• Home » Karimnagar

Karimnagar

నేతన్నలకు ప్రభుత్వం అండగా ఉంటుంది

నేతన్నలకు ప్రభుత్వం అండగా ఉంటుంది

నేతన్నలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, కులవృత్తినే నమ్ముకున్న ఏ కుటుంబం కూడా ఎన్నడూ దివాలా తీయలేదని ప్రభుత్వ విప్‌,పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు కొనియాడారు. ఆర్‌ఆర్‌ గార్డెన్‌లో ఆదివారం పద్మశాలి ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమ్మేళ లో వెల్లడించారు

ప్రభుత్వ పాఠశాల ఫలితాలపై ప్రచారం చేయాలి

ప్రభుత్వ పాఠశాల ఫలితాలపై ప్రచారం చేయాలి

ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చిన మంచి ఫలి తాలు ప్రతీ ఒక్కరికి తెలిసేలా విస్తృత ప్రచా రం చేయాలని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింత కుంట విజయరమణరావు అన్నారు. ఆదివారం విద్యా వారోత్సవాల్లో భాగంగా కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా, మండల, గ్రామీణ టాపర్‌ పదో తరగతి విద్యార్థుల సన్మాన కార్యక్ర మంలో కలెక్టర్‌ కోయశ్రీహర్ష, ప్రభుత్వ విప్‌ పాల్గొన్నారు.

రాజన్న కోడెలకు పశుగ్రాసం

రాజన్న కోడెలకు పశుగ్రాసం

పాడి పంటలు చల్లగా ఉంటున్నాయని, ఇందుకు వేములవాడ రాజన్న కరుణ కటాక్షములే కారణమని భావించిన రైతులు వరి కోతల వల్ల వచ్చిన పశుగ్రాసాన్ని రాజన్న ఆలయం కోడెలకు తరలిస్తూ తమ భక్తిభావాన్ని చాటుకుంటున్నారు.

సవాలుగా మారిన ధాన్యం కొనుగోళ్లు

సవాలుగా మారిన ధాన్యం కొనుగోళ్లు

ధాన్యం కొనుగోలు సవాల్‌గా మారింది. అన్‌లోడింగ్‌ ఇబ్బందులు, మిల్లుల్లో స్థల సమస్య, కేంద్రాలలో నిర్లక్ష్యంగా కొనుగోళ్లు, లారీల కొరత, కటింగ్‌ వంటి అనేక అంశాలు రైతులు, అధికారులకు, మిల్లర్లకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఈ సీజన్‌లో వరి పంటలకు ఎలాంటి తెగుళ్ళు సోకకుండా ఇబ్బడిముబ్బడిగా దిగుబడులు వచ్చాయి.

‘సర్‌’పై కాంగ్రెస్‌ దృష్టి

‘సర్‌’పై కాంగ్రెస్‌ దృష్టి

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)పై కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక దృష్టిసారించింది. ఈ కార్యక్రమంతోపాటు సంస్థాగత నిర్మాణంపై కూడా క్షేత్రస్థాయిలో ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలని నిర్ణయించింది. మంత్రి పొన్నం ప్రభాకర్‌ తన కార్యాలయంలో శనివారం కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ స్థాయి నేతలతో సమావేశాన్ని నిర్వహించారు. అన్ని అంశాలపై సుధీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

వైద్యానికి నిధుల గ్రహణం

వైద్యానికి నిధుల గ్రహణం

గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు) నిధుల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రతీ యేటా ఆసుపత్రుల నిర్వహణ, చిన్న మరమ్మతులు, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్‌ బిల్లులు, ఫర్నీచర్‌, వైద్య పరికరాలు, అత్యవసర ఔషధాల కొనుగోలు వంటి అవసరాలకు ఇవ్వాల్సిన హాస్పిటల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ (హెచ్‌డీఎఫ్‌) సమయానికి విడుదల కాకపోవడంతో పీహెచ్‌సీల పరిస్థితి దయనీయంగా మారుతోంది.

సామాన్యుడిపై ధరాఘాతం..

సామాన్యుడిపై ధరాఘాతం..

పశ్చిమాసియా దేశాల మధ్య యుద్ధం ప్రభావం పేద, మధ్యతరగతి కుటుంబాలను వెంటాడుతూనే ఉన్నాయి. నిత్యావసర సరుకుల ధరలు పెరిగి సతమతమవుతున్న కుటుంబాలకు పెట్రోల్‌, డీజిల్‌ మంట అంటుకుంది. యుద్ధ ప్రభావంతో గ్యాస్‌ భారం మోస్తున్న సామాన్యుల బతుకు బండిపై కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరింత భారాన్ని పెంచింది.

ఆదాయం ఫుల్‌..  చెల్లింపులు నిల్‌...

ఆదాయం ఫుల్‌.. చెల్లింపులు నిల్‌...

జిల్లాలో గల వ్యవసాయ మార్కెట్‌ యార్డుల ద్వారా ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం సమకూరు తున్నా వాటి నిర్వహణకు ఆరు మాసాల నుంచి నిధులు విడుదల చేయకపోవడంతో మార్కెట్ల కార్య దర్శులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్లకు వచ్చే రైతులకు తాగునీటి సౌకర్యం కల్పించే పరిస్థితి లేదు.

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

వరి, మక్కల కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని, వడుకాపూర్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం కలెక్టర్‌ పరిశీలించారు.

 నెల రోజులుగా నిరీక్షణ

నెల రోజులుగా నిరీక్షణ

కొనుగోలు కేంద్రంలో నెలరోజుల క్రితం ధాన్యం పోసినప్పటికీ ఇప్పటికీ తూకం వేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తూకంలో జాప్యం, తరలింపులో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మండలంలోని కనగర్తిలో శనివారం రైతులు రాస్తారోకో నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి