Home » Karimnagar
ఎన్టీపీసీ దక్షిణ రీజియన్ ఎగ్జిక్యూ టివ్ డైరెక్టర్ ఆరిందం సిన్హా బుధవారం రామగుండం, తెలంగాణ ఎన్టీపీసీ ప్రాజెక్టుల్లో పర్యటించారు. మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ఇక్కడికి చేరు కున్న ఆర్ఈడీ సిన్హాకు ప్రాజెక్టు ఈడీ చందన్ కుమార్ సామంత, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.
రహదారి నియమ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని పెద్దపల్లి డీసీపీ రాం రెడ్డి అన్నారు. పట్టణంలో బుధవారం రోడ్డు భద్రతా వారోత్సవాలను నిర్వహించారు. ఏసీపీ కృష్ణతో కలిసి రాజీవ్ రహదారిపై వాహన చోద కులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.
పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్గా నూగిళ్ళ మల్లయ్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ కార్యాలయంలోని రూం నంబర్ 207ను ముస్తాబు చేశా రు. ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుతో కలిసి ప్రత్యేక పూజ లు నిర్వహించారు.
గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు అధికా రులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశిం చారు. బుధవారం ఆయన కలెక్టరేట్లో 2027లో జరిగే గోదావరి నది పుష్కరాల ఏర్పాట్లపై ఈవైటీం శిశాంత్ తోపాటు సంబంధిత అధికా రులతో సమావేశం నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలను ఆర్టీఐ ద్వారా తెలుసుకుని వివరాలతో ప్రశ్నిస్తే బీజేపీ నాయకులపై దాడులు చేయించడం, అక్రమ కేసులు బనాయించడం ఎంత వరకు సమంజసమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి ప్రశ్నించారు.
అర్హులందరికి సంక్షేమ పథకాలు అందజేస్తామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పేర్కొన్నారు. పట్టణంలోని అమర్చంద్ కళ్యాణ మండపంలో మంగళవారం 213 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా పేర్కొన్నారు. మంగళవారం మున్సిపల్ జంక్షన్ వద్ద వన్టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అరైవ్, అలైవ్ రోడ్డు భధ్రత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇంటర్ పరీక్షలను కట్టుది ట్టంగా నిర్వహించాలని సీఎస్ రామకృష్ణారావు అధికారులను ఆదేశిం చారు. మంగళవారం పరీక్షల నిర్వహణపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో కలెక్టర్ కోయశ్రీహర్ష, అద నపు కలెక్టర్ అరుణశ్రీతోపాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరి ష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు డిమాండ్ చేశారు. కలెక్టరెట్ ఎదుట ధర్నా చేపట్టి కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు.
నాగర్కర్నూల్ జిల్లా కొమెర గ్రామంలో అగ్రవర్ణాల అహంకారానికి రజక కుటుంబానికి చెందిన పసికందు బలికావడం అత్యంత హేయమైన చర్య అని బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ దాసరి ఉష అన్నారు. సోమవారం కలెక్టరేట్ వద్ద బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి కలెక్టర్కు వినతిపత్రం అందించారు.