Home » Karimnagar
నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం రామగుండంలో ఎరువుల కర్మాగారం, ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రాన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి విస్తరిస్తుంటే కాంగ్రెస్ నాయకులు కాంట్రాక్టులు, కమీషన్ల కోసం వేధిస్తున్నారని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జీ కిషన్రెడ్డి ఆరోపించారు.
బీఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందం చేసుకుని కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి కుటిల ప్రయత్నాలు చేస్తున్నాయని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆరోపించారు. ఆదివారం రాత్రి గోదావరిఖని ఓల్డ్ అశోక థియేటర్ వద్ద జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రహస్య ఒప్పందాలతో రాష్ట్ర వ్యాప్తంగా మేయర్లు, కౌన్సిలర్లు, చైర్మన్లను దక్కించుకోవడానికి బీఆర్ఎస్, బీజేపీలు రహస్య ఒప్పందం చేసుకుందని, కాంగ్రెస్కు ఓటు వేయకపోతే అభివృద్ధి కుంటు పడుతుందన్నారు.
రామగుండానికి పూర్వవైభవాన్ని తీసుకురావడానికి వ్యాపార, విద్య, వైద్య పరంగా అభివృద్ధికి నిరంతర కృషి చేస్తున్నామని రామగుండంలో ఇక కూల్చివేతలు ఉండబోవని కట్టడాలే ఉంటాయని రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ మక్కాన్సింగ్ పేర్కొన్నారు.
క్రీడాకారులందరూ మంచి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని, అప్పుడే క్రీడల్లో రాణించగలుగుతారని రామగుండం మండల విద్యాధికారి జింక మల్లేష్, వన్టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి అన్నారు.
ఆరోగ్యకరమైన జీవితానికి యోగా తప్పనిసరిగా మారిందని రామగుండం ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంత అన్నారు. ఆదివారం రామగుండం ఎన్టీపీసీలో నిర్వహించిన ఆరోగ్యం, శారీరక దృఢత్వం, కుటుంబ సంక్షేమాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఎకో పార్క్ రోడ్డులోని ఆరోగ్యపథ్ వద్ద ఆరోగ్య మేళాను ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ ప్రారంభించగా, డీఎంఎస్ అధ్యక్షులు రాఖీ సామంత ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
సమాజంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ కోయశ్రీహర్ష అన్నారు. బుధవారం కలెక్టరేట్లో సోషల్ జస్టిస్ డే వేడుకల్లో అదనపు కలెక్టర్ వేణుతో కలిసి ఆయన పాల్గొన్నారు.
భూ రికార్డులపై రైతులకు, యాజమాన్యులకు భరోసా కలిఁంచేలా లైసెన్స్ సర్వేయర్లు పని చేయా లని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి శిక్షణ పూర్తి చేసుకున్న 61 మంది సర్వేయర్లకు ధృవీకరణ లైసెన్స్ పత్రాలను అందజేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియామవళిని కచ్చితంగా పాటించాలని రామగుండం నగర పాల క కమిషనర్, అదనపు కలెక్టర్ అరుణశ్రీ తెలిపారు. బుధవారం కార్పొరేషన్ బరిలో నిలిచిన అభ్యర్థులతో ఎన్టీపీసీ పీటీఎస్లోని కాకతీయకళ్యాణ మండపంలో సమావేశం నిర్వహించారు.
పదేళ్ల పాలనలో పేదలకు ఇళ్లు ఇవ్వలేదు.. యువతకు ఉపాధి కల్పించలేదు.. ఉద్యోగాలు ఇవ్వలేదు.. దుర్మార్గ పాలన సాగించిన బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు లేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీఽధర్ బాబు అన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. బరిలో అభ్యర్థుల జాబితాను, వారి గుర్తులను ప్రకటించారు.