Home » Karimnagar
సీసీఐ కేంద్రాల్లో పత్తి కొనుగోలుకు రంగం సిద్ధమైంది. పత్తి విక్రయాలను సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘కపాస్ కిసాన్’ యాప్ను తీసుకవ చ్చింది. ఈ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకుని స్లాట్ బుకింగ్ చేస్తేనే ఎంపిక చేసుకున్న సీసీఐ కేంద్రంలో పత్తిని విక్రయించుకోవాల్సి ఉంటుంది.
సింగరేణిని రక్షించుకోవడా నికి ఐక్య పోరాటాలు నిర్మిద్దామని పలు కార్మిక సంఘాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. శనివారం గోదావరిఖని ప్రెస్క్లబ్లో సింగరేణి విప్లవ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదంరాంతోపాటు పలు వురు నాయకులు మాట్లాడారు.
రక్తదానం ప్రాణదానంతో సమానమని డీసీపీ కరుణాకర్ అన్నారు. పోలీస్ అమరవీరుల వారో త్సవాల భాగంగా సుల్తానాబాద్ పోలీస్స్టేషన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.
గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శని వారం ఎన్ఎస్ఎస్ వార్షికోత్స వాన్ని ఘనంగా నిర్వహిం చారు. శాతవాహన విశ్వ విద్యాలయ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డా.మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై వలంటీర్లను ఉద్దేశించి మాట్లాడారు.
సింగరేణిలో రక్షణపై యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందని, కార్మికుల సమస్యలు పరిష్క రించడంలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ విఫలమ య్యాయని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అన్నారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు బాధ్యత తీసుకొని ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, గిరిజన సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు.
అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించేలా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే చింత కుంట విజయరమణారావు అన్నారు. పెద్దాపూర్ అనుబంద గ్రామమైన కుర్మపల్లికి మెయిన్ రోడ్డు నుంచి గ్రామం వరకు కోటి రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శుక్రవారం శంకుస్థాపన చేశారు.
గ్రామాల్లో పరిశుభ్రత పాటిస్తూ పన్నులు కూడా వసూళ్లు చేయాలని జిల్లా పంచాయతీ అధి కారి వీరబుచ్చయ్య అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మంది రంలో ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లతో సమావే శం నిర్వహించారు.
సింగరేణి కార్మిక వర్గానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం ఐఎఫ్టీయూ జిల్లా కమిటీ సమావేశం గోదావరిఖనిలో జిల్లా అధ్యక్షుడు ఈ నరేష్ అధ్యక్షతన జరిగింది.
రైతులు ఎదురు చూస్తున్న యాసంగి సన్నరకం ధాన్యానికి బోనస్ డబ్బు లు త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ఎమ్మెల్యే విజయరమ ణారావు అన్నారు. గురువారం పొత్క పల్లిలో మార్క్ఫెడ్ కేంద్రంతోపాటు ధాన్యం కొను గోలు కేంద్రాలను ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, అద నపు కలెక్టర్ వేణుతో కలిసి ప్రారం భిం చారు.