రాజకీయ పార్టీగా జాగృతి.. ఈసీకి కవిత దరఖాస్తు
ABN, Publish Date - Jan 27 , 2026 | 09:34 AM
తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మార్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి కవిత ఇప్పటికే దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. జాగృతి ప్రతినిధులు ఢిల్లీకి వెళ్లి దరఖాస్తును సమర్పించినట్లు సమాచారం.
హైదరాబాద్, జనవరి 27: సొంతపార్టీ ఏర్పాటు దిశగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వేగంగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మార్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఇప్పటికే దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. జాగృతి ప్రతినిధులు ఢిల్లీకి వెళ్లి దరఖాస్తును సమర్పించినట్లు సమాచారం. నిబంధనల ప్రకారం.. మూడు నెలల్లో తెలంగాణ జాగృతికి రాజకీయ పార్టీగా గుర్తింపు దక్కే అవకాశముందని జాగృతి శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. అనుకున్నట్లుగా 3 నెలల్లో గుర్తింపు దక్కితే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జాగృతి బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇందుకు అనుగుణంగా కవిత ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
తగ్గనున్న యూరోపియన్ కార్ల ధరలు!
Read Latest Telangana News And Telugu News
Updated at - Jan 27 , 2026 | 09:38 AM