• Home » Karimnagar

Karimnagar

ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలి

ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలి

సూపర్‌ ఎల్‌ని నో ప్రభావంతో జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెల కొన్న నేపథ్యంలో వరి సాగుకు బదులుగా ప్రత్యా మ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికా రులను ఆదేశించారు.

రైతుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం

రైతుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం

రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఆరోపించారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు.

విద్యార్థుల పోరాటానికి తొలి విజయం

విద్యార్థుల పోరాటానికి తొలి విజయం

నీట్‌ యూజీ-2026 పేపర్‌ లీకేజీ ఘటనపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయడం విద్యార్థులు చేపట్టిన ఉద్యమానికి తొలి విజయమని ఎన్‌ఎస్‌యూఐ నాయకులు అన్నారు. ఆదివారం గోదావరిఖని చౌరస్తాలో విజయోత్సవాలు నిర్వహించారు.

రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం

రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం

పెద్దపల్లి పట్టణంలోని మెయిన్‌ రోడ్డు విస్తరణకు మున్సిపల్‌ పాలకవర్గం సిద్ధమైంది. పెరిగిన జనాభా దృష్యా రోడ్డు విస్తరణకు నిర్ణయించి నిధులు కేటాయించారు. అయితే మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం కాకుండా విస్తరణ కొంత తగ్గించాలని పలువురు వ్యాపారులు మున్సిపల్‌ చైర్మన్‌ను కోరారు.

కార్పొరేషన్‌లో ఖాళీలను భర్తీ చేయాలి

కార్పొరేషన్‌లో ఖాళీలను భర్తీ చేయాలి

రామగుండం నగరపాలక సంస్థలో వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సీపీఐ కార్పొరేటర్‌ మార్కపురి సూర్య, ఆ పార్టీ రాష్ట్ర సమితి సభ్యుడు గోషిక మోహన్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం భాస్కర్‌రావు భవన్‌లో సీపీఐ నగర ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

డబుల్‌ రోడ్డు నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి

డబుల్‌ రోడ్డు నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి

డబుల్‌ రోడ్డు నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు అన్నారు. ఆదివారం ర్యాకల్‌దేవ్‌పల్లి శివాలయం నుంచి ముప్పిరి తోట, ధూళికట్ట వరకు రూ.12 కోట్ల నిధులతో నిర్మిస్తున్న రోడ్డు పనులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

అంత్యక్రియలకు అవస్థలు..

అంత్యక్రియలకు అవస్థలు..

నగరంలోని మానేరు నదీ తీరంలోని హిందూ శ్మశానవాటిక నిర్వహణను నగరపాలక సంస్థ పూర్తిగా గాలికి వదిలేసింది. 2017 సంవత్సరంలో ఆనాటి పాలకవర్గం నగరంలోని మూడు ప్రధాన శ్మశానవాటికలను వైకుంఠధామాలుగా అభివృద్ధి చేసేందుకు సీఎం హామీ నిధులను కేటాయించింది.

గమ్యం చేరని పయనం

గమ్యం చేరని పయనం

రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ వాహన దారుల ప్రాణాల మీదకు తెస్తోంది. జిల్లాలో ఈ యేడాది తొలి ఏడు నెలల్లోనే 238 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఇందులో 78 మంది మృతిచెందగా, 140 మంది తీవ్ర గాయాలపాలు కావడం ఆందోళన కలిగిస్తోంది.

వేలిముద్ర పడాల్సిందే..

వేలిముద్ర పడాల్సిందే..

పేద, మధ్య తరగతి కుటుంబాలకు అందిస్తున్న రేషన్‌ సరుకులు నిజమైన లబ్ధిదారులకు అందే విధంగా మూడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ఈ-కేవైసీ ప్రక్రియ మొదలుపెట్టింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2024 సంవత్సరంలో మొదలైన ఈ-కేవైసీ మొదట్లో వేగంగానే నిర్వహించినా ఆ తర్వాత లబ్ధిదారుల్లో నిర్లక్ష్యం, అధికారులు దృష్టి సారించకపోవడం, డీలర్లు పట్టించుకోకపోవడంతో ఈ-కేవైసీ ప్రక్రియ మందగించింది.

 వన మహోత్సవంపై ఎల్‌నినో ఎఫెక్ట్‌

వన మహోత్సవంపై ఎల్‌నినో ఎఫెక్ట్‌

వనమహోత్సవం కార్యక్రమంపై ఎల్‌నినో ప్రభావం పడింది. వర్షాలు పడని కారణంగా జిల్లాలో మొక్కలు నాటే కార్యక్రమం ముందుకు సాగడం లేదు. ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో నీళ్లు లేక వెలవెలబోతున్నాయి. భూగర్భ జలాలు సైతం రోజు రోజుకు అడుగంటి పోతున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి