Home » Karimnagar
విద్యా ప్రమాణాల పెం పులో జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలిపిన కలెక్టర్ కోయశ్రీహర్షతో పాటు జిల్లా విద్యాధికారులకు ప్రశంస లభించింది. శుక్రవారం హైద రాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్, ముఖ్యమంత్రి కలెక్టర్ కోయశ్రీహర్షకు ప్రశంసాపత్రం అందించి సన్మా నించారు.
కేంద్ర ప్రభుత్వం రామగుం డం నుంచి మణుగూరు వరకు నిర్మిస్తున్న రైల్వే లైన్ పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు.
చెంచు కుటుంబాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవా రం పారుపల్లిలో చెంచుల నివాస గృహాలను కలెక్టర్ సందర్శించారు. పారుపల్లి గ్రామంలోని 15 చెంచు కుటుంబాల వారికి అవసరమైన ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, అర్హులైన వారికి పెన్షన్లు కలెక్టర్ చొరవతో అధికారులు అందించారు.
రైతుభరోసా, యూరియా సరఫరా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ రక్షణ సేన పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. శుక్రవారం బాయిబాట కార్యక్రమంలో భాగంగా ఆర్జీ 3 పరిధిలోని అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టును సందర్శించి కార్మికులతో మాట్లాడారు.
కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. కూరగాయల ధరలు రెట్టింపు కావడంతో ‘ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు’ అన్న పరిస్థితిని సామాన్య ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తోంది.
కరీంనగర్లో ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ఉద్యమకారులతో రౌండ్టేబుల్ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తెల్లవారి నుంచే తెలంగాణ భావజాలంపై దాడి ప్రారంభమైందని విమర్శించారు.
వన మహోత్సవానికి వేళయింది. వర్షాకాలం ఆరంభం అయ్యిందంటే మొక్కలు నాటేందుకు అనువుగా ఉంటుం దని భావిస్తున్న ప్రభుత్వం యేటా జూన్, జూలై మాసాల్లో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తుంది. అందులో భాగంగా జిల్లాలో ఈ ఏడాది 27 లక్షల 58 వేల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
రైతులకు నాణ్య మైన ఎరువులు, విత్తనాలు సబ్సిడీపై రాష్ట్ర ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా చేసి వినతిప త్రం అందించారు.
గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రామగుండం మేయర్ మహంకాళి స్వామి వైద్యులకు సూచించారు. రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన 4వ డివిజన్ కార్పొరేటర్ కంకణాల మౌనిక భర్త రాజును గురువారం పరామర్శించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంపుతోపాటు విద్యా ప్రమాణాల మెరుగుదలకు ప్రతీ ఒక్క ఉపాధ్యాయుడు కృషి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులు, మండల విద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు.