Home » Karimnagar
తొలకరికే తొందరపడి విత్తనాలు వేయొద్దని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. వాతావరణంలో మార్పులతో వానాకాలంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ ప్రభావం వ్యవసాయ ఆధారిత జిల్లా అయిన జగిత్యాలపై పడుతుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎ
జిల్లాలో ఇప్పటికే పౌరసరఫరాల శాఖ యాసంగిలో ధాన్యం కొనుగోలు అంచనా దాటి సేకరిం చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో యాసంగి ధాన్యం దిగుబడి 4 లక్షల 56 వేల 664 మెట్రిక్ టన్నులు వస్తుందని అంచనా వేశారు. ఇందులో పౌరసరఫరాల శాఖ 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 3 లక్షల 3,940 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. మరో వారం రోజుల పాటు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం కొనసాగనుంది.
జిల్లాలో గల మహాత్మా జ్యోతిభాఫూలే గురుకుల విద్యాలయాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదు. ప్రభుత్వం విద్యా ర్థులకు సరిపడా మెస్ చార్జీలను పెంచినప్పటికీ పౌష్టికాహారం లభించడం లేదు. కూరగాయలు, చికెన్, మటన్, కోడిగుడ్లు సర ఫరా చేసే కాంట్రాక్టర్లు నాణ్యత లేని, నాసిరకం సరుకులను సర ఫరా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
సమిష్టి కృషితో రామగుంగం నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందామని మేయర్ మహంకాళిస్వామి పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం ఎన్సీఓఏ క్లబ్లో కాలనీలోని ఏడు డివిజన్లలో వార్డు సభ జరిగింది.
ప్రకృతి సమతుల్యతను కాపాడడంలో పక్షులు, వన్యప్రాణులు కీలకమని మంథని అటవీ రేంజ్ అధికారి ఎం.విన య్నాయక్ అన్నారు. శనివారం పారుపల్లి గ్రామ పరిధిలో మైదంబండ బీట్, బేగంపేట సెక్షన్లో ఉన్న పారుపల్లి పెద్ద చెరువు వద్ద బర్డ్ వాక్స్ అండ్ వైల్డ్ లైఫ్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఎల్నినో వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, పంట మార్పిడితో అధిక లాభాలు పొందవచ్చని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి గడ్డం శ్యాం ప్రసాద్ అన్నారు. శనివారం మండలంలోని పెద్దబొంకూర్లో రాజేశం అనే రైతు అయిల్పామ్ సాగు చేయగా క్షేత్రస్థాయిలో ఉద్యానవన శాఖ అధికారులు సందర్శించారు.
నేరస్థులకు శిక్ష పడడంలో కోర్టు డ్యూటీ పోలీస్ అధికారుల పాత్ర కీలక మని సీపీ అంబర్ కిశోర్ ఝా అన్నారు. శనివారం కమి షనరేట్లో కోర్టు డ్యూటీ, లైజనింగ్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు పెను ప్రమాదం తప్పింది. మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ జన్మదిన వేడుకల్లో పాల్గొనడానికి కరీంనగర్కు ఎమ్మెల్యే వెళ్లారు. అయితే, కెమిస్ట్ భవన్ రెండో అంతస్తు నుంచి దిగుతూ లిఫ్ట్ ప్రమాదానికి గురైంది.
సింగరేణిలో అవినీతి, కుంభకో ణాలకు కారణం బీఆర్ఎస్సేనని రామగుండం నగర మేయర్ మహం కాళి స్వామి బీఆర్ఎస్ నాయకులను ప్రశ్నించారు. శుక్రవారం ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పదేళ్లు సింగరేణిని దోచుకున్న కేసీఆర్, బీఆర్ఎస్ నాయకులు దద్దమ్మల్లాగా మాట్లాడుతున్నారని, బీఆర్ఎస్ హఠావో అనే నినాదంతోనే 2023లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ను బొందపెట్టి కాంగ్రెస్ను కార్మికులే అధికారంలోకి తీసుకువచ్చాన్నారు.
పెద్దపల్లి నియోజక వర్గ పరిధిలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసి సం బంధిత రైస్మిల్లులకు తర లించేందుకు చర్యలు చేప ట్టామని ప్రభుత్వ విప్, ఎమ్మె ల్యే చింతకుంట విజయరమ ణారావు తెలిపారు.