Home » Karimnagar
రైతు లు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని కొండా లక్ష్మణ్ ఉద్యానవన శాఖ విశ్వ విద్యాలయం ఉపకులపతి దండ రాజిరెడ్డి అన్నారు. కూనారంలో సోమవారం కృషి విజ్ఞాన కేంద్రం రామ గిరి ఖిల్లా, వ్యవసాయ అనుబంధ శాఖల సహ కారంతో రైతు సదస్సు నిర్వహించారు.
త్వరలోనే యాసంగి,వానకాలం సన్న రకాలకు బోనస్ డబ్బులు చెల్లిస్తామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. సోమవారం కొలనూర్, గోపరపల్లిలో వ్యవసాయ సహకార సంఘం, ఐకేపి ఆధ్వర్యంలో నిర్వహించే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.
జిల్లాలో 48వేల ఎకరాల్లో రైతులు పత్తి పంటను సాగు చేశారని, తద్వారా 5.5 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందనే అంచనా వేసిన ట్లు జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ప్రవీణ్ రెడ్డి అన్నారు. చిన్నకల్వలలోని శ్రీవెంకటేశ్వర జిన్నింగ్ మిల్లులో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్రావుతో కలిసి సోమవారం ప్రారంభించారు.
ఏఐ ల్యాబ్ ద్వారా విద్యా ప్రమాణాలు పెంపొందించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. సోమవారం రంగాపూర్లోని జిల్లా పరిషత్, ప్రాథమిక ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలల్లో 3 నుంచి 5వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఏఐ కంప్యూటర్ ల్యాబ్ ను పరిశీలించారు.
ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదుల కొరతతో ఉపాధ్యాయులు, విద్యార్థులు సమస్యలు ఎదుర్కొం టున్నారు. మంథని మండలంలో 42 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. అందులో 10 పాఠశాలలో సింగిల్ తరగతి గది ఉన్న పాఠశాలలు ఉండగా రెండు పాఠశాలలకు సొంత భవనాలు లేక ప్రైవేటు భవనాలలో పాఠశాలలు నిర్వహిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బకాయిల వెంటనే చెల్లించాలని ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి ఆట సదయ్య డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఐఎంఏ భవన్లో జిల్లా శాఖ అధ్యక్షుడు మేరుగు సతీష్ అధ్యక్షతన జరిగిన జిల్లా కౌన్సిల్ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
తుఫాన్ కారణంగా ఇటీవల కురిసిన అకాల వర్షాలతో తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కొనిపించే బాధ్యత తనదేనని, ఈ విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు హామీ ఇచ్చారు.
సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు సిద్ధమని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి రాజ్కుమార్ అన్నారు. ఆదివారం గోదావరిఖని ప్రెస్క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకు పాలకవర్గ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కరీంనగర్, జగిత్యాలలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా సాధారణ ఎన్నికల తరహాలో ఉదయం 7 గంటల నుంచే బ్యాంకు సభ్యులు (ఓటర్లు) తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు.
భూముల క్రయ విక్రయాలకు సంబంధించి సాదాబైనామాల క్రమబద్ధీకరణకు న్యాయపరమైన చిక్కులు తొలగిపోయాయి. దరఖాస్తుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రైతుల ఏళ్ల నాటి నిరీక్షణకు తెరపడింది.