Home » Karnataka
దక్షిణాదిన టార్గెట్-50 అంటున్న బీజేపీకి కర్ణాటక అత్యంత కీలకం. మిగతా ఏ రాష్ట్రంలోనూ రెండంకెల స్కోరు దాటే పరిస్థితి లేని నేపథ్యంలో ఇక్కడ గెలిచే స్థానాలే ముఖ్యం.
సార్వత్రిక ఎన్నికల సమరంలో భాగంగా మంగళవారం మూడో దశ పోలింగ్ జరగనుంది. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 లోక్సభ నియోజకవర్గాల్లో ఓటింగ్ నిర్వహించనున్నారు.
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(DK Shiva Kumar) కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చెంప పగులగొట్టిన ఘటన కన్నడనాట రాజకీయ దుమారం రేపింది. హవేరి జిల్లాలో జరిగిన ఈ ఘటన తాలూకు వీడియోను కర్ణాటక బీజేపీ(BJP) సోషల్ మీడియా షేర్ చేసింది..
అత్యాచారానికి గురైన అనేక మంది మహిళలు సమాజంలో వివక్ష ఎదుర్కొంటుండటంతో వారికి ఆర్థిక సాయం అందించేందుకు సీఎం సిద్ధరామయ్య(CM Siddaramaiah) సర్కార్ నిర్ణయించింది. అత్యాచార బాధితులందరికీ ఆర్థిక సాయం చేయడానికి విధివిధానాలను త్వరలో ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.
మహిళ కిడ్నాప్, లైంగిక ఆరోపణల కేసులో ఇరుక్కున్న జేడీఎస్ నేత హెచ్ డీ రేవణ్ణ(H D Revanna)కు మరో షాక్ తగిలింది. హెచ్డీ రేవణ్ణను మూడు రోజుల పాటు సిట్ కస్టడీకి పంపింది. ఇప్పుడు ఆయన మే 8 వరకు సిట్ కస్టడీ(custody)లో ఉంటారు. శనివారం (మే 4న) సిట్ అతడిని అరెస్టు చేసింది.
కేపీసీసీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ నకిలీ ఫొటోలను సోషల్ మీడియా ద్వారా వైరల్ చేసేందుకు ప్రయత్నించిన ముగ్గురిపై హైగ్రౌండ్ పోలీసులు ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
కిడ్నాపింగ్ కేసుకు సంబంధించి మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవెగౌడ తనయుడు, జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ శనివారంనాడు నిర్బంధంలోకి తీసుకుంది. బెంగళూరులోని కేఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో హెచ్డీ రేవణ్ణపై రెండ్రోజుల క్రితం కిడ్నాపింగ్ కేసు నమోదైంది.
కర్ణాటక రాజకీయాలను కుదిపివేస్తున్న లైంగిక వేధింపుల కేసులో జేడీఎస్ ఎంపీ ప్రజల్వ్ రేవణ్ణ చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తును చేపట్టిన 'సిట్' ఆయనకు లుకౌట్ నోటీసులు జారీచేయగా, శనివారంనాడు తాజాగా మరోసారి ఆయనకు, ఆయన తండ్రి హెచ్డీ రేవణ్ణకు లుకౌట్ నోటీసులు జారీ చేసింది.
జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ 400మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడి, వీడియోలు చిత్రీకరించాడని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు (AP Elections) కీలక దశకు చేరుకున్నాయి. సమయం లేదు మిత్రమా అంటూ అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే సువర్ణావకాశంగా మలుచుకుని ముందుకెళ్తున్నారు. ఇక.. ఎటు చూసినా పోలీసుల తనిఖీల్లో కోట్లల్లోనే నగదు పట్టుబడుతోంది. ఎక్కడ చూసినా నోట్ల కట్టలే దర్శనమిస్తున్నాయి. ఇక నోట్ల తరలించే విధానం చూస్తే ముక్కున వేలేసుకునే పరిస్థితి. తాజాగా.. అనంతపురం జిల్లాలో 2 వేల కోట్ల నగదు పట్టుబడింది...