Home » Kalvakuntla Taraka Rama Rao
కేంద్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్ మంజూరు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా జాప్యం చేస్తోందని, వివక్షాపూరితంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.
సీఎం రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రివా..? ముఠా నాయకుడివా..? అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు..
తెలంగాణలో రానున్న మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా బీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. ఎన్నికలపై సీరియస్గా దృష్టి సారించిన పార్టీ, ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వ్యూహాత్మకంగా ప్రణాళికలు రచిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఉమ్మడి జిల్లాల వారీగా వరుసగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీని సంస్థాగతంగాా బలోపేతం చేయడం, స్థానిక సమస్యలు, ఎన్నికల వ్యూహాలపై ఈ సమావేశాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది..
కృష్ణానీటిపై ఒకరోజు, గోదావరి నీటిపై మరోరోజు చర్చ పెట్టాలని అనుకున్నామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. రెండేళ్లుగా ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. సభకు వచ్చి కేసీఆర్ అనుభవాలు తమతో పంచుకోవాలని తాను పదేపదే ఆయన్ను కోరుతున్నానని అన్నారు..
రేవంత్రెడ్డికి పాలమూరు మీద ప్రేమ లేదని... ఆయనకు భూములు, రియల్ ఎస్టేట్ల మీద మాత్రమే ప్రేమ ఉందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజల్లో ఆదరణ లేకపోవడంతోనే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఈ ఫలితాలు వచ్చాయని ఎద్దేవా చేశారు.
మాజీమంత్రి కేటీఆర్ అవినీతిలో కూరుకుపోయి ఈరోజు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. ఆయనకు ముఖ్యమంత్రి కావాలనే ఆశ ఉన్నట్లుందని చెప్పుకొచ్చారు. కొందరు తన బొమ్మను అడ్డం పెట్టుకుని ఊరేగుతున్నారని ఎద్దేవా చేశారు.
ఒక నెలలోపు పెండింగులో ఉన్న పదవులు అన్నీ భర్తీ చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్ఫష్టం చేశారు. ఆదిలాబాద్లో కాంగ్రెస్ పటిష్ఠంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రజల నుంచి తమ ప్రభుత్వానికి అపూర్వ ఆదరణ వస్తోందని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా సర్పంచ్లను కాంగ్రెస్ గెలిచిందని పేర్కొన్నారు.
కేసీఆర్ హయాంలో పేదలకు రేషన్ కార్డులు ఇవ్వాలనే ఆలోచనే చేయలేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విమర్శించారు. పేదలందరికీ తమ ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇచ్చామని స్పష్టం చేశారు. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆదివారం బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు కేటీఆర్.
ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ని విచారించడానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. గవర్నర్ అనుమతి ఇవ్వడంతో ఈ కేసులో ఏసీబీ అధికారులు వేగంగా చర్యలు చేపట్టారు.