Home » Karimnagar
పల్లెలు, పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రభుత్వం నిర్దేశించిన సంక్షేమ ప్రగతి పనులను పూర్తి చేయడంపై దృష్టిపెట్టిన అధికారులు పాలనను పరుగులు పెట్టించేందుకు చర్యలు చేపడుతున్నారు.
కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరి రెండేళ్లు గడిచిపోయిన సంక్షేమ పథకాలు మినహా ప్రత్యేక అభివృద్ధి మార్క్ కనిపించడం లేదనే విమర్శలు జిల్లాలో వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు పల్లెలు, పట్టణాల్లో చాలా నెలలు స్థానిక సంస్థలకు పాలకులు లేక అభివృద్ధిని పట్టించుకునే వారు లేకుండా పోయింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత మరోసారి ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టనున్నది. శుక్రవారం నుంచి జూన్ 12వ తేదీ వరకు 99 రోజులపాటు ప్రజాపాలన.. ప్రగతి నివేదన అనే అంశంపై వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేసింది.
సింగరేణిలో కార్మికుల సమస్య లను పరిష్కరించకుంటే సమ్మె తప్పదని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూని యన్ (ఏఐటీయూసీ) అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్లు పేర్కొన్నారు. గురువారం గోదావరిఖనిలో ఏఐటీయూసీ కేంద్ర కమిటీ సమావేశంలో జరిగిన వివరాలను వెల్లడిం చారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన చికిత్సలు అందించాలని, అవసరమైన మందుల కొరత రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
రామగుండం ఎన్టీపీసీ, తెలంగాణ ఎస్టీపీ ప్రాజెక్టుల్లో 55వ జాతీయ భద్రతా దినోత్సవ వేడుకలు గురువా రం నిర్వహించారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్కుమార్ సామంత పాల్గొన్నారు.
గోదావరి పుష్కర పనులకు సమగ్ర డీపీఆర్ రూపొందించనున్నట్టు రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి పేర్కొన్నారు. గురువారం కార్పొరేషన్, ఇరిగేషన్, ఎస్కే కన్సల్టెంట్ ప్రతినిధి రంగారెడ్డితో కలిసి మేయర్, డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్యలు పుష్కరాలు జరిగే గోదావరిఖని పుష్కరఘాట్, మల్కాపూర్ శివారు, సింగరేణి ఇన్టేక్ వెల్, జన గామ నదీ తీరాలను సందర్శించారు.
మావోయిస్టు అగ్రనేత గణపతి స్వగ్రామం బీర్పూర్ బుధవారం రాత్రి టెన్షన్ వాతావరణం నెలకొంది. మావోయిస్టు అగ్రనేత ఢిల్లీలో లొంగిపోతున్నాడని వార్తలు రావడంతో గ్రామంలో ఒకేసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది.
నగర సీపీ గౌస్ ఆలంపై ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డి చేసిన ఆరోపణల వెనుక బలమైన కారణమే ఉందా? బీఆర్ఎస్ ఎమ్మెల్యే వర్సెస్ కరీంనగర్ పోలీస్ బాస్ రగడ తీవ్ర చర్చనీయాంశం అవుతోందా? ..
పట్టణంలోని పలు ఆలయాలను చంద్రగహం సందర్భంగా మంగళవారం ఉదయం పూజారులు మూసి వేశారు. సాయంత్రం చంద్రగ్రహణం కావడంతో ఉదయం వేళలోనే ఆల యాల్లో సాయంత్రం, రాత్రి నిర్వహించే వైదిక కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఆలయాలను మూసి వేశారు.