Home » Karimnagar
మహిళల భద్రత, సైబర్ నేరాల నియంత్రణకు ప్రతీ వ్యక్తి బాధ్యతగా ముందుకు రావాలని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి కోరారు. సోమవారం ఎన్టీపీసీ కాకతీయ హాల్లో అధికారులతో కలిసి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
పెద్దపల్లి పట్టణానికి చెందిన తనకు డబుల్ బెడ్ రూము ఇళ్లు మంజూరు చేయాలని ఎండీ షబానా డీఆర్వో రాజేశ్వరిని కోరారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి హాజరైన ఆమె దరఖాస్తు చేసుకోగా హౌసింగ్ ఈఈకి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
నీట్ ప్రశ్నపత్రం లీక్, ఎస్ఎస్సీజీడీ పరీక్ష నిర్వహ ణలో లోపాలు, సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల మార్కుల గోల్మాల్ను నిరసిస్తూ ఎన్ఎస్ యూఐ ఆధ్వర్యంలో సోమవారం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మను దహనం చేశా రు.
మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు అబద్దాలు ఆడడంలో పట్టా పుచ్చుకున్నాడని రాష్ట్ర ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు విమర్శించారు. జిల్లా కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కరీంనగర్ జిల్లాలో సంచలనం సృష్టించిన పీఎంజే జ్యువెలరీ రాబరీ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో చోరీకి గురైన బంగారు ఆభరణాల ఆచూకీ ఇంకా తెలియకపోవడం పోలీసులకు సవాల్గా మారింది.
ప్రజ లు ఎలాంటి భయం లేకుండా ప్రశాంత వాతావరణంలో జీవిం చేందుకు భరోసా కల్పించడం పోలీసు శాఖ ప్రధాన బాధ్యత అని రామగుండం పోలీస్ కమిషనర్ అం బర్ కిశోర్ ఝా అన్నారు.
రైతులు కాం గ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలో చెప్పాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు ప్రశ్నిం చారు. జిల్లా కేంద్రంలోని తిరుమల గార్డెన్లో ఆదివారం మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరై మాట్లాడారు.
సింగ రేణిలో సగం మంది కారుణ్య ఉద్యోగులేనని, బీఆర్ఎస్ పదేళ్లపాలనలో కారుణ్య నియామ కాల పేర 19,500మంది ఉద్యోగాలు పొందారని మాజీ మంత్రి హరీష్రావు అన్నారు. టీబీజీకే ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం ఎన్టీపీసీలోని ఒక ఫంక్షన్హాల్లో కాంగ్రెస్ హఠావో, సింగరేణి బచావో నినాదంతో సింగరేణి పరిరక్షణ సద స్సుకు ఆయన హాజరయ్యారు.
ఆరోగ్యకరమైన జీవనం కోసం హ్యాపీ సండే కార్యక్రమం అవసరమని రామగుండం మేయర్ మహంకాళి స్వామి అన్నారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన హ్యాపీ సండే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు డిజిటల్ స్ర్కీన్స్కు అలవాటు పడి శారీరక, మానసిక సామర్ధ్యాన్ని కోల్పోతున్నారన్నారు.
గ్రానైట్ అక్రమాలపై కేంద్రం దృష్టిసారించింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్థానికంగా ఈ వ్యవహారంపై సీఐడీ విచారణకు ఆదేశించగా కేంద్ర ప్రభుత్వం రెండున్నరేళ్లుగా ఈ అక్రమ దందాలు, వేల కోట్ల స్వాహా అంటూ వచ్చిన ఫిర్యాదుల ఫైళ్ల గుట్టు విప్పేందుకు సిద్ధమైంది.