• Home » Karimnagar

Karimnagar

నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు

నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు

ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వ విప్‌ చింతకుంట విజయరమణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గంలో వరి, మక్కల కొనుగోళ్ళలో మాజీ ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడటాన్ని ఖండిస్తున్నామని తెలిపారు.

ఉపాధిహామీ కూలీలతో ఎమ్మెల్యే ముఖాముఖి

ఉపాధిహామీ కూలీలతో ఎమ్మెల్యే ముఖాముఖి

కుక్కలగూడూర్‌లో మంళవారం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌ ఉపాఽధిహామీ కూలీలతో ముఖాముఖి చర్చలు జరిపారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. పనులు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి పనులను పరిశీ లించారు.

అదనపు తూకంతో నష్టపోతున్న రైతులు

అదనపు తూకంతో నష్టపోతున్న రైతులు

వరి, మక్క ఉత్పత్తులు విక్రయించుకోవడానికి నెల రోజులుగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని, అదనపు తూకంతో రైతులు నష్టపోతున్నారని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం సాయంత్రం పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైస్‌మిల్లుల కేటాయింపు జరగక ముందే కొనుగోలు కేంద్రాలను ఆరంభించారన్నారు.

రంగాపూర్‌ గోదాంల సందర్శన

రంగాపూర్‌ గోదాంల సందర్శన

జిల్లాలో ప్రభుత్వం మార్క్‌ ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేసిన మక్కల నిల్వ కోసం ప్రస్తుతం అందు బాటులో ఉన్న గోదాములకు అదనంగా పెద్దపల్లి మండలం రంగా పూర్‌లో గల గోదాంలో 5 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యాన్ని సిద్ధం చేసినట్లు కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలిపారు.

ధాన్యం కటింగ్‌పై ప్రభుత్వ విప్‌ ఆగ్రహం

ధాన్యం కటింగ్‌పై ప్రభుత్వ విప్‌ ఆగ్రహం

మండల కేంద్రంలోని ఐకేపి కొనుగోలు కేంద్రంలో ధాన్యం కోతపై ప్రభుత్వ విప్‌ చింతకుంట విజయరమణరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టపోతున్న రైతులకు కోత విధించిన ధాన్యాన్ని జమ చేయాలని ఏపీఎం సంపత్‌ను ఆదేశించారు. మంగళవారం కొల నూర్‌, ఓదెల, పొత్కపల్లి జీలకుంట లోని వరి, మక్క కొనుగోలు కేంద్రా లను సందర్శించారు.

కొడుకు కేసుతో బండి సంజయ్‌కి తంటాలు..

కొడుకు కేసుతో బండి సంజయ్‌కి తంటాలు..

కరీంనగర్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై పోక్సో కేసు నమోదు కావడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ వ్యవహారాన్ని అస్త్రంగా మార్చుకున్న బీఆర్ఎస్ నేతలు బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

వేజ్‌బోర్డుకు వేళాయె

వేజ్‌బోర్డుకు వేళాయె

బొగ్గు గని కార్మికుల 12వ వేజ్‌ బోర్డు ఏర్పాటుకు కాలం సమీపి స్తోంది. జూలై 1 నుంచి 12వ వేజ్‌బోర్డు మొద లవుతుం ది. కానీ ఇప్పటికీ వేజ్‌బోర్డు కమిటీ ఏర్పాటు కోసం కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఎలాంటి కార్యాచరణకు పూనుకోలేదు. గతంలో ఒక వెజ్‌బోర్డు కాలం ముగిసే కంటే ఆరు నెలల ముందు నుంచే జాతీయ కార్మిక సం ఘాలను వెజ్‌బోర్డు నిర్మాణం కోసం నాయకుల పేర్లను ప్రతిపాదించమని కోరేది.

రైతుల కష్టాలు పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం

రైతుల కష్టాలు పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం

తెలంగాణ రైతుల కష్టాలు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వాటిని వివరించడంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విఫలమయ్యారని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మన్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మలా ్లపూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి మాట్లాడారు.

ప్రజలు జీవనశైలి మార్చుకోవాలి

ప్రజలు జీవనశైలి మార్చుకోవాలి

ప్రజలు జీవనశైలి మార్చుకోవాలని ఎన్‌సీడీ జిల్లా ప్రోగ్రాం అధికారి రాజమౌళి అన్నారు. ప్రపంచ హైపర్‌ టెన్షన్‌ సందర్భంగా గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో సోమవా రం రోగులకు అవగాహన కల్పించారు.

ప్రభుత్వ భూమి కాపాడాలని మహిళల ఆందోళన

ప్రభుత్వ భూమి కాపాడాలని మహిళల ఆందోళన

సుల్తానాబాద్‌ మండలం కనుకులలో అన్యాక్రాంతానికి గురైన 11.23 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాలం టూ కలెక్టరేట్‌ ప్రాంగణంలో గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. గ్రామం నుంచి 300కు పైగా మహిళలు, పురుషులు కలెక్టరేట్‌కు తరలి వచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి