Home » Karimnagar
ఐదు రోజులుగా శిక్షణలో తెలుసుకున్న విషయాలను గ్రామాల అభివృద్ధికి వినియోగిం చాలని ఎంపీడీవో దివ్యదర్శన్రావు అన్నారు.
విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నతంగా ఎదగాలని ఏంఎసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి అన్నారు. శనివారం తారుపల్లి మండల పరిషత్ ప్రైమరీ పాఠశాలలో కలెక్టర్ ప్రత్యేక నిధులతో మంజూరు చేసిన డ్యూయల్ డెస్క్ బెంచీలను ఆయన ప్రారంభించారు.
గ్రామీణ ప్రాంత ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించేందుకే న్యాయ విజ్ఞాన సదస్సులను నిర్వహిస్తున్నట్లు సుల్తానాబాద్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేష్ అన్నారు. గట్టేపల్లిలో మండల న్యాయ సేవా ధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు
మండలంలోని రంగాపూర్ పరిధిలోని వీఎస్ఆర్ ఇటుక బట్టీల్లో సీనియర్ సివిల్ జడ్జి భవాని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఇటీవల ఇటుక బట్టీలో కార్మికులకు మౌలిక సదుపాయాలు లేవని లీగల్ సెల్ అఽఽథారిటి, హైదరబాద్కు ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు సీనియర్ సివిల్ జడ్జి భవానితోపాటు తహసీల్దార్ రాజయ్య, కార్మిక శాఖ అధికారి హేమలతతో కలిసి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.
సమా జంలో జరుగుతున్న సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, విద్యార్థులు తమ తల్లిదండ్రులను చైతన్య వంతులను చేయాలని రామగుండం కమిషనరేట్ షీ టీమ్ ఇన్చార్జి స్నేహలత అన్నారు. పట్టణంలోని జడ్పీ బాలుర హైస్కూల్లో శుక్రవారం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.
మండల కేంద్రంలోని రైతువేదికలో ఎంపీడీవో పొల్సాని శశికళ అధ్యక్షతన జరుగుతున్న వార్డుసభ్యుల శిక్షణ తరగ తులకు శుక్రవారం ఎస్ఐ నూతి శ్రీధర్ హాజర య్యారు. ఆయన వార్డు సభ్యులతో మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజాప్రతిని ధులు, పోలీసులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
పెద్దపల్లి నియోజవకవర్గంలో రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని, రైతులు యాప్లో నమోదు చేసుకుని ఎరువులు పొందాలని ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణారావు అన్నారు. కనుకులలో తెలంగాణ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలోని హాక కేంద్రాన్ని శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి కల్పన తెలిపారు. శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆమె పలు అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
పత్తికి మద్దతు దర దక్కక రైతులు ఆందోళన నిర్వహించారు. గురువారం పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్కు 200 మందికి పైగా రైతులు పత్తిని తీసుకవచ్చారు. క్వింటాలు పత్తికి 6 వేల నుంచి 6,500 రూపాయలు పెట్టడంతో రైతులు ఆందోళనకు దిగారు.
రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి ప్రత్యేక కృషి చేస్తుందని జిల్లా సంక్షేమ శాఖ అధికారి వేణు గోపాల్ అన్నారు. బ్రాహ్మణపల్లి రైతువేదికలో నిర్వహిస్తున్న వార్డు సభ్యుల శిక్షణలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వివరిస్తూ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్టాల్లు ఏర్పాటు చేశారు.