Home » Karimnagar
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధిలో మరింత వేగం పెంచుతామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. పట్టణంలోని 11, 13, 14, 15 వార్డుల్లో శనివారం ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గులు పోసి, భూమి పూజ చేశారు.
కరీంనగర్ జిల్లాకు ఆయుష్ ఆసుపత్రిని మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులు ఇచ్చింది. ఇటీవలి కాలంలో ఆయుర్వేదం, హోమియోపతి చికిత్స వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు.
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు రేపోమాపో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా పార్టీలు తమ అభ్యర్థులను బరిలో దింపేందుకు కసరత్తు చేస్తున్నాయి. జిల్లాలోని అయిదు మున్సిపాలిటీలు, 136 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నా యి.
ఎన్నికలు ఏవైనా సోషల్ మీడియా హడావుడి అంతా ఇంతా కాదు. మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరి మాసంలో నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన విషయం తెలిసిందే, ఎన్నికల నిర్వహణ కోసం కీలకమైన ఓటర్ జాబితా రూపకల్పనలో అధికారులు నిమగ్నమయ్యారు.
మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం చకచకా ఏర్పాట్లు చేస్తుండగా, రిజర్వేషన్లపై ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వక పోవడంతో ఆశావహులు అయోమయానికి గురవుతున్నారు.
జిల్లాలో ఈ నెల 28 నుంచి 31 వరకు జరిగే సమ్మక్క సారలమ్మ జాతర పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ దాసరి వేణు అధికారులను ఆదేశించారు.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. శుక్రవారం 13, 14, 32, 33వ వార్డుల్లో అర్హులైన లబ్ధిదారుల ఇండ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే భూమి పూజ చేసి ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు.
రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో నిర్మించిన 633 డబుల్ బెడ్రూమ్లను ఈ నెల 11న రాష్ట్ర మంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్టు కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. శుక్రవారం మంత్రుల పర్యటన ఏర్పాట్లపై పరిశీలించారు.
గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెం చాలని, నెలలు నిండిన గర్భిణీలను క్షేత్రస్థాయిలో నిరం తరం సంప్రదించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధి కారి ప్రమోద్కుమార్ సూచించారు.
మహిళా సంఘాల రుణాల రికవరీపై ప్రత్యేక దృష్టి సారించా లని, కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. బుధవారం కలెక్టరేట్లో సెర్ప్ కార్యకలాపాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి బ్యాంకు లింకేజీ రుణాలు పంపిణీ లక్ష్యంలో 90 శాతం పూర్తి చేశామని తెలిపారు.