Home » Kalyanadurgam
సత్యసాయి తాగునీటి పథకంలో పని చేస్తున్న కార్మికుల సమ్మె నాలుగోరోజుకు చేరింది. శుక్రవారం పీఏబీఆర్ డ్యాం లోని సత్యసాయి తాగునీటి ప్రాజెక్టు వద్ద కార్మికులు నిరసనకు దిగారు. వేతనాలు చెల్లించాలని, న్యాయ మైన కోర్కెలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
మండలంలో రీసర్వే పనులు సక్ర మంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన బుధవారం శెట్టూరు మండలం లోని కైరేవు గ్రామంలో రీసర్వే పనులలో భాగంగా సర్వే నంబర్ 25లో జరుగుతున్న గ్రౌండ్ ట్రూథింగ్ పనులను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు.
మండలకేంద్రమైన కంబ దూరు మారెమ్మ దేవాలయం వద్ద ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించిన మ్యాన హోల్ లీకేజీ అవుతోంది. దీంతో మురుగునీరంతా రోడ్డుపై పారుతోంది. రెండేళ్ల నుంచి ఈ సమస్య ఉన్నప్పటికీ సం బంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు.
గత ఐదేళ్ల వైసీపీ పాలన అంతా ఆ పార్టీ నాయకులు దోచుకుని, దాచుకున్నారని ఎమ్మెల్యే అమిలి నేని సురేంద్రబాబు విమర్శించారు. కంబదూరు మండల పరిఽధిలోని మేళ్లకుంట క్రాస్ నుంచి ఐపార్శపల్లి వరకు రూ. 3కోట్లతో చేపట్టిన సుమారు ఎనిమిది కిలోమీటర్ల తారు రోడ్డు పనులను ఎమ్మెల్యే శనివా రం ప్రారంభించారు.
పట్టణంలో ఏడు పెట్రోల్ బంకులు ఉండగా ఆరింటిలో నో స్టాక్ బోర్డులు పెట్టేశా రు. దీంతో పెట్రోలు కోసం ప్రజలు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటు న్నారు. పట్టణంలోని కోర్టు పక్కన ఉన్న పెట్రోల్ బంకులో మాత్రమే సోమవారం పెట్రోల్, డీజిల్ వేస్తుండగా వాహనదారులు బారులు తీ రారు.
మండల పరిధిలోని శ్రీరంగాపురం రంగమ్మ చెరువులో అధికారుల పర్యవేక్షణ లోపంతో మట్టి మాఫియా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఈ చెరువులోని ఒండ్రుమట్టికి మంచి గిరాకీ ఉంది. దీంతో గ్రామానికి చెందిన ఇద్దరు వైసీపీ నాయకులు పది రోజుల నుంచి ఎక్స్కవేటర్లు పెట్టి తరలిస్తూ దోపిడీ చేస్తున్నారు.
మండల పరిధిలోని జంబు గుంపల ఆటవీ ప్రాంతంలో అక్రమంగా ఎర్రమట్టిని తరలిస్తున్న ట్లు స్థా నిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ విష యాన్ని ఆటవీ శాఖ అధికారులకు తెలియజేసి నా నిర్లక్ష్యం వహిస్తూ ఎర్రమట్టి తరలించేం దుకు వారే సహకరిస్తున్నారని మండిపడుతు న్నారు.
వారసత్వ సంపదను కాపాడుకుని భవిష్యత్తు తరాలకు అందిద్దామని రాష్ట్ర పురావస్తు శాఖ సహాయ సంచాలకులు స్వామినాయక్ పిలుపునిచ్చారు. ప్రపంచ వారసత్వ దినోత్సవంలో భాగంగా శనివారం మండల కేంద్రంలో రాష్ట్ర పురావస్తు శాఖ, ప్రపంచ వారసత్వ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో హెరిటేజ్ వాక్ కార్యక్రమం నిర్వహించారు.
పట్టణంలోని ఏపీ ఎన్జీవో హోమ్లో గురువారం జిల్లా ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు జె. మాధవ, ప్రధాన కార్యదర్శి ఎ. రవికుమార్, ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్య దర్శి జీ పాతిరెడ్డి, ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి ఆధ్వ ర్యంలో కళ్యాణదుర్గం, కంబదూరు, కణేకల్లు జేఏసీ ఎన్నికలు నిర్వ హించారు.
ఆకతాయి చేష్టలకు వృక్ష సం పద కాలిబూడిదై కనుమరుగవుతోంది. మండలంలోని జంబుగుంపల, ఎనుములదొడ్డి గ్రామాల సమీపంలో ఆటవీ ప్రాంతాలతో పాటు పెద్ద కొండలు అధికంగా ఉన్నా యి. సహజ సిద్ధంగా అనేక వృక్షాలు సమృద్ధిగా పెరిగాయి.