Home » Kalvakuntla kavitha
పదేళ్లు తెలంగాణను పరిపాలించి, బీసీ వర్గాలకు ఏమైనా చేశారా..? అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మంత్రి సీతక్క ప్రశ్నించారు.
‘‘అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ను అమలు చేయాలి. బీసీలకు 42ు రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిచాలి.
అందరి ఆకలితీర్చే రైతన్నలను ప్రభుత్వపరంగా ఆదుకోవాల్సిందిపోయి.. రైతుభరోసా పథకానికి నిబంధనలంటూ సీఎం రేవంత్రెడ్డి అన్నదాత లకు సున్నంపెట్టే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.
పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ బీసీలను వంచించిందని, వారికి న్యాయంగా దక్కాల్సిన నిధులను ఏ ఒక్క సంవత్సరంలో కూడా ఖర్చు చేయకుండా నిట్టనిలువునా ముంచిందని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు.
ఎన్నికల సమయంలో కామారెడ్డి సభలో ఆర్భాటంగా బీసీ డిక్లరేషన్ ప్రకటించిన సీఎం రేవంత్రెడ్డి వాటిని ఎందుకు అమలు చేయడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు.
తెలంగాణ పాలిట కాంగ్రెస్ పార్టీ శనిలా దాపురించిందని, కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అన్యాయానికి గురవుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.
బీసీలపై కల్వకుంట కవిత మొసలి కన్నీరు కార్చడం మానుకోవాలని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్రావు హితవు పలికారు. సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద సమగ్ర శిక్షా ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మెకు ఆయన ఆదివారం సంఘీభావం తెలిపారు.
‘బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కోలేకనే నాపై, కేటీఆర్పై కాంగ్రెస్, బీజేపీలు కలిసి అక్రమ కేసులు పెడుతున్నాయి.
బీసీ రిజర్వేషన్లపై హడావుడి చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు అసలు బీసీలతో ఏం సంబంధమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు.
‘‘కాంగ్రెస్ ఇచ్చిన హమీ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు 42 శాతానికి పెంచాలి. ఈ హామీని పట్టించుకోకుండా ఎన్నికలకు వెళ్లాలని ప్రయత్నిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం’’ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు.