Home » Karnataka
పార్టీ అధిష్ఠానాన్ని కలిసేందుకు ఇద్దరు నేతలు వెళ్లే అవకాశం ఉందా అని అడిగినప్పుడు డీకే శివకుమార్ నవ్వుతూ సమాధానమిచ్చారు. మీడియాకు తప్పనిసరిగా చెబుతానని, ఏదీ దాచిపెట్టనని అన్నారు.
19 ఏళ్ల ఓ యువతి 40 ఏళ్ల ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. అతడి కోసం కన్నవాళ్లను కాదనుకుంది. ఇంటి నుంచి అతడితో పాటు పారిపోయింది. ఈ కారణమే ఆ వ్యక్తి ప్రాణాలు తీసింది.
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు సీఎం పగ్గాలు అప్పగించనున్నారంటూ ఇటీవల ఊహాగానాలు ఊపందుకోవడంతో పార్టీ అధిష్ఠానం జోక్యం చేసుకుంది. ఒకరినొకరు విందు సమావేశాలకు ఆహ్వానించుకుని కూర్చుని మాట్లాడుకోవాలని సూచించింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్యనుద్దేశించి ఆయన.. ఓ ఔట్ గోయింగ్ సీఎం అంటూ అనడంతో.. కాంగ్రెస్ నేతలు, ఆ పార్టీ ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ వర్గాలు పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టాయి.
చైనా జీపీఎస్ ట్రాకర్ ఉన్న సముద్రపు పక్షి కర్ణాటక తీరంలో కనిపించడం కలకలానికి దారి తీసింది. ఆ ట్రాకర్లో చైనా అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈమెయిల్ ఐడీ ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ విషయంలో నిజానిజాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు.
రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉందా.. చచ్చిందా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతిపక్ష నాయకుడు ఆర్.అశోక్. జైల్లో ఉండే దొంగలకు, తీవ్రవాదులకు బయటినుంచి వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు అందుతున్నాయి. ఇది అత్యంత ప్రమాదకరమైన విషయమంటూ ఆయన మండిపడ్డారు.
విమానంలో అస్వస్థతకు గురయిన ఓ అమెరికా ప్రయాణికురాలిని కర్ణాటక కాంగ్రెస్ నేత డా. అంజలి నింబాల్కర్ కాపాడారు. వెంటనే సీపీఆర్ చేసి ఆమెను రక్షించారు. ఆమె సేవా తత్పరతను చూసి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ప్రశంసలు కురిపించారు.
అక్కడ.. అధికారులే అమ్మా.. నాన్న అయ్యారు. పునరావాస కేంద్రంలో ఉన్న మహిళలకు స్థానిక, ఉన్నతాధికారులే దగ్గరుండి పుళ్లి జరిపించారు. జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు పెళ్లిపెద్దలుగా మారి ఆ వివాహాలను జరిపించారు. ఇక వివరాల్లోకి వెళితే...
మాజీ మంత్రి కుమారుడి కారు ఢీకొని ఓ యువకుడు దుర్మరణం పాలైన సంఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీల అమలు కమిటీ అధ్యక్షుడు హెచ్ఎం రేవణ్ణ కుమారుడు శశాంక్ కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. దీంతో రాజేశ్ అనే మువకుడు దుర్మరణం పాలయ్యాడు.
కళ్లకు గంతలు కట్టుకుని ఓ విద్యార్థిని పరీక్ష రాస్తూ.. అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. హిమబిందు అనే బాలిక 8వ తరగతి పరీక్షలు రాస్తోంది. అయితే.. గాంధారి విద్య సహాయంతో కళ్లకు గంతలు కట్టుకుని తన 8వ తరగతి పరీక్షలు రాస్తోంది.