Home » Karimnagar
ముల్కల పల్లి, కమాన్పూర్, రాజాపూర్, గుండారం, పేరపల్లి, సిద్దిపల్లె, నాగారం గ్రామాల్లో సోమవారం సెర్ప్ ఆధ్వ ర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏఎంసీ చైర్మన్ వైనాల రాజు ప్రారంభించారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దన్నారు.
రామగుండం ఫెర్టిటైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్)లో సోమవారం తెల్లవారుజామున యూరియా ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. యూరియా ప్లాంట్లో గ్యాస్ పైప్లైన్కు సంబంధించి సాంకేతిక సమస్యతో లీకేజీ ఏర్పడింది. దీంతో యూరియా ఉత్పత్తిని నిలిపివేశారు.
అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతుల పక్షాన పరిహారం ఇప్పించే వరకు బీజేపీ అం డగా నిలుస్తోందని మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆయన నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఆయిల్ పామ్ సాగును వ్యవసాయ సహ కార సంఘాలు ప్రోత్సహించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం కలెక్ట రేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లడుతూ జిల్లాలో ఆయిల్ పామ్ సాగును మరింత విస్తృత పరిచే దిశగా ,రైతులను వ్యవసాయ శాఖ, అధికారులు, సహకార సంఘాల చైర్మన్లు ప్రోత్సహించా లన్నారు.
కేంద్ర ప్రభుత్వం కరీంనగర్-జగిత్యాల రోడ్డును జాతీయరహదారిగా-563గా ప్రకటించింది. ఈ రోడ్డును నాలుగులైన్లతో విస్తరించేందుకు ఏడేళ్ల క్రితమే 2,227 కోట్ల రూపాయలు కేటాయించింది.
పదో తరగతి మెమోల్లో తప్పులను అదిగమించడానికి విద్యాశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. విద్యార్థి చదువుకు ప్రధాన ఆధారం వయో నిర్ధారణ...సబ్జెక్ట్ జ్ఞానం వంటి అంశాల కోసం అవసరమైన పాఠశాల రికార్డులు అత్యంత ముఖ్యమైనవి. వీటిలో ముఖ్యంగా టెన్త మోమోలు, సర్టిఫికెట్లు కీలకపాత్ర పోషిస్తాయి. విద్యార్థి, తల్లిదండ్రులు, ఇంటిపేరు వంటి వివరాల్లో తప్పులు చోటు చేసుకుంటే భవిష్యత్తులో అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
యాసంగి పంటల సాగుకు వ్యవసాయ శాఖ అధికారులు యాక్షన్ ప్లాన్ ఖరారు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్నా చెరువులు, కుంటలు ప్రాజెక్ట్లలో సాగు నీరు సమృద్ధిగా ఉండడంతో దానికి అనుగుణంగానే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు.
రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్)లో కీలకమైన హెచ్టీఆర్ వైఫల్యంపై కేంద్రం సీరియస్గా తీసుకుంది. కేంద్రం రూ.6వేల కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ పరిశ్రమలో టెక్నాలజీ వైఫల్యంతో ఈ ఏడాది సుమారు 4నెలల పాటు ఉత్పత్తి నిలిచిపోయింది.
సింగరేణిలో కార్మికుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఆర్జీ-1 బ్రాంచి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు శనివారం జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
మతిస్థిమితం లేక ఇంటిని, ఊరును, కన్నవారిని వదిలివెళ్లిన వ్యక్తి 12 సంవత్సరాల అనంతరం స్వగ్రామానికి చేరుకున్నాడు. పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన పట్టెం వెంటకరాములు 25 ఏళ్ల వయసులో మానసిక స్థితి సరిగా లేకపోవ డంతో గ్రామాన్ని విడిచి వెళ్లిపోయాడు.