి భోజనం పెట్టించి అందరి మన్ననలూ పొందుతున్నాడో యువకుడు. కర్ణాటకలో జరిగిన ఈ సంఘటన.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు డాక్టర్ భీమన్న ఖండ్రే మృతికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థించారు.
కర్ణాటకలో చారిత్రక ప్రాధాన్యం కలిగిన లక్కుండి గ్రామంలో ఓ బాలుడికి 470 గ్రాముల బంగారు నాణేలు లభించడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రస్తుతం ఆ గ్రామంలో తవ్వకాలు జరిపేందుకు పురావస్తు శాఖ రంగంలోకి దిగింది.
కర్ణాటకకు చెందిన ఓ బైకర్ చైనా మాంజా బారిన పడి మరణించిన ఘటన తాజాగా వెలుగు చూసింది. బైక్పై వెళుతుండగా ఆయనకు మాంజా చుట్టుకుని తీవ్ర గాయాలు కావడంతో దుర్మరణం చెందారు. బీదర్ జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది.
శివకుమార్ పోస్ట్ కీలకమైన రాజకీయ సంకేతంగా రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి కావాలనే తన ఆకాంక్షను డీకే శివకుమార్ చాలాకాలం క్రితమే వ్యక్తం చేశారు.
శనివారం ఉదయం ప్రజ్వల్ అనే బాలుడు తమ ఇంటి నిర్మాణం కోసం పునాదులు తవ్వుతూ ఉన్నాడు. మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 గంటల ప్రాంతంలో అతడికి భూమిలో చిన్న రాగి బిందె దొరికింది. దాన్ని ఓపెన్ చేసి చూడగా అందులో పెద్ద మొత్తంలో పురాతన బంగారు ఆభరణాలు ఉన్నాయి.
విద్వేష ప్రసంగాల నిరోధక బిల్లుపై గవర్నర్ను బీజేపీ కలవాలని అనుకుంటున్నట్టు వస్తున్న సమాచారంపై సిద్ధరామయ్య మాట్లాడుతూ, ఈ బిల్లును గవర్నర్ తోసిపుచ్చలేదని చెప్పారు.