Home » Karimnagar
గోదావరిఖని గోదావరి వద్ద సమ్మక్క -సారలమ్మ జాతర మినీ మేడారం జాతరలా నిర్వహిస్తున్నట్టు ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ చెప్పారు. బుధవారం సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద వన దేవతల పునః ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే దంపతులు పూజలు నిర్వహించారు.
మధ్యవర్తిత్వంతో కేసులు సత్వరం పరిష్కారం అవుతాయని, మధ్యవర్తిత్వానికే మద్దతని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీతా పేర్కొన్నారు. జిల్లా కోర్టు భవ నంలో బుధవారం న్యాయ వ్యవస్థలో మధ్యవర్తిత్వంఅనే అంశంపై జిల్లా జడ్జీ, సీనియర్ జూనియర్ న్యాయాధికారులు, కక్షిదారులతో సమీక్ష నిర్వ హించారు.
గ్రామాల్లో విద్యుత్ సమస్యలు పరి ష్కరించేందుకు ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్ఈ గంగాధర్ అన్నారు. మంగళవారం ముత్తారం, బొంపల్లి గ్రామాల్లో ప్రజాబాట నిర్వహించారు. అనంతరం గ్రామ పంచాయతీల వద్ద గ్రామ సభలు నిర్వహిం చారు.
మున్సిపల్ ఎన్నికల రిజ ర్వేషన్లపై తర్జనభర్జన జరుగుతోంది. మున్సిపల్ చట్టం-2019 ప్రకారం మున్సిపాలిటీల్లో వరుసగా రెండు సార్లు ఒకే రిజ ర్వేషన్ కొనసాగించాల్సి ఉంటుంది. 2020లో జరిగిన ఎన్నికల్లో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో ఏ రిజర్వేషన్ అయితే వార్డులు, చైర్మన్ పదవులు ఉన్నాయో, అదే విధంగా ఈసారి కూడా రిజర్వేషన్ కావాల్సి ఉంటుంది.
ప్రతీ విద్యార్థికి కనీస విద్యా ప్రమా ణాలు అందేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. మంగళవారం చందనాపూర్ జడ్పిహెచ్ఎస్, రత్నాపూర్ ఎంపీపీఎస్ పాఠశాలలను కలెక్టర్ సందర్శించారు.
యాసంగిలో సాగుకు రైతులు సమాయత్తమవుతున్నారు. ఎస్సారెస్పీ కాలువల ద్వారా యాసంగిలోనూ చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందుతోంది. కాలువ చివరలో ఉన్న కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేట గ్రామ పరిధిలోని పొలాలకు అందుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మున్సిపల్, కార్పొరేషన్ల ఎన్నికలు ఫిబ్రవరి మొదటి వారంలోనే జరుగుతాయని ప్రచారం జరుగుతోంది. పోటీ చేయాలనుకునే ఆశావహులు రిజర్వేషన్లు ఇంకా ఖరారుకాక పోవడంతో సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు.
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే ప్రైవేటు పాఠశాలలు సిలబస్ పూర్తి చేశాయి. ప్రభుత్వ ఉపాధ్యాయులు బోధనలో వేగం పెంచారు. ఉదయం, సాయంత్రం గంట పాటు అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు.
పురపోరు సమయం సమీపిస్తుండడంతో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. సిరిసిల్ల, వేములవాడ మునిసిపాలిటీల్లో పోటీ చేసే అభ్యర్థులపై గల్లీ, గల్లీలో చర్చ మొదలైంది. మద్దతుదారుల సమీకరణలతో ఆశా వహులు హడావుడి చేస్తున్నారు.
జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ముత్యాల ముగ్గుల పోటీకి విశేష స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున మహిళలు, విద్యార్థినులు తరలివచ్చి రంగు రంగుల రంగవల్లిక లతో సంక్రాంతి పండుగను తలపించారు.