Home » Kalyanadurgam
మండల పరిధిలోని జంబు గుంపల ఆటవీ ప్రాంతంలో అక్రమంగా ఎర్రమట్టిని తరలిస్తున్న ట్లు స్థా నిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ విష యాన్ని ఆటవీ శాఖ అధికారులకు తెలియజేసి నా నిర్లక్ష్యం వహిస్తూ ఎర్రమట్టి తరలించేం దుకు వారే సహకరిస్తున్నారని మండిపడుతు న్నారు.
వారసత్వ సంపదను కాపాడుకుని భవిష్యత్తు తరాలకు అందిద్దామని రాష్ట్ర పురావస్తు శాఖ సహాయ సంచాలకులు స్వామినాయక్ పిలుపునిచ్చారు. ప్రపంచ వారసత్వ దినోత్సవంలో భాగంగా శనివారం మండల కేంద్రంలో రాష్ట్ర పురావస్తు శాఖ, ప్రపంచ వారసత్వ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో హెరిటేజ్ వాక్ కార్యక్రమం నిర్వహించారు.
పట్టణంలోని ఏపీ ఎన్జీవో హోమ్లో గురువారం జిల్లా ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు జె. మాధవ, ప్రధాన కార్యదర్శి ఎ. రవికుమార్, ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్య దర్శి జీ పాతిరెడ్డి, ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి ఆధ్వ ర్యంలో కళ్యాణదుర్గం, కంబదూరు, కణేకల్లు జేఏసీ ఎన్నికలు నిర్వ హించారు.
ఆకతాయి చేష్టలకు వృక్ష సం పద కాలిబూడిదై కనుమరుగవుతోంది. మండలంలోని జంబుగుంపల, ఎనుములదొడ్డి గ్రామాల సమీపంలో ఆటవీ ప్రాంతాలతో పాటు పెద్ద కొండలు అధికంగా ఉన్నా యి. సహజ సిద్ధంగా అనేక వృక్షాలు సమృద్ధిగా పెరిగాయి.
ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన జర్నలిస్టు కాలవ రమణ కుటుంబానికి ఎమ్మెల్యే అమి లినేని సురేంద్రబాబు రూ. లక్ష ఆర్థికసాయాన్ని అందించారు. ఆయన మంగళవారం పట్టణంలోని ప్రజావేదిక వద్ద కాలవ రమణ కుటుంబసభ్యులకు ఈ సాయం అందించారు.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వెలుగుచూసిన ఈ హైటెక్ మోసం ఉదంతం స్థానికంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఏకంగా లక్షల కోట్లు తన ఖాతాలో ఉన్నాయని నమ్మించి, కోట్లాది రూపాయల వసూళ్లకు పాల్పడిన వైసీపీ నేత వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
కూటమి ప్రభుత్వం కృషితోనే కేంద్ర ప్రభుత్వం ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ ను రెన్యువల్ చేసిందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశలు పలు మార్లు కేంద్రంపై ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు.
పశువుల మేత కోసం ని యోజకవర్గంలోని రైతులకు కష్టాలు మొదలయ్యాయి. స్థానికంగా ఎక్క డా పశువుల మేత దొరకకపోవడంతో కర్ణాటక ప్రాంత నుంచి పశుగ్రా సాన్ని తెప్పించుకుని పశువుల ఆకలి తీరుస్తున్నారు.
కంబదూరు మండల కేంద్రంలోని కమల మల్లేశ్వర స్వామి ఉత్సవాల్లో భాగంగా బుధవారం స్థానిక గ్రంథాలయ ఆవరణంలో ఉట్ల పరుషను అత్యంత వైభవంగా గ్రామపెద్దల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మహిళలు, యువకులు, పెద్దలు అనే తారతమ్యం సంబరాల్లో పాల్గొన్నారు.
హంపి పున్నమి ఉత్స వాల్లో భాగంగా కంబదూరు కమల మల్లేశ్వరస్వామి రథోత్సవం మంగళ వారం మండల కేంద్రంలో అశేష భక్త జనం నడుమ కన్నుల పండువ గా సాగింది. ఉదయం ఆలయంలో శివపార్వతులకు విశేష పూజలు చే శారు