Home » Karimnagar
పర్యా వరణ పరిరక్షణలో విద్యార్థుల భాగస్వామ్యం ఎంతో అవసరమని ప్రాంతీయ కార్యాలయం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసిస్టెంట్ సైం టిస్ట్ కనకజ్యోతి అన్నారు. గురువారం జ్యోతి నగర్లోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎన్సీసీ విద్యార్థులకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు.
రామగుండం నియోజకవర్గంలో నిరుద్యోగులను పోటీపరీక్షలకు సిద్ధం చేసేందుకు ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ ఆధ్వర్యం లో హైదరాబాద్కు చెందిన పీజేఆర్ కోచింగ్ సెంటర్ సమన్వయంతో ఉచిత శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు మేయర్ మహంకాళి స్వామి, శిక్షణ నిర్వాహకుడు జగదీశ్వర్రెడ్డి పేర్కొన్నారు. గురువారం మేయర్ చాంబర్లో విలేకరుల సమా వేశంలో మాట్లాడారు.
సింగరేణి సంస్థలో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న మారుపేర్లు, విజిలెన్స్ కేసుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని గురువారం ఆర్జీ-1 ఏరియా జీఎం కార్యాలయాన్ని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్, టీజీబీకేఎస్ నాయకులు, బాధిత కుటుంబాల సభ్యులు ముట్టడించారు.
తరుగు పేరిట కోతలు లేకుండా ఈ యాసంగి సీజన్లో జిల్లాలో రికార్డు స్థాయిలో వరి, మొక్కజొన్న ఉత్పత్తులను కొనుగోలు చేశామని ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు అన్నారు. తమ ఉనికి కోసం ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేశాయని, వారికి రైతులే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను భారీగా పెంచడంతో పాటు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది.
గోదావరిఖని ఆర్టీసీ డిపోలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని టీఎంయూ డిపో కార్యదర్శి వంగర శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం ఇన్చార్జి డీజీఎం రామన్నకు వినతిపత్రం అందజేశారు.
ప్రశాంతంగా ఉన్న మంథనిని అల్లకల్లోలంగా మంత్రి శ్రీధర్బాబు మారుస్తున్నారని, శ్రీధర్బాబు అడుగులకు మడుగులొత్తే పోలీసులను వదిలిపెట్టమని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్ను మంగళవారం తెల్లవారుజామున అక్రమంగా అరెస్టు చేసి గోదావరిఖని ఏసీపీ కార్యాలయానికి తరలించారు.
నేరాల నియంత్రణలో సాంకేతికత కీలకమని, సీసీ టీఎన్ఎస్ 2.0 ఈ సాక్ష్యం అమలును వేగ వంతం చేయాలని పోలీస్ అధికారులకు రామగుండం సీపీ అంబర్ కిశోర్ఝా సూ చించారు. మంగళవారం కమిషనరేట్లో పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమా వేశాన్ని నిర్వహించారు.
నియోజకవర్గంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వరి, మొక్కజొన్న కేంద్రాలపై 50 రోజులు దృష్టి పెట్టానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో పలు గ్రామాలకు చెందిన 66 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.
దక్షిణ భారత ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, త్రిలింగ క్షేత్రమైన కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణానికి సర్వం సిద్ధమైంది.