Home » Kalyanadurgam
ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యు వల్ చేయాలని మండల కేంద్రంలోని ఫాదర్ ఆలయం ఎదుట మంగళ వారం వైసీపీ కళ్యాణదుర్గం సమన్వ యకర్త తలారి రంగయ్య ఆధ్వ ర్యంలో లక్ష పోస్టుకార్డుల ఉద్యమం ప్రారంభించారు. ఈ కార్యక్ర మాని కి వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ మంగమ్మ, నియోజకవర్గాల సమన్వయ కర్తలు సాకే శైలజానాథ్, విశ్వేశ్వరరెడ్డి, జడ్పీ చైర్పర్సన బోయ గిరిజమ్మ, నియోజకవర్గ పరిశీలకులు మహేం దర్ రెడ్డి, నాయకులు ఉమామహేశ్వర నాయుడు, తిప్పేస్వామి హాజర య్యారు.
‘నన్ను కమర్షియల్ ట్యాక్స్ కట్టమని అడిగేందుకు నువ్వెవరు? నువ్వేమైనా జిల్లా కలెక్టరా? లేక జిల్లా స్థాయి అధికారివా’? అంటూ ఓ వైసీపీ నాయకుడు పంచా యతీ కార్యదర్శిపై మంగళవారం చిందులు తొక్కాడు. వ్యాపార సము దాయాలకు హౌస్ ట్యాక్స్ కాకుండా కమర్షియల్ ట్యాక్స్ కట్టాలని పంచా యతీ కార్యదర్శి మహేష్ మంగళవారం నోటీసులు తీసుకుని ఆ వైసీపీ నాయకుడి ఇంటికి వెళ్లాడు.
మున్సిపాలిటీ పరిధిలోని జాతీయ రహదారి 554డీడీ లో గూబనపల్లి వద్ద మమవప్రమా దాలకు నిలయంగా మారిం ది. నిత్యం ఏదో ఒక చోట ప్ర మాదం జరుగుతూనే ఉంది. అయినా రోడ్డుపై అవసరమై న చోట్ల్ల స్పీడ్ బ్రేకర్లు, హె చ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం గమనార్హం.
మండల పరిధిలోని కంబదూరు వద్ద శుక్రవారం ఆటో బోల్తా పడి నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. కంబదూరు ప్రాంతానికి చెందిన బొమ్మలాట సుబ్బారావు అనే వ్యక్తి మృతి చెందిన నేపథ్యంలో అనంతపురం నుంచి రాజు, ఉమాపతి, రాఘవేంద్ర, లక్ష్మీదేవి శుక్రవారం ఆటోలో వస్తున్నారు. కంబదూరు చెరువు కట్ట ప్రాంతానికి చేరుకునే స మయంలో ఆటో ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తాపడింది.
మండల కేంద్రంలోని రాధా స్వామి విద్యాలయం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జాతీయ సైన్స దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యా యురాలు సుశీల అధ్యక్షతన ఏర్పాటు చేసిన సైన్స దినోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎంఈవో తిప్పేస్వామి, ఎస్ఐ మహేష్ హాజరయ్యారు.
నియోజకవర్గ ప్రజల కల నెరవేర్చేందుకు త్వరలో కళ్యాణదుర్గంలో నిర్వహిం చే నగరవనం పార్కు ప్రా రంభోత్సావానికి రావాలని ఉప ముఖ్యమంత్రి పవన కళ్యాణ్ను ఎమ్మెల్యే అమిలి నేని సురేంద్రబాబు విజ యవాడలో శుక్రవారం ఆ హ్వానించారు. దీనికి ఆయ న సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
మండల పరిధిలోని అపిలేపల్లి మండల పరిషత ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం మండల స్థాయి సైన్స మేళా పోటీలలో గెలుపొందిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఉపాధ్యాయులు అభినందించారు.
మండల పరిధిలోని ఎనుములదొడ్డి గ్రామంలో మురు గునీరు రహదారిలోకి చేరి నిత్యం మురుగు గుంటగా మారు తోంది. స్థానిక ప్రధాన రహదారి నుంచి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం వరకు సీసీ రోడ్డు లేదు.
శాంతిభద్రత పరిరక్షణ కోసం రేయింబవళ్లు కష్టపడుతున్న పోలీసుల నివాసం కోసం మండల కేంద్రంలో నిర్మించిన క్వార్టర్లు శిథిలావస్థకు చేరాయి. దీంతో విధులు నిర్వహించి వచ్చిన సిబ్బందికి విశ్రాంతి తీసుకోవడానికి సౌకర్యం లేదు. నివాస గృహాల్లోనే కాదు స్టేషన భవనంలోకి పాములు వస్తున్నాయని స్థానిక స్టేషనలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది భయాందోళన చెందు తున్నారు.
ఆనారోగ్యంతో అనంతపురంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరిని మంగళవారం మాజీ ఎమ్మెల్యే ఆర్ జితేంద్రగౌడ్ పరామర్శించారు. విషయం తెలుసుకున్న జితేంద్రగౌడ్ హాస్పిటల్కు వెళ్లి ఉన్నం ఆరోగ్య పరిస్థితి పై ఆయన కుమారుడు మారుతీ చౌదరిని ఆడిగి తెలుసుకున్నారు.