Home » Karimnagar
చెత్త సేకరణలో అమలు చేస్తున్న డ్రైవర్ కం ఆపరేటర్ పాలసీని రామగుండం నగరపాలక సంస్థలో అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా కార్పొరేషన్ పరిధిలోని ఏడు డివిజన్లలో ఇంటింటా చెత్త సేకరణ బాధ్యతను టెండర్ ద్వారా ఒక ఏజెన్సీకి అప్పగించారు.
పెరుకపల్లి గ్రామ ప్రజలంతా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని శనివారం నిర్ణయం తీసుకున్నారు. మండల విద్యాధికారి పి. ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహిం చిన బడిబాటలో గ్రామ పంచాయతీ పాలకవర్గం పాల్గొన్నారు.
సింగరేణి కార్మికులకు మెడికల్ బోర్డ్ నిర్వహించాలని, మారు పేర్ల సమస్యను పరిష్కరించి కార్మికులకు న్యాయం చేయా లని శనివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జీఎం కార్యాల యం ఎదుట ధర్నా నిర్వహించారు. గోదావరిఖని విఠల్ నగర్ హనుమాన్ టెంపుల్ నుండి ఆర్జీ-1 జీఎం కార్యా లయం వరకు ర్యాలీ చేపట్టారు.
పట్టుదలతో శ్రమిస్తే విజయం సాధించవచ్చని నిరూపించాడు కేశనపల్లికి చెందిన పెగుడ రాజేందర్.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేశ్ బి. గీతేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్లలోని కుసుమ రామయ్య ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన ‘మన బడి – మన బాధ్యత’ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు.
గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీ యూ) ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వ హించారు. అనంతరం కలెక్టర్ కోయ శ్రీహర్షకు వినతిపత్రం సమర్పిం చారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో 12 సంవత్సరాలుగా దేశం అన్ని రంగాల్లో అద్భుతమైన పురోగతి సాధించిందని బీజేపీ రాష్ట్ర నాయకులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరెడ్ల ప్రవీణ్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవినీతి, విధానపరమైన స్తబ్దతతో ఉన్న దేశాన్ని నేడు ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనన్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి ఇటుక బట్టీ లలో పని చేసేందుకు వస్తున్న వలస కార్మి కులకు కనీస వసతులు కల్పించాలని జిల్లా ప్రఽధాన న్యాయమూర్తి కుంచాల సునిత అన్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవ సందర్భంగా శుక్రవారం రాఘవ పూర్ ఇటుక బట్టీలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.
సింగరేణి సంస్థను నామరూపాలు లేకుండా చేయడం కోసమే దుర్మార్గమైన ప్రయత్నాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆర్జీ-1 జీడీకే ఓసీపీ-5లో శుక్రవారం బొగ్గు నిల్వలను మాజీ ఎమ్మె ల్యే పుట్ట మధూకర్, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డితో కలిసి ఆయన పరిశీలించి ప్రభుత్వం చూపి స్తున్న బొగ్గు నిల్వలు లెక్కల వాస్తవాలు వివరించారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రవేశపెట్టిన తీర్థయాత్రల స్పెషల్ ప్యాకేజీలకు ప్రయాణీకుల నుంచి ఆదరణ లభిస్తున్నది.