Home » Karimnagar
నిండుకుండలా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం ఎడారిలా మార్చిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఆదివారం ఎండిన గోదా వరిలో క్రికెట్, అష్టచమ్మ ఆటలు ఆడి నిర సన తెలిపారు. చందర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు అయినా కాళేశ్వరం ప్రాజెక్టులోని నీటిని వృథాగా సముద్రంలోకి వదులుతున్నారని, కృంగిన ప్రాజెక్టుకు ఎందుకు మరమ్మతులు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.
దళితులకు రిజర్వేషన్లు కల్పించడంలో ప్రభు త్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని సీపీఐ జిల్లా కార్య దర్శి, తాండ్ర సదానందం, దళితహక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్ళపల్లి లక్ష్మయ్యలు పేర్కొన్నారు. దళిత హక్కుల పోరాట సమితి జిల్లా రెండో మహాసభ జిల్లా కేంద్రంలో ఆదివారం కందుకూరి రాజారత్నం అధ్యక్షతన జరిగాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన బడ్జెట్ అని, తెలంగాణను తిరోగమనంలోకి నెట్టే బడ్జెట్ అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆదివారం పెద్దపల్లిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, కోరుకంటి చందర్, పుట్ట మధుకర్తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
సింగరేణి సంస్థకు రావాల్సిన రూ.51వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని, కొత్త గనులు ప్రారంభించాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాల్రాజ్, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
నగరపాలక సంస్థకు అర్బన ఇనఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ (యూఐడీఎఫ్) నిధుల నుంచి 50 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. ఈ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు రాజకీయ గ్రహణం పట్టింది. నగరపాలక సంస్థలో కొత్తగా విలీనమైన గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక వసతులను కల్పించేందుకు ఈ నిధులను మంజూరు చేశారు.
జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. యేటా వరిసాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ఎస్సారెస్పీ నీటితో చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు నిండడం, ఆశించిన స్థాయిలో సాగునీరు అందడంతో వరి సాగు రైతుల సంఖ్య యేటా పెరుగుతూ వస్తోంది.
సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) వెలుగులను పంచుతూ దేశంలోనే సహకార రంగంలో అగ్రగామిగా నిలిచింది. మరోవైపు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా సెస్ సంస్థకు బకాయిలు గుదిబండగా మారాయి. విద్యుత్ బిల్లుల చెల్లింపులో కాస్త ఆలస్యమైతేనే వినియోగదారులపై అపరాధ రుసుం విధిస్తారు.
రాష్ట్రంలోని పేద, నిరుపేద వర్గాలకు భద్రత, భరోసా కల్పించేందుకు ప్రభుత్వం నూతనంగా ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని వచ్చే జూన్ 2వ తేదీ నుంచి అమల్లోకి తీసుకవస్తామని ప్రకటించింది. దీంతో జిల్లాలో ఈ పథకం ద్వారా 2.48 లక్షల కుటుంబాలకు ఈ పథకం వర్తించ నున్నది.
గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో శనివారం వైద్యులు ఆపరే షన్ చేసి మహిళ కడుపులోంచి కణితి తొలగించారు. ఆర్జీ-1 పరిధిలోని జీడీకే 1ఇంక్లైన్ బొగ్గుగనిలో పని చేసే తిరుపతి అనే ఉద్యోగి భార్య సుమలత ఏడాదిగా కడుపునొప్పితో బాధపడుతూ వారం రోజుల క్రితం సింగరేణి ఏరియా ఆసుప త్రిలో చేరింది.
కొల నూర్ సమ్మక్క, సారలమ్మ బీటీ రోడ్డు మూ ణ్నాళ్ళ ముచ్చటగా మారుతోంది. సమ్మక్క, సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు సౌకర్య వంతంగా ఉండేందుకు కొలనూర్ ఆర్అండ్బి రోడ్డు నుంచి సమ్మక్క సారలమ్మ గద్దెల వరకు రూ.95 లక్షలు వెచ్చించి బీటీ రోడ్డును నిర్మించారు.