Home » Kalyanadurgam
శెట్టూరు మండల పరిధిలోని ల క్ష్మంపల్లికి చెందిన సత్యన్న అనే రైతు పొలంలోని ట్రా న్సఫార్మర్ను ఆది వారం రాత్రి దుండగులు ధ్వంసం చేశారు. అందులోని రాగి వైరును ఎత్తుకెళ్లినట్లు రైతు సత్యన్న సోమవారం శెట్టూరు పోలీస్స్టేషనలో ఫిర్యాదు చేశా డు.
కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతోందని, మరో 15 ఏళ్ల పా టు కూటమి అధికారంలో ఉంటుందని ఎమ్మెల్యే అమిలినేని సురేం ద్రబాబు పేర్కొన్నారు. పట్టణంలోని ప్రజావేదిక వద్ద శనివారం అన్న దాత సుఖీభవ పథకాన్ని ఆర్డీవో వసంతబాబు, ఏడీఏ ఎల్లప్పతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.
కంబదూరు మండల పరిధిలోని చెన్నంపల్లికి చెందిన గులగానప్ప అనే విద్యార్థి పదో తరగతి పరీక్షల్లో 568 మార్కులు సాధించాడు. ఆ విద్యార్థి ని అభినందిస్తూ కంబ దూరు ఎస్ఐ లోకేశ కు మార్ రూ. 5 వేలు ఆర్థికసాయం అందించారు.
బీటీ ప్రాజెక్టు కాలువ పనులు ఆపింది జగనరెడ్డేనని, ఆ విషయాన్ని వైసీపీ నేతలు తెలుసుకో వాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు. పట్టణంలో ని ప్రజావేదిక వద్ద మంగళవారం రాష్ట్రంలో రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం, దేశంలో 12 ఏళ్ల విశ్వాస్, వికాస్, జన కళ్యాణ్ విజయోత్సవా లను ఘనంగా నిర్వహించారు.
రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు అన్నారు. పట్టణంలోని ప్రజావేదిక వద్ద సోమవారం ఖరీఫ్ - 2026 రాయితీ వేరుశనగ విత్తన పంపిణీని ఎమ్మెల్యే అమిలినేని సురేం ద్రబాబు, జిల్లా వ్యవసాయ శాఖాధికారి సాలురెడ్డి ప్రారంభించారు.
స్థానిక మున్సిపాల్టీ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పే ర్కొన్నారు. ఆయన శనివారం పట్టణంలోని స్వగ్రామంలో కళ్యాణదుర్గం మున్సిపాల్టీ పరిధిలోని టీడీపీ క్లస్టర్, కో క్లస్టర్, యూనిట్ ఇనచార్జ్ లు, బూత ఇనఛార్జ్లకు సర్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
మండల కేంద్రంలో కుం దుర్పమ్మ జాతరలో భాగంగా చివరి రోజు గురువారం సాయంత్రం గావు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జాతర ముగుస్తున్న సందర్భంగా ఉదయం నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి కుందుర్పమ్మ, పాతప్ప ఆలయాల వద్ద మొక్కులు తీర్చుకున్నారు.
ఈ యేడాది ఖరీఫ్ సీజనకు ముందే వర్షాలు కురవడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. దీంతో వేసవి దుక్కులు, సేద్యాలు చేయడంలో నిమగ్నమయ్యారు. కాడెద్దులు, ట్రాక్టర్పై ఆధారపడి వ్యవసాయ పనులు చేస్తున్నా రు.
కంబదూరు మండల పరిధిలోని జెల్లిపల్లిలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో కురిసిన ఎడతెరిపి లేని వర్షం ధాటికి గ్రామంలోని కల్వర్టు కొట్టుకుపోయింది. దీంతో సుమారు ఐదు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యా యి.
రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ పండుగలా జరుగుతోందని ఎమ్మెల్యే అమిలి నేని సురేంద్ర బాబు అన్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా 36504 పింఛన్లు ఉండగా రూ. 16.07 కోట్లు అందిస్తున్నామని, లక్ష్మంపల్లి పంచాయతీలోనే 535 పింఛన్లకు రూ. 23.77 లక్షలు అందిస్తున్నామన్నారు.