Home » Karimnagar
గ్రామాలలో కొత్త నర్సరీ ఏర్పాటు, ప్రస్తుత నర్సరీల నిర్వహణ పకడ్బందీగా ఉండాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కాళిందిని దేవి అన్నారు. సుల్తానాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందికి శిక్షణ నిర్వహించారు.
జిల్లాలోని ఎనిమిది పాఠశాలలకు స్వచ్ఛ పాఠశాలల అవార్డును ప్రదానం చేసినట్లు కలెక్టర్ కోయశ్రీహర్ష తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో స్వచ్ఛత అంశంలో ఉత్తమ పనితీరు కనబరిచిన 8 పాఠశాలలకు జిల్లాస్థాయి అవార్డులు, ప్రశంసాపత్రాలను ఆయన అందించారు.
బీసీ సంక్షేమ సంఘం పటిష్టత, బలోపేతమే లక్ష్యంగా ప్రతీ బీసీ నాయకుడు కృషి చేయాలని తెలం గాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కందుల సదాశివ్ కోరారు. ఆది వారం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కార్యవర్గాన్ని ప్రకటించారు.
రాష్ట్రంలో విద్యారంగాన్ని పటిష్టం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు స్పష్టం చేశారు. ఆదివారం శివపల్లిలోని ఆయన స్వగృహంలో టీఆర్టీఎఫ్ జిల్లా శాఖ క్యాలండర్, డైరీని ఆయన ఆవిష్కరించారు.
జానపద కళలను భావితరాలకు అందించేలా ప్రభుత్వం కృషి చేయాలని జానపద సకలవృత్తి కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు తాళ్లపల్లి సంధ్య అన్నారు. ఆదివారం పట్టణంలోని నందనగార్డెన్ ఆవరణలో ఆ సంఘం జిల్లా కళాకారుల సమావేశం నిర్వహించారు.
జాతీయ ఉపాధిహామీ పథ కం పేరు మారుస్తూ ఎన్డీఏ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆదివా రం గోదావరిఖని గాంధీ చౌరస్తాలో ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు ఉదయ్రాజ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ ఏడాది కాలంలో సైబర్ నేరాలు, ట్రాఫిక్ ఉల్లంఘనలు గత ఏడాదికంటే అధికంగా నమోదయ్యాయి. రోడ్డు ప్రమాదాలు, హత్యలు, దొంగతనాలు గత ఏడాదితో పోల్చిచూస్తే ఇంకా అదుపులోకి రాలేదు. కిడ్నాప్లు, అత్యాచారాలు, చీటింగ్ కేసులు మాత్రం కొంత వరకు తగ్గుముఖం పట్టాయి.
జిల్లాలో 2025 సంవత్సరంలో రాజకీయం రసవత్తరంగా సాగింది. ప్రస్తుత సంవత్సరం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిపత్యం కనబరిచింది. పంచాయతీ ఎన్నికలు జరగడం, వచ్చే యేడాది జరగనున్న మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికలను టార్గెట్గా పెట్టుకోవడం తదితర కారణాల వల్ల ప్రధాన పార్టీల నేతలు జనం మధ్య తిరిగారు.
ఏడాదంతా ‘స్థానిక’ ఎన్నికల ఆశలతోనే రాజకీయ నేతలు ఎదురుచూడాల్సి వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ ఏడాది జనవరి 25న సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు ముగిసి ప్రత్యేక అధికారుల పాలన మొదలైంది. అంతకుముందు ఏడాదిలోనే పంచాయతీ, పరిషత్ పాలకవర్గాల కాలం ముగిసింది.
రామగుండం పోలీస్ కమిషరేట్లో ఈ ఏడాది క్రైమ్ రేట్ తగ్గింది. ఇదే సమయంలో చోరీలు, సైబర్ క్రైమ్ల్లో బాధితులు పోగొట్టుకున్న సొమ్మును పోలీసులు రీకవరీ చేయడంలో పురోగతి సాధించారు. గతేడాది 33శాతం రికవరీ ఉంటే ఈ ఏడాది రికవరీ చేశాతం 55కు పెరిగింది.